అధికార పార్టీ ప్రలోభాల పర్వం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార వైకాపా ముందుగానే ప్రలోభాలకు తెరలేపింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక పోలింగ్కు ఎక్కువ సమయం ఉండటంతో అభ్యర్థులు గ్రామాల్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, పరామర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు.
మహిళా సంఘాలపై గురి
భీమవరం వన్టౌన్, పట్టణం, వీరవాసరం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార వైకాపా ముందుగానే ప్రలోభాలకు తెరలేపింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక పోలింగ్కు ఎక్కువ సమయం ఉండటంతో అభ్యర్థులు గ్రామాల్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, పరామర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సామాజికవర్గాల వారీగా పెద్దలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. సమాంతరంగా తెరవెనుక ప్రలోభాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
జిల్లాలో పలు నియోజకవర్గాల్లో అధికార వైకాపా అభ్యర్థులు డ్వాక్రా సంఘాలపై దృష్టి సారించారు. ప్రతి సభ్యురాలికి రూ.వెయ్యి చొప్పున నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. దీనిని మే 3లోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సహకరిస్తున్న యానిమేటర్లకు రూ.వేలల్లో ముట్టజెబుతున్నారు. కొన్ని చోట్ల యానిమేటర్లు వారి అనుభవానికి పదును పెట్టి సంఘాల్లో సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు నమ్మబలికి అదనపు నగదును కాజేస్తున్నట్లు వినికిడి.
జాతరలో చీరల పంపిణీ..భీమవరం నియోజకవర్గంలో పలు పంచాయతీల్లో ఇటీవల గ్రామ దేవతల జాతరలు ప్రారంభమయ్యాయి. అధికార పార్టీ అభ్యర్థి ఒకరు ఆయా గ్రామాల్లో మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు.
గెలుస్తామని చెప్పాలి మరి..
భీమవరం, సమీప నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో మహిళా సంఘాల సభ్యులకు రూ. వెయ్యి చొప్పున నగదు పంపిణీని అధికార పార్టీ నాయకులు మొదలుపెట్టారు. దీనిని పర్యవేక్షిస్తున్న ఆర్పీలకు రూ.25 వేల చొప్పున అందజేసినట్లు సమాచారం. సొమ్ము ఇచ్చాక.. రాబోయే పదిరోజులూ గెలుపు మనదే అంటూ చుట్టుపక్కల వారికి, బంధుమిత్రులందరికీ చెబుతూ విస్తృత ప్రచారం చేయాలని డ్వాక్రా, మెప్మా సంఘాల సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నారు. నగదు ఇచ్చిన విషయం మాత్రం బయటకు పొక్కనీయొద్దని బొట్టుపెట్టి మరీ చెబుతున్నారు.
వైదొలగిన వాలంటీర్లకు ప్యాకేజీలు
రాజీనామాలు చేసిన వాలంటీర్లకు అధికార పార్టీ అభ్యర్థులు రూ.5 వేల చొప్పున అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలాంటి వారంతా పోలింగ్ లోపు అధికార పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీల మద్దతుదారుల ఓట్లు రాబట్టుకొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం వాలంటీర్లకు ప్రత్యేక ప్యాకేజీల రూపంలో నగదు ఇవ్వనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాను ఓటుతో కొట్టు
[ 11-05-2024]
అధికార వైకాపా వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉండి ప్రధాన కూడలిలో శుక్రవారం జరిగిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. -
అయిదేళ్లూ.. ధరల దండయాత్ర
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్ల పాటు ధరల దండయాత్ర చేసింది. నిత్యావసరాలు మొదలు ఇంధనం, విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు ఇలా అడ్డగోలుగా ధరలు పెంచి సామాన్యుడి నడ్డివిరిచింది. -
సైకో పోవాలి.. సైకిల్ రావాలి
[ 11-05-2024]
‘రైతుకు సాగు నీరు అందాలన్నా..గిట్టుబాటు ధర రావాలన్నా..యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా..పోలవరం పూర్తి కావాలన్నా..అమరావతి రాజధాని కావాలన్నా..నిత్యావసరాల ధరలు విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు తగ్గాలన్నా 13న మీరేం చేయాలి’ అంటూ ప్రజలను తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. -
మాటలు కోటలు.. జీతాల్లో కోతలు!
[ 11-05-2024]
అయిదేళ్ల జగన్ పాలనలో ప్రభుత్వోద్యోగులు అష్టకష్టాలు పడ్డారు. ప్రతినెలా ఒకటో తేదీ వేతనాలు అందకపోగా... ఇతరత్రా సౌకర్యాలను పొందలేకపోయారు. -
నోట్లకు.. ఓట్లు రాలతాయా?
[ 11-05-2024]
పోలింగ్కు మరికొన్ని గంటలే మిగిలి ఉండటంతో అభ్యర్థులు ప్రచారాలతో పాటు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. -
ప్రైవేటు బస్సు ఆపరేటర్ల బాదుడు
[ 11-05-2024]
ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ప్రయాణికులను భారీగా బాదేస్తున్నారు. -
మట్టి మాఫియా మళ్లీ బరితెగింపు
[ 11-05-2024]
అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో తలమునకలవుతోంది. ఇదే అదనుగా మట్టి మాఫియా ఆచంట మండలం అనగార్లంక, అంబేడ్కర్ కోనసీమ జిల్లా బెల్లంపూడి సరిహద్దులో రెండు రోజులుగా విజృంభించింది. -
పోయేది జనం ప్రాణాలేగా?
[ 11-05-2024]
అనుకోని విపత్తులు విరుచుకు పడితే ప్రభుత్వం దన్నుగా నిలబడాలి. నేనున్నానంటూ భరోసానివ్వాలి. వైకాపా సర్కారుకు మాత్రం ఇవేమీ పట్టవు. -
వైద్యం.. ఇదేం దౌర్భాగ్యం
[ 11-05-2024]
అధునాతన వైద్యసేవలను చేరువ చేస్తాం. భీమవరం వాసులకే కాకుండా పరిసర జిల్లాలకు చెందిన వారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పలు సందర్భాల్లో చెప్పారు. -
నమ్మి ఓటేస్తే.. నయవంచన!
[ 11-05-2024]
రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ, ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ గత సాధారణ ఎన్నికల సమయంలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని నిరుద్యోగ యువత మండిపడుతోంది. -
భీమవరంలో అమిత్షా పర్యటన రద్దు
[ 11-05-2024]
భీమవరంలో శనివారం జరగాల్సిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పర్యటన రద్దయిందని భాజపా క్రమశిక్షణ సంఘం రాష్ట్ర ఛైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ చెప్పారు. -
విధుల్లో నిర్లక్ష్యం.. అయిదుగురు కానిస్టేబుళ్లు సస్పెన్షన్
[ 11-05-2024]
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి సస్పెండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్