వారం అన్నావ్.. వమ్ము చేశావ్
‘ తెదేపా సర్కారు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోలేదు. వచ్చేది మనందరి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అందరికీ న్యాయం చేస్తాం. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తాం.’..
అయిదేళ్లవుతున్నా అమలుకు నోచని జగన్ హామీ
అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన
భీమవరం: నిరసన దీక్షలో నినదిస్తున్న బాధితులు, సంఘ నాయకులు (పాతచిత్రం)
భీమవరం పట్టణం, న్యూస్టుడే: ‘ తెదేపా సర్కారు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోలేదు. వచ్చేది మనందరి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అందరికీ న్యాయం చేస్తాం. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తాం.’.. గత ఎన్నికల సమయంలో అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ ఇది. అయిదేళ్లు గడిచి మళ్లీ ఎన్నికలొచ్చినా ఈ హామీని అమలు చేయలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 1.3 లక్షల మంది..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 1.30 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నారు. రూ. 10 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లింపులు చేస్తున్నట్లు మూడేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. దీనికి వేలాదిగా జనం దరఖాస్తు చేసుకున్నారు. పోలీసుల విచారణ తర్వాత నగదు ఇస్తామన్నారు. నిజమని నమ్మిన బాధితులు ఎంతో ఆశతో పోలీసుస్టేషన్ల చుట్టూ తిరిగారు. 90 శాతం మందికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. రూ.1000 నుంచి రూ.లక్షకుపైగా డిపాజిట్ చేసిన వారు గత కొన్నేళ్లుగా ఉద్యమాలు, నిరసనలు చేసినా వైకాపా సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. మళ్లీ ఇలాంటి హామీలతో ప్రజల్లోకి వస్తున్న నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సొంత ఇల్లు అమ్ముకుని..
అగ్రిగోల్డ్ సంస్థలో రూ.15 లక్షలు డిపాజిట్ చేశా. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీతో ఆ సొమ్ము తిరిగి వస్తుందని ఆశించగా నిరాశే మిగిలింది. అప్పులు తీర్చలేక సొంతింటిని అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నా. రూ.10 వేలు, రూ.20 వేలలోపు డిపాజిట్దారులకు చెల్లిస్తున్నట్లు చెప్పినా అది కూడా పూర్తిస్థాయిలో జరగలేదు.
కె.గోపాలకృష్ణ, సంఘం జిల్లా అధ్యక్షుడు
నిరాశే మిగిలింది
భద్రత ఉంటుందనే యోచనతో పొదుపు చేసిన సొమ్మును డిపాజిట్ చేశా. ఎన్నికల హామీతో ఆ సొమ్ము తిరిగి వస్తుందని ఆశించా. రూ.10 వేలు, రూ.20 వేలు చెల్లింపుల్లో కూడా ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు డిపాజిట్దారులు అంటే కేవలం ఒక్కరికే ఇస్తామన్నారు. రూ.50 వేలలోపు ఉన్నవారికి త్వరలో చెల్లిస్తామని చెప్పడంతో ఎంతో ఆశగా ఎదురు చూశాం. చివరకు నిరాశే మిగిలింది.
యడవల్లి వీరకృష్ణ, పెదఅమిరం
అణచివేత ధోరణి
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుతూ 36 సార్లు నిరసన తెలిపి వినతిపత్రాలు ఇచ్చాం. మెయిల్ ద్వారా సందేశాలు, 48 గంటల దీక్షలు, సచివాలయానికి పాదయాత్ర, కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టాం ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చాం. బాధితులకు సొమ్ము చెల్లించపోగా ఆందోళనలను అణచివేసేందుకు కేసులు బనాయించారు.
కె.భీమారావు, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏంటీ దారుణం.. మన ఆస్తి మనదని రుజువు చేసుకోవాలా?: పవన్
[ 03-05-2024]
వైకాపా ప్రభుత్వం యువతను గంజాయి మత్తుకు బానిస చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. -
ఓటర్ల తుది జాబితా విడుదల
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో 14,73,811 మంది ఓటర్లున్నారు. -
దేవుడితో ఆటలా?
