logo

వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం

వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు.

Published : 20 Apr 2024 06:03 IST

జనసేనలో చేరినవారితో గోవిందరావు, రామాంజనేయులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. వైకాపాకు చెందిన సర్పంచి రాట్నాల పేరయ్య, ఆయన మద్దతుదారులు శుక్రవారం జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనలో యువతకు ఉపాధి లేదని, మహిళలకు అందాల్సిన పథకాలు దూరమయ్యాయన్నారు. వైకాపా నాయకులు చెబితేనే పనులు జరగాల్సిన దుస్థితికి తీసుకొచ్చారన్నారు. వేలాది మంది ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారన్నారు. మాజీ ఎమ్మెల్యే, భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే జనసేన, తెదేపా, భాజపా కూటమి అజెండా అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలన్నారు. ఎన్నికైన తర్వాత ప్రజలంతా ఒక్కటేననే భావన గత అయిదేళ్లలో ఎక్కడా కనిపించలేదన్నారు. ఓట్లు వేయలేదని బెదిరింపులు, అక్రమ కేసులతో ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడ్డాయన్నారు. అలాంటి పాలనను ప్రజలు మళ్లీ కోరుకోవడంలేదన్నారు. నాయకులు చెనమల్ల చంద్రశేఖర్‌, వబిలిశెట్టి రామకృష్ణ, బండి రమేష్‌కుమార్‌, కత్తుల నీలేంద్ర తదితరులు పాల్గొన్నారు. భీమవరం 12వ వార్డుకు చెందిన గరికిపాటి బాబి, కొప్పునీడి శ్రీను ఆధ్వర్యంలో 50 మంది జనసేనలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని