స్వగ్రామానికి గౌతమ్ మృతదేహం
ఈనెల 21న అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండలంలోని శివునిపల్లి గ్రామానికి చెందిన పార్శి కమల్ కుమార్ పద్మ దంపతుల పెద్ద కుమారుడు పార్శి గౌతమ్ కుమార్(19) మృతదేహంఏడు రోజుల అనంతరం నేడు స్వగ్రామానికి చేరుకుంది.
స్టేషన్ ఘన్పూర్: ఈనెల 21న అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండలంలోని శివునిపల్లి గ్రామానికి చెందిన పార్శి కమల్ కుమార్ పద్మ దంపతుల పెద్ద కుమారుడు పార్శి గౌతమ్ కుమార్(19) మృతదేహంఏడు రోజుల అనంతరం నేడు స్వగ్రామానికి చేరుకుంది. దీంతో గౌతమ్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. గౌతం మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పూలమాల వేసి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. పార్శి గౌతమ్ కుమార్ అమెరికాలోని అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో తన మిత్రులతో కలిసి కారులో విశ్వవిద్యాలయం నుంచి వస్తుండగా ట్రక్కు వెనుక నుండి కారును బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గౌతమ్ కుమార్తో పాటు హుజురాబాద్కు చెందిన ముక్క నివేశ్ (20) సైతం అక్కడికక్కడే మృతి చెందాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాస్వామ్య పండగకు ఇదే మా ఆహ్వానం
[ 13-05-2024]
ఈ రోజు కులమతాలకు అతీతంగా, దేశమంతా కలిపి జరిపే ఓ వేడుక జరుగుతోంది. అదేనండీ! ప్రజాస్వామ్య పండగ.. ఓటు పర్వదినం. ఈ వేడుకకు ఓటు హక్కు పొందిన వారంతా తరలిరావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నా. -
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
[ 13-05-2024]
వరంగల్ మహాత్మా గాంధీ స్మారక(ఎంజీఎం) ఆసుపత్రిలో ఆదివారం ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకొని ఎంజీఎం నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
భారం అనుకోవద్దు.. బాధ్యతగా ఓటేద్దాం!
[ 13-05-2024]
తెలంగాణ శాసనసభ ఎన్నికలు.. గతేడాది నవంబరు 30న జరిగాయి. ఉమ్మడి వరంగల్ 12 అసెంబ్లీ స్థానాల్లోని చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పోటెత్తారు. కొన్ని చోట్ల దాదాపు 100 శాతానికి చేరువగా ఓటింగ్ నమోదైంది. -
ఓటరు స్లిప్లోనే సమగ్ర సమాచారం
[ 13-05-2024]
ఓటరు స్లిప్ చేతికి అందగానే చాలా మంది వారి పేరు, ఓటరు ఐడీ సంఖ్య, పోలింగ్ బూత్ నెంబర్ చూసుకుంటారు. కానీ దాని మీద ఉండే క్యూఆర్ కోడ్, వెనక వైపు ఉన్న సూచనలను పట్టించుకోరు. -
దూరాభారమైనా బాధ్యతగా.. భావితరాలకు స్ఫూర్తిగా
[ 13-05-2024]
ఇది వాజేడు మండలం బొల్లారం గ్రామం. ఇక్కడ 219 మంది ఓటర్లు ఉండగా, వీరు 6 కి.మీ దూరంలోని ఆర్.గుంటపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్నారు. ఇదే మండలంలో గుట్టలపై దట్టమైన అడవిలో ఉన్న పెనుగోలు గ్రామంలో 22 మంది ఓటర్లు ఉంటారు. -
వెయ్యి మంది పోలీసులతో పటిష్ఠ భద్రత
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖా పరంగా అన్ని చర్యలు చేపట్టామని ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సర్వం సిద్ధం..!
[ 13-05-2024]
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ పక్కాగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం జరగనున్న ఎన్నికల ప్రక్రియలో విధులు నిర్వహించే సిబ్బంది.. -
అప్రమత్తంగా ఉండాలి
[ 13-05-2024]
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ అధికారి సుధీర్ రాంనాథ్ కేకన్ సూచించారు. -
అంతర్జాలం ద్వారా పోలింగ్ నిర్వహణ పర్యవేక్షణ
[ 13-05-2024]
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ సెగ్మెంట్లలో సోమవారం పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కలెక్టరేట్లో ఆదివారం ప్రత్యేక ఎన్నికల కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. -
ఎన్నికల నిర్వహణకు భారీ భద్రత
[ 13-05-2024]
సోమవారం జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను పంపిణీ కేంద్రాల నుంచి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు భారీ భద్రత మధ్య తరలించామని జిల్లా ఎస్పీ శబరీష్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటు కోసం ద్విచక్రవాహనంపై దంపతుల సాహస యాత్ర!
-
మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
-
‘వివేకం’ సినిమాకు 2.15 కోట్లకు పైగా వీక్షణలు
-
డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
-
రూ.4 వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐ తలుపు తట్టిన ఏపీ సర్కార్
-
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి