జగనన్న బీమాయాజాలం
అనుకోని విపత్తులో మృత్యువు కబళించినా..కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు ప్రాణం విడిచినా..నేనున్నానంటూ ధీమానిచ్చే ప్రభుత్వ బీమాను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది.
దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తున్నా జమ కాని సొమ్ము
అమలులో ఆలస్యం.. అరకొరగా పరిహారం
అర్హతకూ కొర్రీలే..వేలాది కుటుంబాలకు ఎగనామం
ఈనాడు, భీమవరం, న్యూస్టుడే, బృందం
అనుకోని విపత్తులో మృత్యువు కబళించినా..కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు ప్రాణం విడిచినా..నేనున్నానంటూ ధీమానిచ్చే ప్రభుత్వ బీమాను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు బీమా ఊసే లేకుండా చేసి వేలాది మందికి అన్యాయం చేసింది. తర్వాత ఇస్తున్న పరిహారంలో కూడా అడ్డగోలు నిబంధనలు పెట్టి కోతలతో నిరుపేద కుటుంబాల వెన్ను విరిచింది. జగన్ అసమర్థతతో వందలాది కుటుంబాలకు ఏళ్ల తరబడి నిరీక్షణ, నిట్టూర్పులే మిగిలాయి.
ఇంట్లో ఎవరు మరణించినా తెదేపా పాలనలో చంద్రన్న బీమా వర్తింపజేసేవారు. అంత్యక్రియలకు ముందే మట్టి ఖర్చులకు రూ.10 వేలు అందజేసేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక మొత్తం మారిపోయింది. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకు అసలు పథకం ఊసే లేదు. 2021లో మొదలు పెట్టిన తర్వాత కూడా కుటుంబంలో సంపాదించే వ్యక్తికే పరిహారం ఇస్తానంటూ కొర్రీలు పెట్టి అడ్డగోలుగా కోతలు విధించారు. తెదేపా పాలన తుది దశలో ఎన్నికల నియమావళి వచ్చినప్పటి నుంచి వైకాపా అధికారంలోకి వచ్చే మధ్య కాలంలో ఉమ్మడి జిల్లాలో 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారంతా తెదేపా సానుభూతిపరులన్న వంకతో ఒక్కరికి కూడా వైకాపా సర్కారు పరిహారం ఇవ్వలేదు.
ఇదీ వైఎస్ఆర్ భరోసా దుస్థితి
నూజివీడు పట్టణానికి చెందిన మందపాటి గోపి 2020లో కిడ్నీ సమస్యతో చనిపోయారు. కుటుంబ సభ్యులు బీమాకు దరఖాస్తు చేశారు. వాలంటీర్లు అన్ని పత్రాలు తీసుకువెళ్లారు కానీ ఏళ్లు గడుస్తున్నా బీమా మాత్రం రాలేదు. ‘కుటుంబం దిక్కులేనిదైంది. పోషణ చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వ సాయం చేస్తుందని ఏళ్లుగా ఎదురు చూస్తున్నా ఫలితం లేదు’ అని గోపి భార్య వెంకటలక్ష్మి ఆవేదన చెందారు.
జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఎం.వరలక్ష్మి 2022 జూన్ 1న గుండెపోటుతో చనిపోయారు. ఆమె వైఎస్ఆర్ బీమా పథకంలో సభ్యురాలు. మరణించిన కొద్ది రోజులకు రూ.10 వేలు మట్టి ఖర్చుల నిమిత్తం ఇచ్చారు. రెండేళ్లు కావస్తున్నా..ఇప్పటి వరకు మిగిలిన రూ.90 వేలు రాలేదు. అధికారులకు, టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసినా ఫలితం లేదు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఓ కొడుకు ఉన్నారు. కూలి పనులు చేసుకుని పొట్ట నింపుకొంటున్నారు.
- నరసాపురం మండలం లిఖితపూడికి చెందిన అడబాల కృష్ణ ఈ ఏడాది జనవరి 31న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కుటుంబం పెద్ద దిక్కునే కాకుండా ఆధారాన్ని కూడా కోల్పోయింది. చనిపోయిన 15 రోజులకే ప్రభుత్వం నుంచి బీమా సొమ్ము రూ.5లక్షలు అందాల్సి ఉన్నా ఇప్పటికి రెండు నెలలైనా అందలేదు. దీంతో ఆ కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
- కైకలూరు మండలం సీతనపల్లికి చెందిన దండే సీమోను 2021 మార్చి 6న రహదారి ప్రమాదంలో చనిపోయారు. ఇప్పటికి మూడేళ్లు దాటినా కనీసం మట్టి ఖర్చులు కూడా రాలేదు. సిబ్బందిని అడుగుతుంటే అసలు మీ దరఖాస్తు మాకు అందలేదని చెబుతున్నారు. ‘బీమా నగదు వచ్చి ఉంటే అమ్మ అనారోగ్య సమస్యలకు ఆసరాగా ఉండేది. నేను చదువుకునే వాడిని. ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసి కూలి పనులకు వెళుతున్నా’ అంటూ సీమోను కొడుకు జయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదేనా చిత్త శుద్ధి.. ‘అనుకోని విపత్తుతో ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. బీమా క్లెయిమ్ చేసిన 15 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా బీపీఎల్ కుటుంబానికి జమ చేస్తుంది’ అంటూ బాకాలూదిన జగన్ వైఎస్ఆర్ బీమా పథకం అమలులో చతికిల పడ్డారు. ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందని దారుణ పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. కుటుంబ అండను కోల్పోయినా ప్రభుత్వం భరోసానిస్తుందనుకున్న నిరుపేదల ఆశయాలను చిదిమేసి జగన్ చిరునవ్వులు చిందిస్తున్నారు.
కోతలరాయుడు జగన్.. పరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 1.6 లక్షల కుటుంబాలకు అసలు బీమా పథకానికి అర్హత లేకుండా చేసింది. భీమవరం పట్టణంలో మట్టా శ్రీనివాస్(46) అనే వ్యక్తి రెండేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయారు. వారి బియ్యం కార్డు తీసుకుని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసేందుకు వెళ్లగా మీ పేరు నమోదు చేయలేదని, పరిహారం రాదని అధికారులు చెప్పారు. ఇలా ఉమ్మడి జిల్లాలో వందలాది మంది పరిహారం పొందే అర్హత ఉన్నా ప్రభుత్వ వైఖరితో అవస్థలు పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో వైఎస్ఆర్ బీమా కోల్పోయిన కుటుంబాల వివరాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు కోసం తెదేపా పట్టు.. ససేమిరా అన్న వైకాపా
[ 14-05-2024]
ఒక్క ఓటుకు మూడు గంటల పాటు పోలింగ్ను నిలిపివేసిన ఘటన మండలంలోని రామశింగవరంలో చోటుచేసుకుంది. -
ఓటుతో.. రాశాం.. సిరా శాసనం
[ 14-05-2024]
పల్లె లేదు.. పట్టణం లేదు.. ఉదయమని కాదు.. రాత్రని లేదు... వృద్ధులూ.. రోగులూ... దివ్యాంగులు..దూరాభారమైనా కదిలొచ్చారు ఎండైనా.. ఎంతసేపైనా నిలబడే ఉన్నారు ఎందుకంటే.. వేలిచుక్కతో వెలుగు రేఖ కోసం.. మార్పు కోసం.. భవిత కోసం -
వైకాపా బరి తెగింపు
[ 14-05-2024]
అయిదేళ్లుగా సాగుతున్న వైకాపా దౌర్జన్యకాండ పోలింగ్ రోజు కూడా కొనసాగింది. -
కిక్కిరిసిన వరుసలు.. గంటల తరబడి నిరీక్షణ
[ 14-05-2024]
ఉక్కపోత వేధిస్తున్నా.. వేడి గాలులు వీస్తున్నా అత్యధికశాతం ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రాధాన్యమిచ్చారు. -
ఈవీఎంల మొరాయింపు
[ 14-05-2024]
ఉమ్మడి పశ్చిమలో సార్వత్రిక ఎన్నికలు పలు కేంద్రాల్లో సోమవారం అర్ధరాత్రి వరకు సాగాయి. -
వసతుల కల్పనలో వైఫల్యాల వెక్కిరింత
[ 14-05-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం పోలింగ్ నిర్వహణలో అధికారులు విఫలమయ్యారు. -
మేమిక్కడ ఓటేశాం..బాధ్యత నెరవేర్చాం..
[ 14-05-2024]
ఉమ్మడి జిల్లాలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
అందరి చూపు.. ఉండి వైపు
[ 14-05-2024]
గత నాలుగేళ్లుగా వైకాపా సర్కారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై పదునైన విమర్శనాస్త్రాలు అలుపెరగని పోరాటం కొనసాగించిన నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రస్తుత ఎన్నికల్లో తెదేపా తరఫున ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో -
పోలింగ్ కేంద్రం ఒకటే.. నంబర్లు రెండు
[ 14-05-2024]
ఉంగుటూరు మండలం చేబ్రోలులోని ఓ పోలింగ్ కేంద్రానికి రెండు నంబర్లు ఉండటంతో ఓటర్లు తికమకపడ్డారు. -
ఈవీఎంలు ఎందుకు తీసుకెళ్లలేదు?
[ 14-05-2024]
భీమవరం బైపాస్ రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పోలింగ్ సకాలంలో ముగిసింది. -
అభ్యర్థుల వాగ్వాదం
[ 14-05-2024]
తాడేపల్లిగూడెంలోని సుబ్బారావుపేట 97వ పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. -
పోలింగ్ కేంద్రానికొచ్చి... ప్రాణాలు విడిచి...
[ 14-05-2024]
ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికొచ్చి... అక్కడ గుండె ఆగి ఒకరు మృతి చెందారు. ఓటేసి ఇంటికొచ్చాక తీవ్ర అస్వస్థతకు గురై మరొకరు తనువు చాలించారు. -
అక్కణ్నుంచి... ఇక్కడికి...
[ 14-05-2024]
కొత్తూరు పునరావాస కాలనీలోని నిర్వాసితులకు సుమారు మూడు కిమీ దూరంలోని వంకబొత్తప్పగూడెం అంగన్వాడీ కేంద్రంలో 190వ నంబరు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. -
ఎన్నికల అధికారిపై పడిన ఫ్యాన్
[ 14-05-2024]
పోలింగ్ కేంద్రంలో పీవోపై ఫ్యాన్ పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
వెజ్ థాలీ ధర పెరిగింది.. నాన్ వెజ్ తగ్గింది.. ఎందుకిలా?
-
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ నేత
-
జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
-
దిల్లీ మద్యం కేసులో ఆప్ను నిందితుల జాబితాలో చేరుస్తాం: ఈడీ
-
సార్వత్రిక ఎన్నికల వేళ.. సరిహద్దులో ‘పాక్’ డ్రోన్ల కలకలం!
-
అదే ఐపీఎల్ను మార్చేసింది..: రవిశాస్త్రి