[ 03-05-2024]
‘ఆ దేవుడి దయతో.. మీ అందరి చల్లని దీవెనతో’ అంటూ ప్రసంగం మొదలు పెట్టే సీఎం జగన్ తన అయిదేళ్ల పాలనలో ఆ దేవుడికే శఠగోపం పెట్టారు. ఆయనతో పాటు వైకాపా ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. -
అన్ని వర్గాలను మోసగించిన జగన్
[ 03-05-2024]
ఉండి మండలంలోని పలు గ్రామాల్లో తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు గురువారం రాత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక సమస్యలను తెదేపా జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తిగ నాగరాజులతో కలిసి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. -
సీఎం వస్తే ఇంతేగా.. అర్ధరాత్రి డివైడర్ తొలగింపు
[ 03-05-2024]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా చెట్లను కూల్చడం, నిర్మాణాలను ధ్వంసం చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. శుక్రవారం నరసాపురం పట్టణంలో జరిగే నియోజకవర్గస్థాయి సిద్ధం సభలో జగన్ పాల్గొననున్నారు. -
ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం
[ 03-05-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వరస్వామి ఎదుర్కోలు ఉత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. -
దయ లేదా అసలు?
[ 03-05-2024]
ఈనాడు డిజిటల్, భీమవరం, న్యూస్టుడే బృందం: పేదలకు కాని.. అవ్వాతాతలకు కానీ... పిల్లలకు కానీ ఏ వర్గానికైనా మంచి చేసే విషయంలో జగన్తో పోటీపడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడు అని గర్వంగా చెబుతున్నా.. మరీ ముఖ్యంగా అవ్వాతాతల విషయంలో అసలు తగ్గే అవకాశం, పరిస్థితి ఉండనే ఉండదు. -
ఎంతో చెప్పారు.. తుస్సుమనిపించారు
[ 03-05-2024]
పథకాలకు పేర్లు మార్చడంలో ఉన్న శ్రద్ధ వాటి అమలులో వైకాపా ప్రభుత్వానికి ఉండటం లేదు. తెదేపా హయాంలో అమలు చేసిన ఎన్టీఆర్ జలసిరి పథకానికి పేరు మార్చి వైఎస్ఆర్ జలకళ అని పెట్టింది. రైతులతో పాటు బోర్లు తవ్విన గుత్తేదారులూ అప్పులపాలైన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల విధుల నుంచి మినహాయింపులో చేతివాటం!
[ 03-05-2024]
ఎన్నికల విధుల నుంచి ఉద్యోగులను మినహాయించే విషయంలో అవకతవకలు జరిగాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 13న నిర్వహించే సార్వత్రిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించడానికి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు విధులు కేటాయించడంతోపాటు పలుమార్లు శిక్షణ ఇచ్చారు. -
విద్యావ్యవస్థ నిర్వీర్యం... గురువుల్లో నైరాశ్యం!
[ 03-05-2024]
విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులదే. విద్యాబుద్ధులు నేర్పించే వారిని అయిదేళ్లపాటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. -
కుతంత్రాల జమానా!
[ 03-05-2024]
ఓ పక్క నిప్పుల కుంపటిలా ఎండ.. ఎక్కడ పింఛను ఇస్తారో తెలియక అయోమయం..తీరా వెళ్తే సొమ్ము జమైందో తెలుసుకోవడానికే గంటలకొద్దీ నిలువుకాళ్లపై పడిగాపులు.. గురువారం బ్యాంకుల వద్ద పింఛనుదార్ల ఆవేదన అంతా ఇంతా కాదు. పండుటాకుల కష్టాలు అన్నీ ఇన్నీకావు. -
అవ్వాతాతల ఆక్రందన..!
[ 03-05-2024]
భీమవరం మండలం గొల్లవానితిప్పలో యూనియన్ బ్యాంకు శాఖకు గురువారం ఉదయమే పెద్ద సంఖ్యలో పింఛనుదారులు చేరుకున్నారు. రద్దీ కారణంగా లోపల నిలబడే చోటు లేకపోవడంతో వృద్ధులు ఇలా రోడ్డుపైనే నిలబడాల్సి వచ్చింది. -
జగన్ పాలనపై ప్రజల్లో విరక్తి: రఘురామ
[ 03-05-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసేలా సాగిన జగన్ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమని తెదేపా ఉండి అసెంబ్లీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
వైకాపాది అయిదేళ్ల అసమర్థ పాలన
[ 03-05-2024]
గత అయిదేళ్లలో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని ఎన్డీయే రాజమహేంద్రవరం ఎంపీˆ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలోని ద్వారకాతిరుమల మండలం మారంపల్లి, రాజుపాలెం, తిరుమలంపాలెం, గొల్లగూడెం, పంగిడిగూడెం, గుణ్ణంపల్లి గ్రామాల్లో గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజుతో కలిసి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు