కొల్లేరును శాసిస్తున్న క్యాట్ఫిష్
అరుదైన నల్లజాతి చేపలకు నిలయమైన కొల్లేరులో క్యాట్ఫిష్ సంతతి అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోంది. నిషేధిత ఆఫ్రికన్ క్యాట్ఫిష్, రాక్షస జాతి చేపల ఉద్ధృతితో అరుదైన జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి
అంతరించిపోతున్న అరుదైన నల్లజాతి చేపలు
క్యాట్ఫిష్
మండవల్లి, న్యూస్టుడే: అరుదైన నల్లజాతి చేపలకు నిలయమైన కొల్లేరులో క్యాట్ఫిష్ సంతతి అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోంది. నిషేధిత ఆఫ్రికన్ క్యాట్ఫిష్, రాక్షస జాతి చేపల ఉద్ధృతితో అరుదైన జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఎంతో గడ్డు పరిస్థితులను సైతం తమకు అనుగుణంగా మార్చుకొంటూ మనుగడను సాధించే క్యాట్ఫిష్, రాక్షస జాతి(సైల్పిన్ క్యాట్ఫిష్) చేపలు నానాటికీ పెరుగుతున్నాయి. అతి తక్కువ నీటిలో మనుగడ సాగించే ఈ రెండు జాతులు ఇతర రకాల చేపల్ని వేటాడి తినడంతో కొల్లేరులో సహజ మత్స్య సంపద మనుగడకు ముప్పు వాటిల్లుతోంది.
రాక్షస జాతి సైల్పిన్
- కొన్నేళ్లుగా కొల్లేరులో తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడటంతో ఏటా నల్లజాతి మత్స్య సంపద తరిగిపోతూ వస్తోంది. కానీ బురదలో బతికే స్వభావం ఉన్న క్యాట్ఫిష్ జాతులు మాత్రం తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి. ఇతర చిన్న, పెద్ద చేపల్ని వేటాడి ఆహారంగా తీసుకోవడంతో ఇతర జాతులకు మనుగడకు ముప్పు వాటిల్లుతోంది.
నష్టపోతున్న మత్స్యకారులు
2006 కొల్లేరు ఆపరేషన్ తర్వాత ఎక్కువ మంది మత్స్యకారులు సరస్సులో చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నారు. కానీ నాలుగేళ్లుగా క్యాట్ఫిష్ జాతి పెరగడంతో ఇతర చేపలు కనుమరుగవుతున్నాయి. నిషేధిత క్యాట్ఫిష్, రాక్షస జాతి చేపలకు ఎటువంటి మార్కెట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నల్ల జాతి చేపల లభ్యత భారీగా తగ్గిపోవడంతో మత్స్యకారులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గతంలో కొరమేను, మట్టగిడస, వాలుగు లాంటి వాటితో పాటు గండ్లు, తుళ్లు, తెల్ల చేపలు కొల్లేరు లభ్యమయ్యేవి. కానీ ప్రస్తుతం అవి కనుమరుగయ్యాయి’ అని మణుగునూరు గ్రామానికి చెందిన మత్స్యకారుడు జంగం సుగుణరావు తెలిపారు
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం..
మత్స్యకారుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. కొల్లేరులో క్యాట్ఫిష్ వృద్ధిని అడ్డుకోవడం సాధ్యమయ్యే పనికాదు. రసాయనాలను వినియోగిస్తే ఇతర జాతులకు ముప్పు. మత్స్యకారులే కాస్త జాగ్రత్త వహించి క్యాట్ఫిష్ జాతులు దొరికినప్పుడు నాశనం చేసేలా చర్యలు తీసుకోవాలి.’ అని మత్స్య శాఖ ఏడీ చాంద్బాషా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విధ్వంస వేటు
[ 12-05-2024]
గోదావరి సవ్వళ్లు.. ప్రశాంతతకు మారుపేరైన పల్లెలు.. ఆత్మీయతకు రూపమైన పురాలు... ఉమ్మడి పశ్చిమ గోదావరి పేరెత్తగానే రాష్ట్రంలోని ప్రజల మదిలో మెదిలే భావాలివి.. కానీ, అయిదేళ్ల జగన్ పాలనలో జిల్లాలో దాడులు పెరిగిపోయాయి. -
రాష్ట్రానికి జీవనాడి.. పథకాలు ఎడారి
[ 12-05-2024]
అపార జలవనరులు ఉన్న ఏలూరు జిల్లా రాష్ట్రానికి జీవనాడి అయ్యే అవకాశాలు ఉన్నా, వైకాపా సర్కారు నిర్లక్ష్యంతో ఆ జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. -
ముమ్మాటికీ.. జగనాసుర మార్గాలే!
[ 12-05-2024]
ఏ దేశంలోనైనా ప్రగతికి చిహ్నాలు మార్గాలే.. ఆర్థిక అభ్యున్నతికి ఊపిరినివ్వాల్సిన మార్గాలు జగన్ ఏలుబడిలో బలిపీఠమెక్కాయి. -
రైతుల కంట్లో కారం.. వైకాపా నేతలకు ‘సహకారం’
[ 12-05-2024]
అయిదేళ్ల వైకాపా సర్కారు పాలనలో సహకార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రజా సొమ్మును స్వాహా చేయడంలో సిద్ధహస్తులైన అధికార పార్టీ నేతల కారణంగా అవినీతి ఊబిలో కూరుకుపోయాయి. -
జగన్ వస్తే...జనం అల్లాడాల్సిందే!
[ 12-05-2024]
మండుటెండ..విపరీతమైన ఉక్కపోత...గంటల కొద్దీ నిరీక్షణతో శనివారం కైకలూరులోని సీఎం జగన్ సభకు వచ్చిన ప్రజలు నరకయాతన అనుభవించారు. -
బాకాలూదుకోవడమే
[ 12-05-2024]
కైకలూరులో సీఎం జగన్ శనివారం నిర్వహించిన సిద్ధం సభలో ఆద్యంతం పథకాల గురించి ఊదరకొట్టారు. -
ఈ చట్టం మనకొద్దు
[ 12-05-2024]
వైకాపా సర్కారు తెచ్చిన భూహక్కు చట్టం ప్రతుల నకళ్లను నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పెద అమిరంలోని తన నివాసం వద్ద శనివారం సాయంత్రం దహనం చేసి నిరసన తెలిపారు. -
జగన్కు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు
[ 12-05-2024]
నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయలేని సీఎం జగన్ అయిదేళ్లలో 12 సార్లు ఛార్జీలు పెంచి చీకట్లు మిగిల్చారని వైకాపాకు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
క్లీన్ స్వీప్ చేయబోతున్నాం
[ 12-05-2024]
ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ అన్నారు. -
ఓట్ల వేటకు కోట్లు గుమ్మరింపు!
[ 12-05-2024]
ప్రస్తుత ఎన్నికలను రెండు ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఓటర్లపై నోట్ల వాన కురుస్తోంది. -
ఊరు రమ్మంది.. ఓటేయమంది!
[ 12-05-2024]
ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వేలాది మంది ఓటు వేసేందుకు స్వస్థలాలకు భారీగా తరలి వస్తున్నారు. -
వ్యతిరేక ఓటును ఆపే కుట్ర?
[ 12-05-2024]
‘హలో.. మేము తహసీల్దారు కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం.. మీకు తణుకులో ఆదివారం నుంచి ఎన్నికల విధులు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీల పొత్తు.. శశిథరూర్ ఏమన్నారంటే?
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
పేలిన ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు