logo

స్వగ్రామానికి గౌతమ్ మృతదేహం

ఈనెల 21న అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండలంలోని శివునిపల్లి గ్రామానికి చెందిన పార్శి కమల్ కుమార్ పద్మ దంపతుల పెద్ద కుమారుడు పార్శి గౌతమ్ కుమార్(19) మృతదేహంఏడు రోజుల అనంతరం నేడు స్వగ్రామానికి చేరుకుంది.

Updated : 28 Apr 2024 13:57 IST

స్టేషన్ ఘన్‌పూర్: ఈనెల 21న అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండలంలోని శివునిపల్లి గ్రామానికి చెందిన పార్శి కమల్ కుమార్ పద్మ దంపతుల పెద్ద కుమారుడు పార్శి గౌతమ్ కుమార్(19) మృతదేహంఏడు రోజుల అనంతరం నేడు స్వగ్రామానికి చేరుకుంది. దీంతో గౌతమ్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. గౌతం మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పూలమాల వేసి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.  పార్శి గౌతమ్ కుమార్ అమెరికాలోని అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో తన మిత్రులతో కలిసి కారులో విశ్వవిద్యాలయం నుంచి వస్తుండగా ట్రక్కు వెనుక నుండి కారును బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గౌతమ్ కుమార్‌తో పాటు హుజురాబాద్‌కు చెందిన ముక్క నివేశ్ (20) సైతం అక్కడికక్కడే మృతి చెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని