కరవు భత్యానికీ కరవే
అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఉపాధ్యాయులను వంచించిన ప్రభుత్వం
ఒక్కొక్కరికీ రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు బాకీ
ఈనాడు డిజిటల్, భీమవరం, తణుకు: అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జీతాలు ఎలాగూ సమయానికి రావడం లేదు. కనీసం ఆర్థిక బకాయిలనైనా విడుదల చేయాలని అనేక సార్లు రోడ్డెక్కి ఉద్యమాలకు దిగితే వారిపై ఉక్కుపాదం మోపారు.
ఉమ్మడి జిల్లాలో 3,160 పాఠశాలల్లో సుమారు 14 వేల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వారి జీతభత్యాలను బట్టి ఒక్కొక్కరికి కనీసం రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు కరవుభత్యం సొమ్ములు రావాల్సి ఉంది. పీఆర్సీ సమయంలో పాత డీఏలను చెల్లించి జీతాలు పెరిగాయని మభ్యపెట్టిన ప్రభుత్వం అడుగడుగునా ఉపాధ్యాయులను ఏదో రూపంలో వంచిస్తూ వచ్చింది. గతంలో కరోనా సాకుతో రెండు డీఏలు మాఫీ చేశారు. ఆర్నెళ్లకోసారి జనవరి, జులైల్లో డీఏ చెల్లించాల్సి ఉన్నా ఆ ప్రకారం ఇవ్వడం లేదు. వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామన్నా అదీ అమలు కాలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పాత బకాయిలను చెల్లించకుండా ఎన్నికల నేపథ్యంలో జనవరి 1, 2023న చెల్లించాల్సిన డీఏను ఈ ఏడాది మార్చి జీతం కలిపి విడుదల చేశారు. జులై 1, 2023 డీఏను ఈ ఏడాది ఆగస్టులో చెల్లిస్తామని జీవో విడుదల చేశారు. 2023 నుంచి డీఏ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తానన్నా ఇవ్వలేదు.
ఏనాడూ పట్టించుకోలేదు
- ఐ.రాజగోపాల్, ఏపీటీఎఫ్ మాజీ కార్యదర్శి, తణుకు
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏనాడూ ఉపాధ్యాయులను పట్టించుకోలేదు. భావితరాలను తీర్చిదిద్దాల్సిన వారిని ఇతర విధులకు కేటాయించి వారిపై కక్షపూరితంగా వ్యవహరించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఎప్పుడూ సకాలంలో చెల్లించలేదు.
హామీలతో మభ్యపెట్టారు
భీమవరంలో ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు(పాతచిత్రం)
అమలుకాని హామీలిచ్చి మభ్యపెట్టారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా డీఏలను చెల్లించాల్సి ఉన్నా వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. పీఆర్సీ కోసం ఉపాధ్యాయులను రోడ్డెక్కించిన ఘనత ఈ ప్రభుత్వానిదే.కరవుభత్యాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించడం శోచనీయం. - విష్ణుమూర్తి, యూటీఎఫ్ నాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏంటీ దారుణం.. మన ఆస్తి మనదని రుజువు చేసుకోవాలా?: పవన్
[ 03-05-2024]
వైకాపా ప్రభుత్వం యువతను గంజాయి మత్తుకు బానిస చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. -
ఓటర్ల తుది జాబితా విడుదల
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో 14,73,811 మంది ఓటర్లున్నారు. -
దేవుడితో ఆటలా?
[ 03-05-2024]
‘ఆ దేవుడి దయతో.. మీ అందరి చల్లని దీవెనతో’ అంటూ ప్రసంగం మొదలు పెట్టే సీఎం జగన్ తన అయిదేళ్ల పాలనలో ఆ దేవుడికే శఠగోపం పెట్టారు. ఆయనతో పాటు వైకాపా ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. -
అన్ని వర్గాలను మోసగించిన జగన్
[ 03-05-2024]
ఉండి మండలంలోని పలు గ్రామాల్లో తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు గురువారం రాత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక సమస్యలను తెదేపా జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తిగ నాగరాజులతో కలిసి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. -
సీఎం వస్తే ఇంతేగా.. అర్ధరాత్రి డివైడర్ తొలగింపు
[ 03-05-2024]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా చెట్లను కూల్చడం, నిర్మాణాలను ధ్వంసం చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. శుక్రవారం నరసాపురం పట్టణంలో జరిగే నియోజకవర్గస్థాయి సిద్ధం సభలో జగన్ పాల్గొననున్నారు. -
ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం
[ 03-05-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వరస్వామి ఎదుర్కోలు ఉత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. -
దయ లేదా అసలు?
[ 03-05-2024]
ఈనాడు డిజిటల్, భీమవరం, న్యూస్టుడే బృందం: పేదలకు కాని.. అవ్వాతాతలకు కానీ... పిల్లలకు కానీ ఏ వర్గానికైనా మంచి చేసే విషయంలో జగన్తో పోటీపడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడు అని గర్వంగా చెబుతున్నా.. మరీ ముఖ్యంగా అవ్వాతాతల విషయంలో అసలు తగ్గే అవకాశం, పరిస్థితి ఉండనే ఉండదు. -
ఎంతో చెప్పారు.. తుస్సుమనిపించారు
[ 03-05-2024]
పథకాలకు పేర్లు మార్చడంలో ఉన్న శ్రద్ధ వాటి అమలులో వైకాపా ప్రభుత్వానికి ఉండటం లేదు. తెదేపా హయాంలో అమలు చేసిన ఎన్టీఆర్ జలసిరి పథకానికి పేరు మార్చి వైఎస్ఆర్ జలకళ అని పెట్టింది. రైతులతో పాటు బోర్లు తవ్విన గుత్తేదారులూ అప్పులపాలైన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల విధుల నుంచి మినహాయింపులో చేతివాటం!
[ 03-05-2024]
ఎన్నికల విధుల నుంచి ఉద్యోగులను మినహాయించే విషయంలో అవకతవకలు జరిగాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 13న నిర్వహించే సార్వత్రిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించడానికి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు విధులు కేటాయించడంతోపాటు పలుమార్లు శిక్షణ ఇచ్చారు. -
విద్యావ్యవస్థ నిర్వీర్యం... గురువుల్లో నైరాశ్యం!
[ 03-05-2024]
విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులదే. విద్యాబుద్ధులు నేర్పించే వారిని అయిదేళ్లపాటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. -
కుతంత్రాల జమానా!
[ 03-05-2024]
ఓ పక్క నిప్పుల కుంపటిలా ఎండ.. ఎక్కడ పింఛను ఇస్తారో తెలియక అయోమయం..తీరా వెళ్తే సొమ్ము జమైందో తెలుసుకోవడానికే గంటలకొద్దీ నిలువుకాళ్లపై పడిగాపులు.. గురువారం బ్యాంకుల వద్ద పింఛనుదార్ల ఆవేదన అంతా ఇంతా కాదు. పండుటాకుల కష్టాలు అన్నీ ఇన్నీకావు. -
అవ్వాతాతల ఆక్రందన..!
[ 03-05-2024]
భీమవరం మండలం గొల్లవానితిప్పలో యూనియన్ బ్యాంకు శాఖకు గురువారం ఉదయమే పెద్ద సంఖ్యలో పింఛనుదారులు చేరుకున్నారు. రద్దీ కారణంగా లోపల నిలబడే చోటు లేకపోవడంతో వృద్ధులు ఇలా రోడ్డుపైనే నిలబడాల్సి వచ్చింది. -
జగన్ పాలనపై ప్రజల్లో విరక్తి: రఘురామ
[ 03-05-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసేలా సాగిన జగన్ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమని తెదేపా ఉండి అసెంబ్లీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
వైకాపాది అయిదేళ్ల అసమర్థ పాలన
[ 03-05-2024]
గత అయిదేళ్లలో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని ఎన్డీయే రాజమహేంద్రవరం ఎంపీˆ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలోని ద్వారకాతిరుమల మండలం మారంపల్లి, రాజుపాలెం, తిరుమలంపాలెం, గొల్లగూడెం, పంగిడిగూడెం, గుణ్ణంపల్లి గ్రామాల్లో గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజుతో కలిసి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది