జగన్ ఏలుబడి.. బాగుపడని బాలబడి!
ఒక్కటంటే ఒక కేంద్రం బాగుందని చెప్పలేం. చిన్నారుల సంక్షేమానికి భరోసా మాది. వారికి మావయ్యనంటూ సీఎం జగన్ ప్రకటనలిస్తున్నా..అవన్నీ ఉత్తమాటలే.
ఒక్కటంటే ఒక కేంద్రం బాగుందని చెప్పలేం. చిన్నారుల సంక్షేమానికి భరోసా మాది. వారికి మావయ్యనంటూ సీఎం జగన్ ప్రకటనలిస్తున్నా..అవన్నీ ఉత్తమాటలే. అంగన్వాడీ కేంద్రాల పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఇరుకు గదుల్లో బాల్యం మగ్గుతోంది. భవనాల నిర్మాణాలు పూర్తి కాక అసౌకర్యాల నడుమ కేంద్రాలు సాగుతున్నాయి. తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు.. ఇలా వసతుల లోపం ప్రతి చోటా ఉంది. అటు నాడు-నేడులో చేపట్టిన పనులూ ముందుకు సాగడం లేదు.
ఏలూరు వన్టౌన్, న్యూస్టుడే: అంగన్వాడీ కేంద్రాల్లో అసౌకర్యాలు తిష్ఠ వేశాయి. ఇప్పటికీ చాలా కేంద్రాలకు సొంత గూడు లేదు. గతంలో నాబార్డు, స్త్రీ, శిశు సంక్షేమ, ఉపాధి హామీ పథకం అనుసంధాన నిధులతో వందకుపైగానే ప్రాంతాల్లో భవనాల నిర్మాణాలు ప్రారంభించారు. ప్రభుత్వం మారిపోవడం..నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవటంతో గుత్తేదారులు నిర్మాణాలు నిలిపేశారు. ఇప్పటికీ పూర్తి చేయలేదు. ఇంకొన్ని చోట్ల అప్పటి నుంచి ఈ నిర్మాణాల్లో పురోగతి కన్పించలేదు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన వాటిని వైకాపా సర్కారు నిర్లక్ష్యంగా వదిలేసింది. ఫలితంగా ఇరుకు అద్దె గదుల్లో.. అసౌకర్యాలతో నిండిన భవనాల్లో కేంద్రాల నిర్వహణ సాగుతోంది. పల్లెలు కంటే పురపాలికల్లో, నగరంలో భవనాల కొరత ఎక్కువగా ఉంది. ఇక్కడ అద్దె ఎక్కువగా ఉండటంతో ఇరుకు గదుల్లో అసౌర్యాల నడుమ కేంద్రాలను నిర్వహించాల్సి వస్తోంది. తాగునీటి సౌకర్యం లేకపోవటంతో ఇంటి నుంచే నీళ్ల సీసాలు తెచ్చుకుంటున్నారు. ప్రథమ చికిత్స కిట్లు కూడా రావడం లేదు. పిల్లల కుర్చీలు పాతవైపోవటంతో వాటిని అటకపైకి పడేశారు. ఆట వస్తువులు పాడైపోయాయి.
భీమడోలు అరుంధతి కాలనీ మీపంలో శిథిలావస్థలో ఉన్న పాత పీహెచ్సీ భవనంలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రం
చిన్నారులకు సమకూరని సౌకర్యాలు
జిల్లా కేంద్రమైన ఏలూరు అర్బన్ ప్రాజెక్టు పరిధిలో 120 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 86.. అద్దె గదుల్లోనే సాగుతున్నాయి. మిగిలిన 34 కేంద్రాలు వివిధ పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. వీటిలో సదుపాయాలు లేక చిన్నారులు అవస్థలు పడుతున్నారు. బియ్యం, ఇతర సరకులు, వంటావార్పు అన్నీ అక్కడే కావటంతో చాలీచాలని గదుల్లో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు.
నిలిచిన నాడు-నేడు పనులు
జిల్లాలో నాడు-నేడు కింద 229 కేంద్ర భవనాల నిర్మాణ పనులు చేపట్టారు. అనుమతిచ్చినా క్షేత్రస్థాయిలో చాలాచోట్ల ఎలాంటి కదలికా లేదు. కొన్ని గ్రామాల్లో పునాది దశలోనే ఉన్నాయి. మరికొన్ని చోట్ల కిటికీలు, శ్లాబ్ స్థాయి వరకు పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం సిమెంటు సరఫరాలో జాప్యంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.
ఇబ్బందుల మధ్య కేంద్రాల నిర్వహణ
జీలుగుమిల్లి మండలం కనకాపురం కేంద్రం మంచినీటి ట్యాంకు వద్ద అధ్వాన పరిస్థితిది. చేతులు శుభ్రం చేసుకోవడం.. ఇతర అవసరాలకు నీటిని పట్టుకోవాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. ట్యాంకు వద్ద పగిలిపోయి.. నిల్చోవడానికి కూడా వీలులేకుండా ఉంది.
న్యూస్టుడే, జీలుగుమిల్లి
కొయ్యలగూడెం మండలం అంకాలగూడెంలో 37 ఏళ్ల కిందట ఉపాధి హామీ పథకంలో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనం ఇది. ఆ తర్వాత కొన్నేళ్లకు పాఠశాలను మరో చోటకు తరలించడంతో ఆ భవనంలో కోడ్ నంబరు 125 అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భవనం శిథిలమైంది. కిటికీల తలుపులు ఊడిపోవడంతో అట్టలు అడ్డుపెట్టి కాలక్షేపం చేస్తున్నారు. శ్లాబు పెచ్చులూడుతోంది. భవనం స్తంభాలు సిమెంటు ఊడి ఊచలు బయటపడ్డాయి. వర్షాకాలంలో శ్లాబు కారుతుంది. బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. సొంత భవన నిర్మాణానికి స్థలం కేటాయించారు కానీ నిధులు కేటాయించలేదు.
న్యూస్టుడే, కొయ్యలగూడెం గ్రామీణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాను ఓటుతో కొట్టు
[ 11-05-2024]
అధికార వైకాపా వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉండి ప్రధాన కూడలిలో శుక్రవారం జరిగిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. -
అయిదేళ్లూ.. ధరల దండయాత్ర
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్ల పాటు ధరల దండయాత్ర చేసింది. నిత్యావసరాలు మొదలు ఇంధనం, విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు ఇలా అడ్డగోలుగా ధరలు పెంచి సామాన్యుడి నడ్డివిరిచింది. -
సైకో పోవాలి.. సైకిల్ రావాలి
[ 11-05-2024]
‘రైతుకు సాగు నీరు అందాలన్నా..గిట్టుబాటు ధర రావాలన్నా..యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా..పోలవరం పూర్తి కావాలన్నా..అమరావతి రాజధాని కావాలన్నా..నిత్యావసరాల ధరలు విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు తగ్గాలన్నా 13న మీరేం చేయాలి’ అంటూ ప్రజలను తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. -
మాటలు కోటలు.. జీతాల్లో కోతలు!
[ 11-05-2024]
అయిదేళ్ల జగన్ పాలనలో ప్రభుత్వోద్యోగులు అష్టకష్టాలు పడ్డారు. ప్రతినెలా ఒకటో తేదీ వేతనాలు అందకపోగా... ఇతరత్రా సౌకర్యాలను పొందలేకపోయారు. -
నోట్లకు.. ఓట్లు రాలతాయా?
[ 11-05-2024]
పోలింగ్కు మరికొన్ని గంటలే మిగిలి ఉండటంతో అభ్యర్థులు ప్రచారాలతో పాటు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. -
ప్రైవేటు బస్సు ఆపరేటర్ల బాదుడు
[ 11-05-2024]
ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ప్రయాణికులను భారీగా బాదేస్తున్నారు. -
మట్టి మాఫియా మళ్లీ బరితెగింపు
[ 11-05-2024]
అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో తలమునకలవుతోంది. ఇదే అదనుగా మట్టి మాఫియా ఆచంట మండలం అనగార్లంక, అంబేడ్కర్ కోనసీమ జిల్లా బెల్లంపూడి సరిహద్దులో రెండు రోజులుగా విజృంభించింది. -
పోయేది జనం ప్రాణాలేగా?
[ 11-05-2024]
అనుకోని విపత్తులు విరుచుకు పడితే ప్రభుత్వం దన్నుగా నిలబడాలి. నేనున్నానంటూ భరోసానివ్వాలి. వైకాపా సర్కారుకు మాత్రం ఇవేమీ పట్టవు. -
వైద్యం.. ఇదేం దౌర్భాగ్యం
[ 11-05-2024]
అధునాతన వైద్యసేవలను చేరువ చేస్తాం. భీమవరం వాసులకే కాకుండా పరిసర జిల్లాలకు చెందిన వారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పలు సందర్భాల్లో చెప్పారు. -
నమ్మి ఓటేస్తే.. నయవంచన!
[ 11-05-2024]
రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ, ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ గత సాధారణ ఎన్నికల సమయంలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని నిరుద్యోగ యువత మండిపడుతోంది. -
భీమవరంలో అమిత్షా పర్యటన రద్దు
[ 11-05-2024]
భీమవరంలో శనివారం జరగాల్సిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పర్యటన రద్దయిందని భాజపా క్రమశిక్షణ సంఘం రాష్ట్ర ఛైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ చెప్పారు. -
విధుల్లో నిర్లక్ష్యం.. అయిదుగురు కానిస్టేబుళ్లు సస్పెన్షన్
[ 11-05-2024]
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి సస్పెండ్ చేశారు.