జగన్ ఝలక్... కరెంట్ షాక్!
వైకాపా పాలనలో విద్యుత్తు నియంత్రికలు, సామగ్రికి ధరాఘాతం తప్పడం లేదు. అస్మదీయులకు ఆయాచితంగా లబ్ధి కలిగించాలని ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
విద్యుత్తు నియంత్రికలు, ఇతర సామగ్రిపై ధరల పిడుగు
వైకాపా ప్రభుత్వంలో వినియోగదారుల నిలువు దోపిడీ
అస్మదీయుల తయారీ సంస్థలకు ఆయాచితంగా లబ్ధి
న్యూస్టుడే, కడప
వైకాపా పాలనలో విద్యుత్తు నియంత్రికలు, సామగ్రికి ధరాఘాతం తప్పడం లేదు. అస్మదీయులకు ఆయాచితంగా లబ్ధి కలిగించాలని ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నియంత్రికలు, సామగ్రి తయారు చేస్తున్న సంస్థలు, సరఫరాదారులకు మేలు చేకూర్చేవిధంగా సీఎం జగన్ ఏలుబడిలో పెద్దలు కీలక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చారు. ఆమాంతం ధరలను పెంచేయడంతో వినియోగదారులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా అదనపు భారం పడుతోంది. అడ్డుఅదుపు లేకుండా ధరలు పెరుగుతున్నా మేమింతే అన్నట్లు పాలకులు వ్యవహరిస్తున్నారు.
దక్షిణ ప్రాంత విద్యుత్తు సరఫరా సంస్థ (ఎస్పీడీసీఎల్) పరిధిలో 25 కేవీ సామర్థ్యం ఉన్న నియంత్రిక ధర గత ప్రభుత్వ హయాంలో రూ.61,216 ఉండేది. వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం 2022, డిసెంబరు నాటికి రూ.1,39,999కు పెంచారు. ప్రస్తుతం పన్నులతో కలిపి రూ.1.68 లక్షలు పలుకుతోంది. ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉన్న తయారీ సంస్థల యాజమానులకు మేలు చేయాలని ధరలను పెంపునకు అనుమతిచ్చారు. సామగ్రి ధరలను నానాటికీ మరింత ఖరీదు కావడంతో కొనుగోలుదారులు వామ్మో ఇదేం వడ్డన అంటూ అదిరిపడుతున్నారు. అదే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నియంత్రిక ధర రూ.లక్ష లోపే పలుకుతోంది. అదే మన రాష్ట్రంలో చూస్తే ఆకాశమే హద్దుగా పెంచేస్తున్నారు సామగ్రి అవసరమైనవారికి చుక్కలు చూపిస్తున్నారు. విద్యుత్తు సామగ్రి ధరలు సైతం కొండెక్కి కూర్చోవడంతో అవసరమైన వారు కొనాలంటే ఇబ్బందులు పడుతున్నారు. వెలుగుదివ్వె సరఫరాకు వినియోగించే అల్యూమినియం తీగల ధరలకు రెక్కలొచ్చాయి. 8, 9.1, 11 మీటర్ల పొడవు ఉన్న సిమెంటు స్తంభాలు, డిస్కలు, ఇన్సులేటర్లు, జి.ఐ ఎర్త్ పైపులు, ఎ.బి.స్విచ్లు ఇలా అన్ని రకాల పరికరాలు, సామగ్రిపై వడ్డించారు. వీటిని ఎస్పీడీసీఎల్ అధికారులు ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఎన్నలేనంతంగా ఇబ్బడిముబ్బడిగా ధరలు పెంచేసి దోపిడీ చేస్తున్నారు.
ప్రాధాన్యం గాలికొదిలేశారు...
వ్యవసాయ సర్వీసు కావాలని రైతులు కొత్తగా దరఖాస్తు చేస్తున్నారు. విద్యుత్తు మోటారు 10 అశ్వశక్తి సామర్థ్యం ఏర్పాటు చేసుకోవాలంటే రూ.12,400 చెల్లించాల్సి ఉంది. విద్యుత్తు నియంత్రిక 25 కేవీ, మూడు స్తంభాలు, 180 మీటర్ల పొడవున మూడు వరుసల తీగలు ఇవ్వాలి. ఈ తర్వాత ప్రధాన లైను నుంచి పంపుసెట్టు దూరంగా ఉంటే అదనంగా అన్నదాతలు భరించాలి. ఈ భారం కర్షకుల నెత్తిపైన పడుతోంది. మరోవైపు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వెంటనే పరిశీలించి నిర్ణీత రుసుం చెల్లించాలని సమాచారమివ్వాలి. డబ్బులు చెల్లించిన తర్వాత ప్రాధాన్యత క్రమం (సీనియార్టీ)ని పరిగణనలోకి తీసుకొని కనెక్షన్లు మంజూరు చేయాలని ఎస్పీడీసీఎల్ నిబంధనలను చెబుతున్నాయి. ఇక్కడ ఇవేమి అమలు కావడం లేదు. పలుకుబడి ఉన్న వారికి శరవేగంగా పనులు చేస్తుండగా, ఎలాంటి పరపతి లేకుండా, పైరవీలు చేయలేని వారంతా ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రాధాన్యం అమలు చేయకుండా గాలికొదిలేశారు.
విపత్తులొస్తే కాసుల పంట
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విద్యుత్తు సరఫరా వ్యవస్థకు అపార నష్టం జరుగుతోంది. భారీ వర్షాలు కురిసి వరదలొచ్చినా, బలమైన ఈదురుగాలులతో స్తంభాలు విరిగి కూలిపోతున్నాయి. తీగలు చెల్లాచెదురుగా పడిపోతున్నాయి. నియంత్రికలు కిందపడి దెబ్బతింటున్నాయి. పునరుద్ధరణ పనుల్లో జాప్యం జరుగుతోంది. మరమ్మతులు అత్యవసరంగా చేయాలని అడుగుతున్న రైతుల నుంచి అదనంగా వసూళ్ల పర్వం సాగుతోంది. డబ్బులివ్వకపోతే ఆలస్యం చేస్తున్నారు. ఇటీవల విద్యుత్తు చోరీలు క్రమేణా పెరుగుతూ వస్తున్నాయి. నియంత్రికలను ధ్వంసం చేస్తున్న దొంగలు అందులోని సామగ్రిని పట్టుకెళ్లుతున్నారు. పోలీసు కేసు నమోదు చేయడంతో ఆలస్యం జరుగుతోంది. ఎఫ్ఐఆర్ పత్రం లేనిదే కొత్తగా మంజూరు చేయడం లేదు. పైగా రెండు, మూడు నెలల పాటు నిరీక్షణ చేస్తేగానీ సరఫరా చేయడం లేదు. విపత్తులు వస్తే అధికార యంత్రాంగానికి కాసుల పంట పండుతోంది. ఎస్పీడీసీఎల్ యంత్రాంగం చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల సిఫార్సులకు పెద్దపీట వేస్తున్నారు.
ఉమ్మడి కడప జిల్లాలో....
విద్యుత్తు సర్వీసులు : 12,47,277
ఫీడర్లు : 1,070
వ్యవసాయ కనెక్షన్లు : 1,88,837
ఫీడర్లు : 853
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
షర్మిలను గెలిపించండి: వైఎస్ విజయమ్మ
[ 11-05-2024]
పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ.. ఏపీ సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేశారు. -
కడపలో షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు
[ 11-05-2024]
కడపలోని షిర్డి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు, పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. -
పదేళ్లుగా ఆయనే నేత... మారలేదు ప్రజల తలరాత!
[ 11-05-2024]
పెద్దిరెడ్డి మిథున్రెడ్డి... వైకాపా రాజంపేట ఎంపీగా పదేళ్లుగా ఉంటున్నారు. సీఎం జగన్కు అత్యంత ప్రీతిపాత్రుడు...నమ్మకమైన వ్యక్తి కూడా. -
దోపిడీదారులకు ఓటేయొద్దు
[ 11-05-2024]
సహజ సందప, వనరులను దోచుకుని వాటి ద్వారా సంపాదించిన డబ్బులతో ఎన్నికల్లో గెలవాలని వైకాపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ సీఎం భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఐదేళ్లు జగన్ కులాసా.. రైతులకేదీ భరోసా..?
[ 11-05-2024]
విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతలకు అండగా నిలబడతామని సీఎం జగన్ డప్పు కొట్టారు. కర్షకుల కన్నీళ్లు తుడుస్తామని, పూర్తిస్థాయిలో సేవలందించడానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని గొప్పగా ప్రకటించారు. -
ఉప ముఖ్యమంత్రిగా.. ఉపయోగమేంటి..?
[ 11-05-2024]
అంజాద్బాషా... కార్పొరేటర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2014లో వైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ ఓడిపోయినందున ఏమీ చేయలేనని ఐదేళ్లపాటు నగర వాసుల్ని నమ్మించారు. -
అంజాద్ బాషాను కాదు... నన్ను చూడండి
[ 11-05-2024]
‘వైకాపా కడప అసెంబ్లీ అభ్యర్థి అంజాద్బాషాపై కొద్దో, గొప్పో కోపం ఉన్నా పక్కన పెట్టండి... నన్ను చూసి ఓటేయండి...’ అని కడప నగరంలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ఓటర్లను వేడుకున్నారు. -
ఉపాధి అన్నావ్.. ఉసురు పోసుకున్నావ్!
[ 11-05-2024]
ఏటా ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన హామీని విస్మరించి నిరుద్యోగులను సీఎం జగన్ నిండా ముంచారు. కొత్త కంపెనీలు రాకపోగా, ప్రోత్సాహకాలు లేక ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలివెళ్లాయి. -
ఆస్తులు మనవి కావాలంటే జగన్ను ఓడించాలి
[ 11-05-2024]
ప్రజల భూములు కాజేసేందుకే వైకాపా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తోందని తెదేపా ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు. -
రాష్ట్రంలో వైకాపాకు ఇవే చివరి ఎన్నికలు
[ 11-05-2024]
రాష్ట్రంలో వైకాపాకు సోమవారం జరిగే ఎన్నికలు చవరివని ఆ పార్టీ ఎన్నికల తరువాత ప్రజలిచ్చే తీర్పుతో కనుమరుగు కావడం ఖాయమని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. లింగారెడ్డి పేర్కొన్నారు. -
తెదేపాలో భారీగా చేరికలు... శ్రేణుల్లో ఉత్సాహం
[ 11-05-2024]
ప్రొద్దుటూరులో తెదేపాలోకి చేరికలు, వసలు, కలయికలతో కళకళలాడుతోందని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. -
రాచమల్లు చెప్పేదొకటి... చేసేది మరొకటి
[ 11-05-2024]
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి ఆయన మాటలు కోటలు దాటుతాయి... చేతలు మాత్రం గడప దాటవు. గొప్ప మాటకారి. అభినవ దానకర్ణుడిగా పేరుపొందారు. -
ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలను జమ్మలమడుగులో ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. -
ఓటింగ్ ప్రక్రియ ముగిసేవరకు సహకరించాలి
[ 11-05-2024]
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ఈ నెల 13న జరగనున్న పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా ముగిసే వరకు అభ్యర్థులు అన్ని విధాలుగా సహకరించాలని ఎన్నికల పరిశీలకుడు భానుదాసు పాల్వే, ఆర్వో కౌసర్ బాను స్పష్టం చేశారు. -
జగన్లో కాంగ్రెస్ కలవరం!
[ 11-05-2024]
వైకాపా అధినేత, సీఎం జగన్ ఎన్నడూ లేని విధంగా కడపలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పదేపదే కాంగ్రెస్ పార్టీ పేరు ప్రస్తావించారు. ఓట్లు చీల్చేస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. -
మమ్మల్ని నమ్మడంలేదు... మీరైనా రండి!
[ 11-05-2024]
ప్రజల మనసును తెలుసుకున్న వైకాపా నేతలు వాలంటీర్ల వెంటపడుతున్నారు. జగనే మా నమ్మకం అంటూ నినదించిన ఆ పార్టీ నేతలు... ఇప్పుడు మీరే మా దిక్కంటూ వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇ-ఫైలింగ్ పోర్టల్లో కొత్త సదుపాయం.. నోటీసులు తెలుసుకోవడం సులువు
-
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!