కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
కడప నగర కార్పొరేటర్లపై వైకాపా అభ్యర్థి అంజాద్బాషాకు అనుమానాలు వెంటాడుతున్నాయి. తన గెలుపునకు అంకితభావంతో సహాయపడడంలేదనే సంకోచంతో తరచూ వారితో భేటీకి ప్రయత్నిస్తున్నారు.
శనివారం రాత్రి రహస్య సమావేశం
శాంతపరిచేందుకు విశ్వప్రయత్నాలు
బ్రదర్ అనిల్కుమార్తో భేటీ అయిన అఫ్జల్ అలీఖాన్
ఈనాడు, కడప: కడప నగర కార్పొరేటర్లపై వైకాపా అభ్యర్థి అంజాద్బాషాకు అనుమానాలు వెంటాడుతున్నాయి. తన గెలుపునకు అంకితభావంతో సహాయపడడంలేదనే సంకోచంతో తరచూ వారితో భేటీకి ప్రయత్నిస్తున్నారు. నగరంలో 50 డివిజన్లు ఉండగా వీటిలో 49 స్థానాలను వైకాపా గెలుచుకుంది. వీరిలో చాలామందికి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉపముఖ్యమంత్రికి పొసగడం లేదనే ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి పనులు, వాటి కేటాయింపులు, కమీషన్ల వ్యవహారంలో తేడాలున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం ఎన్నికలు వరకు వచ్చేసరికి ముదిరి పాకానపడినట్లు సమాచారం. తెదేపా, వైకాపా అభ్యర్థులు నామినేషన్లను ఈ నెల 24న ఒకేసారి దాఖలు చేయగా తెదేపా అభ్యర్థి మాధవి ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. అదే ఉపముఖ్యమంత్రి అంజాద్బాషా ర్యాలీకి ఆశించినంతగా జనం రాలేదు. దీంతో కార్పొరేటర్లపై అంజాద్బాషాకు అనుమానాలు తలెత్తాయి. కార్పొరేటర్లు చాలామంది సహాయ నిరాకరణతోనే నామినేషన్ కార్యక్రమానికి జనం హాజరు కాలేదనే అంచనాకు వస్తున్నారు. కొందరు కార్పొరేటర్లు తెదేపాతో సంబంధాలు నెరుపుతున్నారనే అనుమానాలు వైకాపా నేతలను వెంటాడుతున్నాయి. దీంతో శనివారం రాత్రి కార్పొరేటర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి వారిని శాంతపర్చే ప్రయత్నాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కొందరికైతే ఖర్చుల కింద కొంత నగదు సైతం అందజేసినట్లు సమాచారం. అందరూ వైకాపా అభ్యర్థి గెలుపునకు కృషిచేయాలని జిల్లాకు చెందిన కీలక నేత కార్పొరేటర్లకు మరింత నొక్కి చెప్పినట్లు తెలిసింది. చాలామంది సరేనంటూ నిష్ఠూరంగా ఊకొట్టినట్లు సొంత పార్టీ నేతలో ప్రచారం చేస్తున్నారు.
అఫ్జల్ అలీఖాన్ నామినేషన్ తిరస్కృతికి విశ్వప్రయత్నాలు...
వైకాపా కీలక నేత అఫ్జల్ అలీఖాన్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఉపముఖ్యమంత్రి అంజాద్బాషాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. పార్టీ తనకు అన్ని రకాలుగా మోసం చేసిందంటూ విమర్శలు గుప్పించారు. పార్టీ నుంచి బయటకు వెళ్లే వరకు పెద్దగా అందోళన పడని వైకాపా... కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో షాక్కు లోనైంది. తమ పార్టీ ఓట్లకు గండి కొట్టేస్తారనే ఆందోళనతో అఫ్జల్ అలీఖాన్ దాఖలు చేసిన నామినేషన్ను ఏదో కారణంతో తిరస్కరణకు విశ్వప్రయత్నాలు సాగించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వంలో కీలక వ్యక్తులు అధికారులపై ఒత్తిడి చేసి పలు రకాలుగా ప్రయత్నం చేయగా, అఫ్జల్ అలీఖాన్ విషయం తెలుసుకుని తీవ్రంగా పట్టుబట్టడంతో అధికారులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇదే సమయంలో తెదేపా అభ్యర్థి మాధవి పేరుతో ఉన్న మరో మహిళతో నామినేషన్ వేయించగా సక్రమంగా లేకపోవడంతో తిరస్కరణకు గురికావడం వైకాపాకు మింగుడు పడడంలేదు. అఫ్జల్ అలీఖాన్ పోటీలో ఉండడం రుచించని వైకాపా నేతలు... ఒకింత ఆందోళనతో దిగులు చెందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి వేగంగా పావులు కదుపుతూ పార్టీలోకి చేరికలకు ప్రయత్నాలు చేస్తున్నారు. రామకృష్ణ నగర్లో పలువురిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తన గెలుపునకు మద్దతు కోరుతూ అఫ్జల్ అలీఖాన్ ఆదివారం పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి షర్మిల భర్త బ్రదర్ అనిల్కుమార్ను కలిశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటోత్సాహం!
[ 15-05-2024]
జిల్లాలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఓటర్లు ఓటేసేందుకు ఉత్సాహం చూపారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. -
తెదేపా యువకులపై వైకాపా మూకల దాడి
[ 15-05-2024]
పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయొద్దని అడ్డుకున్నందుకు తెదేపా సానుభూతిపరులైన యువకులపై వైకాపా నాయకులు దాడులకు తెగబడ్డారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. -
వైకాపా నాయకుల ప్రలోభాలను తిప్పికొట్టాం
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పులివెందులలోని పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లను వైకాపా నాయకులు ప్రలోభాలకు గురి చేశారని తెదేపా పులివెందుల నియోజకవర్గ అభ్యర్థి బీటెక్ రవి ఆరోపించారు. -
అంతా రహస్యం!
[ 15-05-2024]
గుత్తేదారుల పరుగులు.... అందులోనూ వైకాపా కీలక నేతల అనుయాయుల్లో కదలికలు... ఇంజినీరింగ్ విభాగాల్లో గుసగుసలు... రహస్యంగా కదులుతున్న ఫైళ్లు... పెండింగ్ బిల్లుల అప్లోడింగ్... వరుస క్రమంలో కాకుండా అడ్డమార్గాల్లో బిల్లుల చెల్లింపులు.. -
చెప్పినట్లే చేశారు!
[ 15-05-2024]
ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడితే తాటతీస్తాం. పరిస్థితిని బట్టి అలాంటి వారిని తరిమితరిమి కొడతాం. ఈవీఎంలను ఎవరినీ తాకనీయం. తాకితే వారికి మూడినట్లే.. అల్లర్లకు పాల్పడినా, హింసకు పాల్పడినా నిందితులను జిల్లా బహిష్కరణ చేస్తాం. -
వైభవంగా త్రిశూల చక్రస్నానం
[ 15-05-2024]
పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం త్రిశూల చక్రస్నాన ఘట్టాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. క్షేత్రాధిపతి వైద్యనాథేశ్వరస్వామిని కామాక్షి అమ్మవారితో సహా పినాకినీ నదీతీరానికి తీసుకురాగా, -
అంజాద్బాషాకు ప్రజలే తగినశాస్తి చేస్తారు
[ 15-05-2024]
పోలింగ్ కేంద్రంలోకి ఏ మగాడు వస్తాడో చూస్తాను అంటూ డిప్యూటీ సీఎం అంజాద్బాషా ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించారని... ఆయన మగతనం రోడ్ల జంక్షన్లో చూపించుకోవాలని, -
అండగా ఉంటా...
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి వెళ్లి ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు చిన్నయ్యకు అండగా ఉంటానని మైదుకూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. -
ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై దాడి ఘటనలో నిందితుడి అరెస్టు
[ 15-05-2024]
జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై ఇటుక పెళ్లతో దాడి చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ యశ్వంత్ తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. -
సార్వత్రిక సమరం... కొనసాగిన పురుషాధిక్యం
[ 15-05-2024]
సార్వత్రిక సమరం ముగిసింది. మార్చి 16న ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పట్నుంచి రాజకీయ నాయకులు వ్యూహ ప్రతి వ్యూహాలకు పదునుపెట్టారు. ఏప్రిల్ 18న నామినేషన్ల ఘట్టంతోనే ఎన్నికల ప్రచారానికి తెరలేచింది. -
మాదిగలు ఏజెంట్లుగా కూర్చోకూడదా?
[ 15-05-2024]
మాదిగలు ఏజెంటుగా కూర్చునే హక్కు లేదా అని ఎమ్మార్పీఎస్, ఎం.ఎస్.పి. జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాదిగ, కె.ఎన్.రాజు ప్రశ్నించారు. కడప ప్రెస్క్లబ్లో మంగళవారం వారు మాట్లాడుతూ -
రాళ్లదాడి ఘటనపై ఇరువర్గాలు ఫిర్యాదులు...కేసు నమోదు
[ 15-05-2024]
ఎన్నికల సందర్భంగా కడప రెండో పట్టణ ఠాణా పరిధిలోని గౌస్నగర్లో సోమవారం రాత్రి జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఇరువర్గాలు మంగళవారం సీఐ ఇబ్రహీంకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
-
అందుకే ‘జనతా గ్యారెజ్’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్
-
ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు.. వైకాపా నేతల దుశ్చర్య
-
యశోదాలో ఉద్యోగుల వేతనాల పేరిట రూ.3.26 కోట్లు స్వాహా
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,250 ఎగువన నిఫ్టీ
-
నార్కోటిక్ అంటాడు.. నమ్మితే ముంచేస్తాడు