కోణార్క్కు వందేభారత్ కష్టాలు
సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ కోసం ఇతర రైళ్లను ఎక్కడ పడితే అక్కడ గంటల తరబడి నిలిపి వేస్తున్నారు. శుక్రవారం చింతపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్లు కోణార్క్ ఎక్స్ప్రెస్ (11019)ను గంట పాటు నిలిపి వేశారు.
న్యూస్టుడే, కాజీపేట
చింతలపల్లి వద్ద నిలిచిపోయిన కోణార్క్ ఎక్స్ప్రెస్
సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ కోసం ఇతర రైళ్లను ఎక్కడ పడితే అక్కడ గంటల తరబడి నిలిపి వేస్తున్నారు. శుక్రవారం చింతపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్లు కోణార్క్ ఎక్స్ప్రెస్ (11019)ను గంట పాటు నిలిపి వేశారు. ఇలా ప్రతి రోజూ జరుగుతుండడంతో మహబూబాబాద్, ఖమ్మం రోజువారీగా వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
- కోణార్క్ ఎక్స్ప్రెస్ శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు సికింద్రాబాద్కు రావాల్సి ఉండగా 4.31 గంటలకు వచ్చింది. ముంబయి నుంచి ఆలస్యంగా వచ్చిన సమయంలో వందేభారత్, కోణార్క్ ఎక్స్ప్రెస్ రైళ్ల సమయం కొద్ది తేడాతో ఉండటం వల్ల కాజీపేట లేదా వరంగల్ పరిసర ప్రాంతాల్లో కోణార్క్ను నిలిపి వేస్తున్నారు. వరంగల్కు వందేభారత్ ఎక్స్ప్రెస్ ఉదయం 6.40 గంటలకు వస్తుంది. ఈసమయంలో శుక్రవారం కోణార్క్ ఎక్స్ప్రెస్ చింతలపల్లి రైల్వే స్టేషన్ దాటి వెళ్లింది. వందేభారత్ ను పంపడానికి దాన్ని చింతపల్లి రైల్వే స్టేషన్లో నిలిపి వందేభారత్ను పంపారు. ఇదే సమయంలో రెండు గూడ్సు రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్ల సమయం ఉండటంతో వాటిని పంపడానికి కోణార్క్ను అరగంట పాటు అక్కడే నిలిపి వేశారు. మహబూబాబాద్కు ఉదయం 6.32 గంటలకు వెళ్లాల్సి ఉండగా 9.06కు, ఖమ్మంకు 7.20 బదులు 9.45కు వెళ్లింది. కాజీపేట నుంచి ఉదయం ఖమ్మం, మహబూబూబాద్ వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు కోణార్క్ను ఆశ్రయిస్తున్నారు.
- వందేభారత్ వచ్చాక కోణార్క్ వేళలు గందరగోళంగా మారాయని, దీంతో ప్రయాణికులకు రైల్వే మీద నమ్మకం పోతుందని మాధవ్ అనే ప్రయాణికుడు వాపోయారు.
- ఉదయం కాజీపేట నుంచి ఖమ్మం వెళ్లు పుష్పుల్, ఇతర రైళ్లు ఆలస్యం అవుతున్నాయని.. కోణార్క్ను ఆశ్రయిస్తే ఇది కూడా అలాగే అవ్వడం వల్ల విలువైన సమయం వృథాకావడంతో పాటు కార్యాలయాలకు, వ్యాపారం, కళాశాలలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని శోభ అనే ప్రయాణికురాలు తెలిపారు.
- ఈ విషయంపై స్థానిక రైల్వే ట్రాఫిక్ అధికారులను వివరణ కోరగా ముంబయి నుంచి వచ్చే కోణార్క్ ఆలస్యం కావడం వల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. ముంబయి రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి కోణార్క్ సరైన సమయానికి నడిచేలా చూస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిశ్శబ్ద సమయం.. అభ్యర్థుల అంతర్మథనం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు శనివారం సాయంత్రం ప్రచారానికి తెరపడింది. -
ప్రచారం.. ఎవరెక్కడ ముగించారంటే..!
[ 12-05-2024]
నెల రోజుల ఎన్నికల ప్రచారానికి తెరపడింది. వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం చివరి రోజైన శనివారం సాయంత్రం 5 గంటల వరకు ప్రజలను కలిసే ప్రయత్నం చేశారు. -
ఓట్ల పండగకు సొంతూళ్లకు పయనం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడటంతో ప్రజలు తమ సొంతూళ్లకు పయనమయ్యారు. -
కాకతీయ వైభవం ఉట్టిపడేలా పోలింగ్ కేంద్రాలు
[ 12-05-2024]
హనుమకొండ జిల్లాలో పోలింగ్కు సర్వం సిద్ధమైందని జిల్లా ఎన్నికల అధికారిణి సిక్తా పట్నాయక్ తెలిపారు. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్వో), కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. -
ఓటు వేయడం సామాజిక బాధ్యత
[ 12-05-2024]
‘ఓటు కేవలం హక్కు మాత్రమే కాదు. సామాజిక బాధ్యతగా ఓటర్లు గుర్తించాలి. వేసవి ఎండలు, అకాల వర్షాల దృష్ట్యా పోలింగ్కు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. -
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు
[ 12-05-2024]
ఈనెల 13న నిర్వహించే లోక్సభ ఎన్నికల్లో జిల్లా ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కోరారు. -
పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
[ 12-05-2024]
మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లాలో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. -
మావోయిస్టు ప్రభావిత కేంద్రాల్లో పటిష్ఠ భద్రత
[ 12-05-2024]
సోమవారం జరగనున్న లోక్సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎసీˆ్ప శబరీష్ అన్నారు. -
మాతృమూర్తులూ.. మరవొద్దు ఓటు!
[ 12-05-2024]
అమ్మ.. పిల్లల కోసం ఎంతటి త్యాగమైనా చేస్తుంది.. గోరుముద్దలను తినిపించి వారిని గొప్పవారిగా తీర్చిదిద్దుతుంది..ఆప్యాయతానురాగాలు పంచి మాతృత్వపు మాధుర్యం రుచి చూపిస్తుంది..వారి బంగారు భవిష్యత్తు కోసం మరో పనికి శ్రీకారం చుట్టాలి.. -
పోస్టుకార్డులతో ఓటరు చైతన్యం
[ 12-05-2024]
ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు ఓటు వేసేలా చైతన్యం కలిగించేందుకు స్వయం కృషి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పోస్ట్కార్డులతో ఓట్ ఫర్ షూర్(vote for sure) పేరిట వినూత్న ప్రచారం నిర్వహించారు. -
క్షణాల్లో పోల్ చీటీ ప్రత్యక్షం
[ 12-05-2024]
ఒకప్పుడు అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలు ఇంటికి పోల్ చీటీ తెచ్చి ఇచ్చేవారు. -
ఎన్నికల విధుల ఉద్యోగులకు వేతనం ఖరారు
[ 12-05-2024]
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారులకు ఎన్నికల సంఘం వేతనాలు ఖరారు చేసింది. -
సామగ్రి సకాలంలో కేంద్రాలకు చేరేలా చర్యలు
[ 12-05-2024]
ఈవీఎం స్ట్రాంగ్రూంలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య శనివారం రాత్రి పరిశీలించారు. -
144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. -
పోలింగ్ కేంద్రం లేని పంచాయతీ!
[ 12-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లాలంటే వయోజనులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ చిత్తు.. బెంగళూరుకు వరుసగా ఐదో విజయం
-
కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీల పొత్తు.. శశిథరూర్ ఏమన్నారంటే?
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!