గుడ్డు ధర నిర్ణయం తీరుపై అభ్యంతరం
ధర చెప్పకుండా ఉత్పత్తిదారుల వద్ద గుడ్లు తరలిస్తూ, కొన్ని రోజుల తరువాత తక్కువ సొమ్ము ముట్టజెప్పడంపై కోళ్లఫారాల నిర్వాహకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
దేవరపల్లిలో ఆందోళన చేస్తున్న కోళ్లఫారాల రైతులు
దేవరపల్లి, న్యూస్టుడే: ధర చెప్పకుండా ఉత్పత్తిదారుల వద్ద గుడ్లు తరలిస్తూ, కొన్ని రోజుల తరువాత తక్కువ సొమ్ము ముట్టజెప్పడంపై కోళ్లఫారాల నిర్వాహకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దళారుల తీరు కారణంగా సుమారు 50 కోళ్లఫారాలు మూతపడ్డాయని ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ఛైర్మన్ కేవీ ముకుందరెడ్డి అన్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో సోమవారం తూర్పు, పశ్చిమ, కృష్ణా ఉమ్మడి జిల్లాల కోళ్ల రైతులు ఆందోళన చేపట్టారు. అంతకుముందు ఆదివారం రాత్రి దేవరపల్లిలో ఉత్పత్తిదారుల నుంచి కొందరు నాలుగు లారీల్లో గుడ్లు రహస్యంగా తరలించబోగా కోళ్లఫారాల నిర్వాహకులకు విషయం తెలిసి అడ్డుకున్నారు. గుడ్లకు సోమవారం నాటి ధర వర్తింపజేయాలన్న షరతుతో లారీలను విడిచిపెట్టారు. ఏ రోజు ధర ఆ రోజే ఖరారు చేసి గుడ్లు తీసుకెళ్లాలని కోళ్లఫారాల నిర్వాహకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 1,200 కోళ్ల ఫారాలు ఉండగా, 5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నట్లు ముకుందరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 40 శాతం గుడ్లు వినియోగిస్తుండగా, 60 శాతం ఎగుమతి అవుతున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కోళ్లఫారాలు ఏర్పాటు చేస్తున్న వారి వద్ద గుడ్లు కొంటామని బెదిరిస్తూ వర్తకులు గిట్టుబాటు ధర రైతులకు ఇవ్వకుండా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. కొవిడ్ తరువాత ప్రపంచ వ్యాప్తంగా గుడ్ల వినియోగం పెరిగిందన్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 450 ఆహారపదార్థాల్లో గుడ్డుకు మొదటిర్యాంకు ఇచ్చిందన్నారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గుడ్డు ధర పెరగడంతో కొరత ఏర్పడిందన్నారు. తణుకు, కోల్కత్తా, పంజాబ్ ప్రాంతాల్లో వర్తకులు సిండికేట్గా ఏర్పడి మద్దతు ధర రానివ్వడంలేదన్నారు. గుడ్డు ధర రూ.4.80 నుంచి రూ.4.90 వరకు ఉన్న సమయంలో రూ.4.45 ముట్టజెప్పారన్నారు. కేంద్రం ఎగ్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాల్లో గుడ్లు కూడా విక్రయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దృష్టికి కోళ్లపరిశ్రమ ఇబ్బందులు తీసుకెళ్లగా ఓ విధానాన్ని రూపొందించి ఆదుకుంటామని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ముకుందరెడ్డి డిమాండ్ చేశారు. ఆందోళనలో సంఘం కార్యదర్శి పడాల సుబ్బారెడ్డి, ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల జోనల్ ఇన్చార్జులు గంగాధరరావు, కుటుంబరావు, గన్నమని హరికృష్ణ, రైతులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాను ఓటుతో కొట్టు
[ 11-05-2024]
అధికార వైకాపా వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉండి ప్రధాన కూడలిలో శుక్రవారం జరిగిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. -
అయిదేళ్లూ.. ధరల దండయాత్ర
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్ల పాటు ధరల దండయాత్ర చేసింది. నిత్యావసరాలు మొదలు ఇంధనం, విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు ఇలా అడ్డగోలుగా ధరలు పెంచి సామాన్యుడి నడ్డివిరిచింది. -
సైకో పోవాలి.. సైకిల్ రావాలి
[ 11-05-2024]
‘రైతుకు సాగు నీరు అందాలన్నా..గిట్టుబాటు ధర రావాలన్నా..యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా..పోలవరం పూర్తి కావాలన్నా..అమరావతి రాజధాని కావాలన్నా..నిత్యావసరాల ధరలు విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు తగ్గాలన్నా 13న మీరేం చేయాలి’ అంటూ ప్రజలను తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. -
మాటలు కోటలు.. జీతాల్లో కోతలు!
[ 11-05-2024]
అయిదేళ్ల జగన్ పాలనలో ప్రభుత్వోద్యోగులు అష్టకష్టాలు పడ్డారు. ప్రతినెలా ఒకటో తేదీ వేతనాలు అందకపోగా... ఇతరత్రా సౌకర్యాలను పొందలేకపోయారు. -
నోట్లకు.. ఓట్లు రాలతాయా?
[ 11-05-2024]
పోలింగ్కు మరికొన్ని గంటలే మిగిలి ఉండటంతో అభ్యర్థులు ప్రచారాలతో పాటు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. -
ప్రైవేటు బస్సు ఆపరేటర్ల బాదుడు
[ 11-05-2024]
ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ప్రయాణికులను భారీగా బాదేస్తున్నారు. -
మట్టి మాఫియా మళ్లీ బరితెగింపు
[ 11-05-2024]
అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో తలమునకలవుతోంది. ఇదే అదనుగా మట్టి మాఫియా ఆచంట మండలం అనగార్లంక, అంబేడ్కర్ కోనసీమ జిల్లా బెల్లంపూడి సరిహద్దులో రెండు రోజులుగా విజృంభించింది. -
పోయేది జనం ప్రాణాలేగా?
[ 11-05-2024]
అనుకోని విపత్తులు విరుచుకు పడితే ప్రభుత్వం దన్నుగా నిలబడాలి. నేనున్నానంటూ భరోసానివ్వాలి. వైకాపా సర్కారుకు మాత్రం ఇవేమీ పట్టవు. -
వైద్యం.. ఇదేం దౌర్భాగ్యం
[ 11-05-2024]
అధునాతన వైద్యసేవలను చేరువ చేస్తాం. భీమవరం వాసులకే కాకుండా పరిసర జిల్లాలకు చెందిన వారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పలు సందర్భాల్లో చెప్పారు. -
నమ్మి ఓటేస్తే.. నయవంచన!
[ 11-05-2024]
రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ, ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ గత సాధారణ ఎన్నికల సమయంలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని నిరుద్యోగ యువత మండిపడుతోంది. -
భీమవరంలో అమిత్షా పర్యటన రద్దు
[ 11-05-2024]
భీమవరంలో శనివారం జరగాల్సిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పర్యటన రద్దయిందని భాజపా క్రమశిక్షణ సంఘం రాష్ట్ర ఛైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ చెప్పారు. -
విధుల్లో నిర్లక్ష్యం.. అయిదుగురు కానిస్టేబుళ్లు సస్పెన్షన్
[ 11-05-2024]
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి సస్పెండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం