logo

నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ

విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్‌ సూచించారు.

Published : 19 Apr 2024 04:14 IST

జ్యోతి వెలిగిస్తున్న  జానకిరామ్‌

ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్‌ సూచించారు. స్థానిక ఉద్యాన కళాశాల 18వ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల పత్రిక ‘సౌగంధిని’ వీసీ ఆవిష్కరించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పలు విభాగాల డీన్‌లు పద్మావతమ్మ, సలోమి సునీత, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని