ఉద్యోగ, ఉపాధ్యాయులతో చెలగాటం
జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ యంత్రాంగం ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం అడుతోంది. విధి నిర్వహణ పట్ల బాధ్యతా రాహిత్యం, అవగాహన లోపం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు బహిర్గతమైంది.
డ్వామాలో రోజంతా పడిగాపులు
నిరుత్సాహంతో వెనుదిరిగిన ఇతర జిల్లాల ఓటర్లు
డ్వామా కార్యాలయంలో నిరీక్షిస్తున్న కర్నూలు ఉద్యోగులు
అనంతపురం (శ్రీనివాసనగర్), న్యూస్టుడే: జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ యంత్రాంగం ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం అడుతోంది. విధి నిర్వహణ పట్ల బాధ్యతా రాహిత్యం, అవగాహన లోపం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు బహిర్గతమైంది. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి అనంత జిల్లాలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనంత నగర డ్వామా కార్యాలయ ఆవరణలో జిల్లా స్థాయి ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శనివారం నుంచే ఓటు వేయవచ్చని ముందుగానే తగిన షెడ్యూల్ ప్రకటించారు. ఈ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు శ్రీసత్యసాయి, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల, వైఎస్ఆర్ కడప.. వంటి జిల్లాలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయులు డ్వామాలో గంటలకొద్దీ నిరీక్షించారు. ఉదయం 9 గంటలకు మొదలు కావాల్సిన ఓటింగ్.. సాయంత్రం 4 గంటలైనా కాలేదు. ఇక లాభం లేదంటూ వెనుదిరిగారు. ఆయా జిల్లాల్లోని ఎమ్పీ, ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేస్తున్న పోస్టల్ బ్యాలెట్ పత్రాలు సకాలంలో జిల్లాకు చేరలేదు.
ఉద్యోగుల పేర్లను మొబైల్ లైటు వెలుతురులో చూస్తున్న కలెక్టర్ వినోద్కుమార్
నోడల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
డ్వామాలో జిల్లా స్థాయి ఫెసిలిటేషన్ కేంద్రం మొదలు కాలేదన్న విషయం కలెక్టర్ వినోద్కుమార్కు తగిన సమాచారం లేదు. రాప్తాడు నియోజకవర్గ వివాదం నేపథ్యంలో డ్వామా ఫెసిలిటేషన్ కేంద్ర జాబితాలో వారి పేర్లు ఉన్నాయా లేదా అని ఆరా తీసేందుకు శనివారం రాత్రి అక్కడికి వచ్చారు. ఈయనతోపాటు వందలాది ఉద్యోగులు ఆయన వెంట వచ్చారు. ఇక్కడ ఓటింగ్ మొదలు కాలేదని తెలుసుకుని అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఇతర జిల్లాలకు సంబంధించి 951 మంది పేర్లు ఉన్నాయి. వీరందరూ అక్కడే ఓటు వేస్తే... సంబంధిత జిల్లాల ఆర్ఓలకు వాటిని పంపిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుచిగా వండాలంటే.. శుచి, శుభ్రతకు చోటేది?
[ 02-06-2024]
మధ్యాహ్న భోజనం నాణ్యమైన రుచులతో వడ్డించాలని ఆర్భాటం చేసిన అధికారులు వండటానికి శుచి, శుభ్రతతో కూడిన చోటు కల్పించడంలో విఫలమవుతున్నారు. సదుపాయమే లేనిచోట రుచికరమైన వంటలెలా తయారవుతాయోనన్న ఆలోచనను విస్మరించారు. -
కూటమి వైపే ఓటర్లు!
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 4వ తేదీన నిర్వహించనున్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని తెదేపా నాయకులు స్పష్టం చేస్తున్నారు. -
ఆగని కబ్జా పర్వం.. కుంటలు మాయం
[ 02-06-2024]
గుత్తి శివారులోని చాకలి కుంటలో కొంత భాగాన్ని వైకాపా నాయకులు ఆక్రమించారు. బంకులు ఏర్పాటు చేసి కబ్జా చేశారు. ఈవిషయం అధికారులకు తెలిసి బంకులను పక్కకు తోసేశారు. -
తొలుత సిఫార్సులతో నియామకం.. తర్వాత కాంట్రాక్టు హోదా
[ 02-06-2024]
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో బోధన ఉద్యోగాల నియామకం వివాదాస్పదంగా మారింది. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు, సహాయార్యుల కొరత కారణంగా టీచింగ్ అసిస్టెంట్లు, అతిథి, తాత్కాలిక అధ్యాపకులను నియమించుకుంటున్నారు. -
జిల్లా అంతటా నిఘా
[ 02-06-2024]
‘ఈనెల 4న ఓట్ల లెక్కింపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతుంది. జిల్లాంతటా ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా పూర్తి స్థాయి నిఘా ఉంచాం. జిల్లా వ్యాప్తంగా 315 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించాం. ప్రత్యేక నిఘా ఉంటుంది’ అని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్, ఎస్పీ గౌతమిశాలి స్పష్టం చేశారు. -
కొందరికే పింఛను సొమ్ములు
[ 02-06-2024]
బ్యాంకులకు వెళ్లి పింఛను తీసుకోవాలని చెప్పడంతో ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. శనివారం కావడంతో మధ్యాహ్నం వరకే బ్యాంకులు ఉంటాయని ఉదయం 9 గంటలకే బ్యాంకులకు చేరుకున్నారు. సొమ్ము పడలేదని సచివాలయంలోకి వెళ్లి పరిశీలించుకోవాలని సూచించడంతో మళ్లీ అక్కడకు పరుగులు తీశారు. -
పేదలకు బియ్యంతో సరి
[ 02-06-2024]
పౌర సరఫరాల ద్వారా నిరుపేదలకు అందిస్తున్న నిత్యావసరాల పంపిణీలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతినెలా రేషన్ సరకుల్లో కోత విధిస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకు అరకొరగా పంపిణీ చేసే కందిపప్పు, గోధుమ, రాగిపిండిని పూర్తిగా నిలిపివేసింది. -
దిక్కూ మొక్కూ లేని స్థితిలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు
[ 02-06-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు దిక్కుమొక్కులేని స్థితిలో కునారిల్లిపోయాయి. పనులు లేవు, నిధుల మంజూరు లేదు, అభివృద్ధి లేదు అన్నది సుస్పష్టం. ధర్మవరం వ్యవసాయ మార్కెట్ కమిటీకి (ఏఎంసీ) పాలకవర్గ నియామకం ఊసే మరిచిపోయారు. -
భద్రతా వలయంలో జేఎన్టీయూ
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న తరుణంలో నగరంలో పోలీసు వర్గాలు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు జరిగే జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతా చర్యలను పూర్తిచేశారు.