logo

Kishan Reddy: పాత చట్టానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘హైడ్రా’ అని పేరు పెట్టింది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Eenadu icon
By Telangana Dist. Team Published : 18 Jan 2025 16:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రామాల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan reddy) అన్నారు. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో  ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఏడు నెలలుగా జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలోని వీధిటైట్ల నిర్వహణకు నిధుల కొరత ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేస్తే.. అదే విధానాన్ని కాంగ్రెస్‌ (Congress) కొనసాగిస్తోందని విమర్శించారు. చెరువుల కబ్జాను అరికట్టే చట్టం గతంలో కూడా ఉందని.. పాత చట్టానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రా (Hydra) అని పేరు పెట్టిందన్నారు. మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని.. అది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఒక్క భాజపాకు మాత్రమే ఉందని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు