జోరుగా నామినేషన్లు
ఉభయ జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండు జిల్లాల్లో ఎంపీ స్థానాలకు 6, ఎమ్మెల్యేకు 27.. మొత్తం 33 దాఖలయ్యాయి.
ఉభయ జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండు జిల్లాల్లో ఎంపీ స్థానాలకు 6, ఎమ్మెల్యేకు 27.. మొత్తం 33 దాఖలయ్యాయి. అనుచర గణం వెంట రాగా ర్యాలీగా ఆయా పార్టీల అభ్యర్థులు తరలివెళ్లి నామపత్రాలను సమర్పించారు. అందులో తమ ఆస్తులు, అప్పులు, కేసులను వివరించారు.
న్యూస్టుడే బృందం
ఉండి బరిలో రఘురామ
ఉండి, న్యూస్టుడే: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. రఘురామ తరఫున నామపత్రాలను ఆయన సతీమణి రమాదేవి శుక్రవారం దాఖలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉండి మండల రెవెన్యూ కార్యాయానికి వచ్చిన ఆమె ఆర్వో ప్రవీణ్ ఆదిత్యకు నామ పత్రాలు దాఖలు చేశారు.
తణుకు
మంత్రి కారుమూరికి రూ.35.58 కోట్లు
తణుకు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన భార్యకు కలిపి రూ.35.58 కోట్ల స్థిర, చరాస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. బెంగళూరులో రూ.6.57 కోట్ల విలువైన ఇల్లు, జి.చోడవరంలో 15.35 ఎకరాలు, వెంకట్రామన్నగూడెంలో 8.30 ఎకరాలు, అత్తిలిలో 0.71 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. రూ.94.65 లక్షల విలువైన బంగారం, వెండి అభరణాలున్నాయి. రూ.20 లక్షల విలువైన కారు ఉంది. రూ.55 లక్షల అప్పు ఉన్నట్లు చూపించారు.
నరసాపురం
ప్రసాదరాజు కుటుంబ ఆస్తులు రూ.3.39కోట్లు
ముదునూరి
అభ్యర్థి పేరు: ముదునూరిప్రసాదరాజు
పార్టీ: వైకాపా
విద్యార్హత: ఇంటర్మీడియట్
కేసులు: ఏమీ లేవు
చరాస్తుల విలువ మొత్తం: రూ.57,72,182, కుమారుడు పేరున: రూ.7,39,314
స్థిరాస్తుల విలువ : రూ.59,41,100, కుమారుడు పేరున: రూ.16,56,000
సొంత ఇంటి విలువ: రూ.29.60 లక్షలు
బంగారం విలువ: రూ.7.80 లక్షలు, భార్యకు : రూ.35.75 లక్షలు
వెండి: రూ.3.60లక్షలు
అప్పులు: 1,83,09,626, భార్యపేరున: 12,38,419
వాహనాలు: మహీంద్ర ఇంటర్నేషనల్ ట్రాక్టర్ రూ.లక్ష విలువ, కియా కారు: రూ.34.54 లక్షలు, భార్యపేరున: ఫోర్డు కారు విలువ: రూ.20.35లక్షలు, యాక్సిస్ ద్విచక్రవాహనం విలువ: రూ.20వేలు
భీమవరం
గ్రంధికి రూ.25.2 కోట్ల ఆస్తులు
శ్రీనివాస్
భీమవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్తో పాటు ఆయన భార్య పేరు మీద రూ.4.99 కోట్ల చరాస్తులు, రూ.20.2 కోట్ల విలువైన స్థిరాస్తులు కలిపి రూ.25.2 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్లో చూపించారు. తెలంగాణలోని మల్కాజిగిరి జిల్లాలో 2ఎకరాలు, విస్సాకోడేరులో 5.75 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 14.12 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. చెన్నైలో రూ.4కోట్ల విలువైన వ్యాపార భవనాలు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. రూ.76.5 లక్షల విలువైన నివాస భవనాలున్నాయి. రూ.1.03 కోట్ల విలువైన బంగారు ఆభరణాలున్నాయి. రూ.39.6 లక్షల విలువైన ఫోర్డ్ ఎండోవర్ కారు ఉంది. ఇద్దరు పేరు మీద కలిపి రూ.12.5 కోట్ల అప్పులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
నరసాపురం పార్లమెంట్
అభ్యర్థి పేరు: గూడూరి ఉమాబాల
పార్టీ: వైకాపా
విద్యార్హతలు: బీఎస్సీ, బీఎల్
కేసులు: గతంలో ఉన్నాయి (కుటుంబ వ్యవహారాలకు సంబంధించినవి)
చరాస్తుల విలువ: రూ.45,00,521, భర్త పేరిట - రూ.60,91,678
స్థిరాస్తుల విలువ: రూ.7,50,06,300, భర్త పేరిట - రూ.32,48,000
బంగారం విలువ: రూ.32,04,000, భర్త పేరిట - రూ.3,12,000
వాహనాలు: భర్త పేరిట - ఎంజీ హెక్టార్ కారు, విలువ - రూ.31,82,373 ః అప్పులు: లేవు, భర్త పేరున - రూ.15,32,921
నియోజకవర్గం: తణుకు
అభ్యర్థి పేరు: ఆరిమిల్లి రాధాకృష్ణ
పార్టీ: తెదేపా
విద్యార్హతలు: ఎమ్మెస్సీ కంప్యూటర్స్
కేసులు: 7
చరాస్తుల విలువ మొత్తం: రూ.4,22,80,548
భార్య పేరిట: రూ.6,28,10,701
స్థిరాస్తి విలువ మొత్తం: రూ.14,49,12,700, భార్య పేరిట: రూ.4,03,83,200
సొంతింటి విలువ: రూ.2,42,15,500
బంగారం విలువ: రూ.20,80,000, భార్య పేరున: 1,27,09,500
వెండి: రూ.42 లక్షలు
వాహనాలు: టాటా సఫారి రూ.4,29,653, ఫోర్డ్ ఎన్డీవీయర్ రూ.18,46,394. భార్య పేరున: మెర్సిడెస్ బెంజ్ రూ. 28,11,144.
అప్పులు: రూ.1,12,98,454 భార్య పేరున: రూ.13,28,832
ఆచంట
అభ్యర్థి పేరు: పితాని సత్యనారాయణ
పార్టీ:తెదేపా
విద్యార్హత: డిగ్రీ
కేసులు: 2"
చరాస్తులు: రూ.2,21,50,183, భార్య పేరిట: రూ.2,06,10,900
స్థిరాస్తులు: 8,12,01,000, భార్య పేరిట: 1,45,80,000
అప్పులు: 2,50,00,000, భార్య పేరిట: రూ.22,00,700
పాలకొల్లు
పేరు: నిమ్మల రామానాయుడు
పార్టీ: తెదేపా
విద్యార్హత: ఎంఎ, ఎంఫిల్, పీహెచ్డీ
కేసులు: 25
చరాస్తుల విలువ మొత్తం: రూ.1.70 కోట్లు, భార్య పేరున రూ.96 లక్షలు
స్థిరాస్తుల విలువ మొత్తం: రూ.3,16,70,000, భార్య పేరిట రూ.3,11,96,000
సొంత ఇంటి విలువ: రూ.50 లక్షలు
బంగారం: రామానాయుడు పేరిట రూ.36,38,013, భార్య సూర్యకుమారి: 1,17,32,393 ః అప్పులు: రూ.74,135
వాహనాలు: ఇన్నోవా విలువ రూ. 12లక్షలు
తాడేపల్లిగూడెం
అభ్యర్థిపేరు: బొలిశెట్టి శ్రీనివాస్
పార్టీ: జనసేన
విద్యార్హతలు: బీకాం
కేసులు: 4
చరాస్తుల విలువ మొత్తం: రూ.15,92,65,013.75, భార్య పేరున: 7,08,950
స్థిరాస్తి విలువ మొత్తం: రూ.6,04,45,663. భార్య పేరున: రూ.2,27,83000
బంగారం విలువ: రూ.3,40,250, భార్య పేరున: రూ.6,80,500
అప్పులు: రూ.17,18,02,665.99, భార్యపేరున: ఏమీ లేవు
వాహనాలు: కియా కారు, ఇతర వాహనాలు రూ.98,92,173, భార్య పేరున: ఏమీ లేవు
అచంట
రంగనాథరాజుకు రూ.65.7 కోట్ల ఆస్తులు
ఆచంట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ రంగనాథరాజు, భార్య వైజయంతి పేరు మీద చరాస్తులు విలువ రూ.5.7కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.35.4 కోట్లు కలిపి మొత్తం రూ.41 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు. ఉమ్మడి ఆస్తులు కూడా కలిపితే రూ.65.7 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. భీమడోలు మండలంలో భార్య పేరుపై 7.20 సెంట్ల స్థలం, ప్రత్తిపాడులో రైస్ మిల్లు, ఏలూరు, ప్రత్తిపాడు తదితర ప్రాంతాల్లో గిడ్డంగులు, రూ.25 లక్షల విలువైప బెంజి, రూ.70 లక్షల విలువైన రేంజ్ రోవర్, రూ.15 లక్షల విలువైన ఫోర్డ్ కార్లు ఉన్నాయి. ఆయన పేరు రాజానగరంలో భవనాలున్నాయి.
ఉండి
పీˆవీఎల్ ఆస్తులు రూ.11.76 కోట్లు
ఉండి నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పీవీఎల్ నరసింహరాజు తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు.
తన పేరిట రూ.11.76 కోట్ల విలువైన, భార్య పేరిట రూ.87.12 లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. వివిధ కంపెనీలు, బ్యాంకుల్లో తనకు రూ.2.85 కోట్లు, భార్య పేరిట రూ.29.98 లక్షల విలువైన రుణాలు ఉన్నట్లు వెల్లడించారు.
వివిధ సంస్థల్లో ఈక్విటీ షేర్లు, బీమా పాలసీలు, కియా సెల్టాస్ కారు, బంగారు ఆభరణాలు ఉండగా వాటి విలువ రూ.2.97 కోట్లుగా పేర్కొన్నారు. భార్య నిర్మల పేరిట రూ.2.06 కోట్ల పెట్టుబడులున్నాయని పేర్కొన్నారు.
యండగండిలో రూ.8.01 కోట్ల విలువైన 17.81 ఎకరాలు, విజయనగరం జిల్లాలో రూ.31.70 లక్షల విలువైన 6.34 ఎకరాల వ్యవసాయ భూములు, యండగండిలో రూ.20.81 లక్షల విలువైన వ్యవసాయేతర భూములున్నాయని తెలిపారు. యండగండిలో నివాస భవనం ఉందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో రూ.2.25 కోట్ల విలువైన ఇల్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటర్ల తుది జాబితా విడుదల
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో 14,73,811 మంది ఓటర్లున్నారు. -
దేవుడితో ఆటలా?
[ 03-05-2024]
‘ఆ దేవుడి దయతో.. మీ అందరి చల్లని దీవెనతో’ అంటూ ప్రసంగం మొదలు పెట్టే సీఎం జగన్ తన అయిదేళ్ల పాలనలో ఆ దేవుడికే శఠగోపం పెట్టారు. ఆయనతో పాటు వైకాపా ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. -
అన్ని వర్గాలను మోసగించిన జగన్
[ 03-05-2024]
ఉండి మండలంలోని పలు గ్రామాల్లో తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు గురువారం రాత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక సమస్యలను తెదేపా జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తిగ నాగరాజులతో కలిసి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. -
సీఎం వస్తే ఇంతేగా.. అర్ధరాత్రి డివైడర్ తొలగింపు
[ 03-05-2024]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా చెట్లను కూల్చడం, నిర్మాణాలను ధ్వంసం చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. శుక్రవారం నరసాపురం పట్టణంలో జరిగే నియోజకవర్గస్థాయి సిద్ధం సభలో జగన్ పాల్గొననున్నారు. -
ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం
[ 03-05-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వరస్వామి ఎదుర్కోలు ఉత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. -
దయ లేదా అసలు?
[ 03-05-2024]
ఈనాడు డిజిటల్, భీమవరం, న్యూస్టుడే బృందం: పేదలకు కాని.. అవ్వాతాతలకు కానీ... పిల్లలకు కానీ ఏ వర్గానికైనా మంచి చేసే విషయంలో జగన్తో పోటీపడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడు అని గర్వంగా చెబుతున్నా.. మరీ ముఖ్యంగా అవ్వాతాతల విషయంలో అసలు తగ్గే అవకాశం, పరిస్థితి ఉండనే ఉండదు. -
ఎంతో చెప్పారు.. తుస్సుమనిపించారు
[ 03-05-2024]
పథకాలకు పేర్లు మార్చడంలో ఉన్న శ్రద్ధ వాటి అమలులో వైకాపా ప్రభుత్వానికి ఉండటం లేదు. తెదేపా హయాంలో అమలు చేసిన ఎన్టీఆర్ జలసిరి పథకానికి పేరు మార్చి వైఎస్ఆర్ జలకళ అని పెట్టింది. రైతులతో పాటు బోర్లు తవ్విన గుత్తేదారులూ అప్పులపాలైన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల విధుల నుంచి మినహాయింపులో చేతివాటం!
[ 03-05-2024]
ఎన్నికల విధుల నుంచి ఉద్యోగులను మినహాయించే విషయంలో అవకతవకలు జరిగాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 13న నిర్వహించే సార్వత్రిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించడానికి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు విధులు కేటాయించడంతోపాటు పలుమార్లు శిక్షణ ఇచ్చారు. -
విద్యావ్యవస్థ నిర్వీర్యం... గురువుల్లో నైరాశ్యం!
[ 03-05-2024]
విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులదే. విద్యాబుద్ధులు నేర్పించే వారిని అయిదేళ్లపాటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. -
కుతంత్రాల జమానా!
[ 03-05-2024]
ఓ పక్క నిప్పుల కుంపటిలా ఎండ.. ఎక్కడ పింఛను ఇస్తారో తెలియక అయోమయం..తీరా వెళ్తే సొమ్ము జమైందో తెలుసుకోవడానికే గంటలకొద్దీ నిలువుకాళ్లపై పడిగాపులు.. గురువారం బ్యాంకుల వద్ద పింఛనుదార్ల ఆవేదన అంతా ఇంతా కాదు. పండుటాకుల కష్టాలు అన్నీ ఇన్నీకావు. -
అవ్వాతాతల ఆక్రందన..!
[ 03-05-2024]
భీమవరం మండలం గొల్లవానితిప్పలో యూనియన్ బ్యాంకు శాఖకు గురువారం ఉదయమే పెద్ద సంఖ్యలో పింఛనుదారులు చేరుకున్నారు. రద్దీ కారణంగా లోపల నిలబడే చోటు లేకపోవడంతో వృద్ధులు ఇలా రోడ్డుపైనే నిలబడాల్సి వచ్చింది. -
జగన్ పాలనపై ప్రజల్లో విరక్తి: రఘురామ
[ 03-05-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసేలా సాగిన జగన్ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమని తెదేపా ఉండి అసెంబ్లీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
వైకాపాది అయిదేళ్ల అసమర్థ పాలన
[ 03-05-2024]
గత అయిదేళ్లలో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని ఎన్డీయే రాజమహేంద్రవరం ఎంపీˆ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలోని ద్వారకాతిరుమల మండలం మారంపల్లి, రాజుపాలెం, తిరుమలంపాలెం, గొల్లగూడెం, పంగిడిగూడెం, గుణ్ణంపల్లి గ్రామాల్లో గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజుతో కలిసి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు