నేడు కడపలో వివేకా ఐదో వర్ధంతి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై ఐదేళ్లు గడిచిపోయింది. ఇప్పటికీ హత్యకు అసలు కారకులెవరన్నదీ తేలకపోగా, న్యాయం దిశగా అడుగులు పడడంలేదు.
హాజరు కానున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల
వివిధ రాజకీయ పార్టీలను ఆహ్వానించిన సునీత
ఈనాడు, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై ఐదేళ్లు గడిచిపోయింది. ఇప్పటికీ హత్యకు అసలు కారకులెవరన్నదీ తేలకపోగా, న్యాయం దిశగా అడుగులు పడడంలేదు. ఈ నేపథ్యంలో కడపలో ఆయన కుమార్తె సునీత ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. నగరంలోని జయరాజ గార్డెన్స్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, వివేకా అభిమానులను సునీత ఆహ్వానించారు. కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల హాజరుకానున్నట్లు సమాచారం. షర్మిల, సునీత కార్యక్రమం వేదికగా చేసే ప్రసంగాలపై అందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. కార్యక్రమానికి వచ్చేవారితోనూ మాట్లాడించే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నారు. హత్య జరిగి ఐదేళ్లు గడిచిపోగా, న్యాయం జరిగే విషయంలో అడుగులు వెనక్కే పడుతుండడంపై సునీతతో పాటు షర్మిల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పలు సందర్భాల్లో బాబాయ్ను చంపిన హంతకులెవరంటూ షర్మిల ప్రశ్నించారు. దిల్లీ వేదికగా సునీత తీవ్ర స్వరంతో తన గళం వినిపించారు. తన తండ్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు, వెలుగుచూసిన కుట్ర కోణాలు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, బాధితులైన తమపైనే పోలీసులు ఎదురు కేసులు పెట్టడాన్ని ప్రజలకు వివరించాలని సునీత భావిస్తున్నారు. ఆత్మీయ సమావేశానికి సైతం కలిగిస్తున్న ఇబ్బందులపై వివేకా కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వేదికకు పులివెందులలో విజయ గార్డెన్స్ను ఎంపిక చేసి అద్దె సైతం చెల్లించారు. ఒప్పందం చేసుకున్నాక నిర్వాహకులు మాట మార్చి ఆ రోజు ఫంక్షన్ హాల్ ఖాళీ లేదంటూ వైకాపా నేతల ఒత్తిళ్లతో దాట వేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సునీత ఆత్మీయ సమావేశం కడపకు మార్చు కున్నారు. ఇలాంటి ఇబ్బందులకు వెరవకుండా అడుగు ముందుకు వేయాలనే సంకల్పంతో పట్టుదలతో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల దిల్లీ వేదికగా సునీత మీడియా సమావేశం నిర్వహించి తన వాదన... వేదనను వెలిబుచ్చారు. రానున్న ఎన్నికలల్లో జగనన్నకు ఓటెయ్యద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. రెండో అడుగుగా అత్మీయ సమావేశం పేరిట కార్యక్రమాన్ని తలపెట్టి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాలని భావిస్తున్నారు. కార్యక్రమానికి ఉమ్మడి కడప జిల్లా నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, వివేకా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటెత్తారు.. ఓటెత్తారు..!
[ 14-05-2024]
జిల్లాలో సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఓటర్లు మండుటెండను లెక్క చేయకుండా, వైకాపా నేతల దాడులకు వెరవకుండా తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. -
బరిలో నిలిచారు... ఓటరుగా గెలిచారు
[ 14-05-2024]
జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఓటర్లు పోలింగ్కేంద్రాలకు పోటెత్తారు. కడపలో తెదేపా అభ్యర్థి మాధవి, తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఉపముఖ్యమంత్రి అంజాద్బాషాలు ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నారు. -
తెదేపా-వైకాపా వర్గీయుల రాళ్లదాడులు
[ 14-05-2024]
మండల పరిధి మబ్బుచింతలపల్లెలో పోలింగ్ సందర్భంగా సోమవారం వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. -
సిద్దవటంలో స్వల్ప ఉద్రిక్తత
[ 14-05-2024]
సిద్దవటంలోని దిగువపేటలో సోమవారం రాత్రి వైకాపా, జనసేన నాయకుల మధ్య ఘర్షణకుతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దిగువపేటలోని పోలింగు కేంద్రం వద్ద ఉదయం ఆయా పార్టీల ఏజెంట్ల మధ్య స్వల్పంగా వాగ్వాదం చోటుచేసుకుంది. -
రూ.30 కోట్ల ఎకో పార్కు ఏమైంది?
[ 14-05-2024]
ఉక్కాయపల్లి కంపోస్ట్యార్డులో రూ.30 కోట్ల వ్యయంతో ఎకో పార్కు నిర్మాణం చేపట్టారు. అసలు అక్కడ ఏం పనులు చేపడుతున్నారో, ఏం చేశారో పూర్తయ్యేవరకు ఎవరికీ తెలీదు. -
వైకాపా నేతల బెదిరింపులు
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా నేతలు బరితెగించి బెదిరింపులకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద తిష్టవేసి హల్చల్ చేశారు. -
పోటెత్తారు..ఓటెత్తారు..!
[ 14-05-2024]
జిల్లాలో సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఓటర్లు మండుటెండను లెక్క చేయకుండా, వైకాపా నేతల దాడులకు వెరవకుండా తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. -
అప్రజాస్వామిక వాదులపై ఉక్కుపాదం మోపాలి : నల్లారి
[ 14-05-2024]
ఎన్నికల కమిషన్ను సవాలు చేసేందుకు కొందరు అప్రజాస్వామిక వాదులు సిద్ధంగా ఉన్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి తెలిపారు. -
బరిలో నిలిచారు... ఓటరుగా గెలిచారు
[ 14-05-2024]
తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం నుంచే పోలింగ్కేంద్రాలకు పోటెత్తారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా... దాడులు, దౌర్జన్యాలు
[ 14-05-2024]
ఓటు వేసే విషయమై మదనపల్లె మండలం పోతబోలు గ్రామంలో వివాదం చోటు చేసుకుంది. సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలు సాయంత్రం 6 గంటలకు ముగిశాయి. -
రణరంగాన్ని తలపించిన సార్వత్రిక ఎన్నికలు
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఆసాంతం రణరంగాలను తలపించాయి. రైల్వేకోడూరు నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఎన్నికలు దాడులు, దౌర్జన్యాలు, కవ్వింపు చర్యలు, -
ఈవీఎంలు కుయ్యో... మొర్రో
[ 14-05-2024]
మదనపల్లె పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్ 2024.. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఇవే...
-
హోర్డింగ్ కుప్పకూలిన ఘటన.. వెలుగులోకి పలు కీలక విషయాలు
-
వెజ్ థాలీ ధర పెరిగింది.. నాన్ వెజ్ తగ్గింది.. ఎందుకిలా?
-
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ నేత
-
జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
-
దిల్లీ మద్యం కేసులో ఆప్ను నిందితుల జాబితాలో చేరుస్తాం: ఈడీ