logo

పెద్దిరెడ్డి ప్రోద్బలంతోనే తెదేపా నేతలపై కేసులు

మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి జోక్యంతోనే పోలీసులు తెదేపా నేతలపై  హత్యాయత్నం కేసులు నమోదు చేశారని తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు పేర్కొన్నారు.

Published : 29 Apr 2024 03:49 IST

మాట్లాడుతున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు, నాయకులు

రాయచోటి, న్యూస్‌టుడే: మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి జోక్యంతోనే పోలీసులు తెదేపా నేతలపై  హత్యాయత్నం కేసులు నమోదు చేశారని తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు పేర్కొన్నారు. రాయచోటిలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బోయకొండ ఆర్చి వద్ద తెదేపా నేతలపై వైకాపా నేతలు రాళ్లదాడికి పాల్పడడం పిరికిపంద చర్య అని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి దాడులతో తెదేపా కార్యకర్తలు, నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన పేర్కొన్నారు. వైకాపా మునిగిపోయే నావా అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో తెదేపా వీరబల్లి మండలాధ్యక్షుడు భానుగోపాల్‌రాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని