ఆ నాలుగు పార్టీలు నా గెలుపును అడ్డుకోలేవు
‘పాతబస్తీలో నివసిస్తున్న ముస్లింలకు తామే రక్షకులమంటూ మజ్లిస్ పార్టీ చెప్పుకుంటోంది. వాస్తవానికి ఇక్కడ వెనుకబాటుతనానికి వారే కారణం. ముస్లింల పేర్లు చెప్పుకొని పాతబస్తీలో భూ కబ్జాలు చేస్తున్నారు. చివరికి శ్మశానాలూ వదల్లేదు.
హైదరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి కొంపెల్ల మాధవీ లత
ఈనాడు, హైదరాబాద్, అబిడ్స్, న్యూస్టుడే
‘పాతబస్తీలో నివసిస్తున్న ముస్లింలకు తామే రక్షకులమంటూ మజ్లిస్ పార్టీ చెప్పుకుంటోంది. వాస్తవానికి ఇక్కడ వెనుకబాటుతనానికి వారే కారణం. ముస్లింల పేర్లు చెప్పుకొని పాతబస్తీలో భూ కబ్జాలు చేస్తున్నారు. చివరికి శ్మశానాలూ వదల్లేదు. ఐదు దశాబ్దాల నుంచి పాతబస్తీలో వేళ్లూనుకున్న ఎంఐఎం పార్టీని ఇంటికి పంపించేస్తా’ అని హైదరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి కొంపెల్ల మాధవీలత అన్నారు. హైదరాబాద్ లోక్సభ పరిధిలో సమస్యలు, ముస్లిం మైనారిటీల స్థితిగతులు, విద్య, వైద్యం వంటి పలు అంశాలపై ఆమె ‘ఈనాడు’తో మాట్లాడారు.
ముఖ్యాంశాలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తే.. ఇక్కడ ఒక్కరు కూడా తీసుకోకుండా మజ్లిస్ నాయకులు అడ్డుపడ్డారు.
- ప్రజలకు సేవ చేయడానికి పాతబస్తీకి ఎవరు వెళ్లినా ఆ పార్టీ నాయకులు బురద చల్లుతారు. ముస్లింలంతా ఏకం కావాలంటూ మతతత్వ భావనను వారి మనసుల్లో చొప్పిస్తారు.
- ఒవైసీ సోదరులు కాకుండా ఎవరైనా విద్యాసంస్థలు, ఆసుపత్రుల ఏర్పాటుకు యత్నిస్తే వాటిని మూసేయిస్తున్నారు.
- మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చేపడతానని చెప్పింది.. చూద్దాం. కేంద్రం నుంచి సాయం కావాలంటే సహకరిస్తాం.
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో సమస్యలున్నాయి. దీనిపై మీ వైఖరి ఏంటి?
ఈ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో చాలా సమస్యలున్నాయి. హిందూ, ముస్లిం తేడా లేకుండా పేదరికంతో జీవిస్తున్నారు. పేదలు ఇంకా పేదరికంలోకి వెళ్లిపోతున్నారు. విద్య, వైద్యం చాలామందికి అందని ద్రాక్షలా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో చార్మినార్ జోన్కు ఏటా అత్యధికంగా బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయ్? లెక్క చెప్పండి. ఇక్కడ ఉన్న సమస్యలన్నింటికీ కారణం మజ్లిస్ పార్టీ వైఖరే. వారు మాత్రమే ఎదగాలన్న అధికార కాంక్షతో పాతబస్తీ ఇంకా వెనక్కి వెళ్తోంది. ప్రజలు నిత్యం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు?
మజ్లిస్, కాంగ్రెస్, ఎంబీటీ, భారాసలు కలిసి ఒక్కటిగా నన్ను ఓడించేందుకు సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా భాజపాను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ మాకు దీటైన అభ్యర్థిని ఎందుకు బరిలో దింపలేదు? నేను పోటీ చేస్తున్నానని తెలిసి ఇన్నాళ్లు ఎడమొహం పెడమొహంగా ఉన్న ఎంబీటీ, ఎంఐఎం పార్టీలు ఈ ఎన్నికల సందర్భంగా ఒక్కటయ్యాయి. అందుకే నాలుగు పార్టీలు కలిసిన మజ్లిస్ అభ్యర్థే నాకు ప్రధాన ప్రత్యర్థి.
పాతబస్తీలో ఇరుకు రహదారులు, పారిశుద్ధ్య సమస్యలున్నాయి. వీటి పరిష్కారానికి కేంద్రం నుంచి నిధులేమైనా తెప్పిస్తారా?
మజ్లిస్ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజలను గాలికి వదిలేయడం వల్లే పాతబస్తీలో ఇరుకు రహదారులు, నాలాల్లో మురుగునీటి సమస్య ఉంది. ప్రభుత్వ స్థలాలను, చెరువులను మజ్లిస్ పార్టీ నాయకులు ఆక్రమించుకుంటే రహదారులు, నాలాల విస్తరణ ఎలా జరుగుతుంది.
మీరు గెలిస్తే ప్రాధామ్యాలు ఏంటి?
రెండు అంశాలకు ప్రాధాన్యం ఇస్తాను. పాతబస్తీలో యువకులకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాం. ఇక్కడ కులమతాలకు అతీతంగా చెప్పులు కుట్టేవారున్నారు. వారందరి కోసం చెప్పుల తయారీ పరిశ్రమలు స్థాపిస్తాం. అత్యంత అద్భుతంగా బంగారు నగలు రూపొందించే కార్మికులున్నారు. అందుకే అక్కడ బంగారు ఆభరణాల తయారీ హబ్ను ఏర్పాటు చేస్తాం.
ఈ ఎన్నికల్లో ఏయే అంశాలు గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయి?
హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో జాతీయ అంశాలు, మజ్లిస్ పార్టీ మతతత్వ ధోరణి ప్రభావం చూపించనుంది.భాజపా అంటే హిందుత్వ అజెండా అంటూ దుష్ప్రచారం చేస్తారు. అందుకే ఎంఐఎం ప్రజలకు చేసిన అన్యాయాలు, అక్రమాలను వెలికి తీస్తున్నాం. ఇవన్నీ గెలుపోటములపై ప్రభావం చూపిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలుకెళ్లినా మార్పు రాలె.. జల్సాలకు అలవాటు పడి చోరీలు
[ 02-06-2024]
నలుగురు స్నేహితులు.. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలే లక్ష్యంగా చేసుకున్నారు.. పలు చోరీల కేసుల్లో పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపినా వారిలో మార్పు రాలేదు. -
డ్రైవింగ్ లైసెన్సులు పాత విధానంలోనే
[ 02-06-2024]
డ్రైవింగ్ లైసెన్సులను యథావిధిగా రవాణాశాఖ కార్యాలయాల్లోనే జారీ చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్సింగ్ విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. -
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ.. మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య
[ 02-06-2024]
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో శనివారం జరిగింది. -
దశాబ్ది స్ఫూర్తిగా.. శతాబ్దికి బాసటగా
[ 02-06-2024]
అరవై ఏళ్ల ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైంది. ఉద్యమాలకు ఊపిరిలూదిన హైదరాబాద్ గడ్డ ఆ రోజు ఎంతో పులకించింది. -
ఉద్యమానికి ఊపిరిలూదారు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర సాధన క్రతువులో మొయినాబాద్ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు ఉద్యమానికి ఊపిరిలూది.. -
ప్రగతి కాంక్ష.. సాగాలి నిరంతర దీక్ష
[ 02-06-2024]
తెలంగాణ డయగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 1,05,103 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వికారాబాద్ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. -
ఫలితాల వెల్లడికి సర్వం సన్నద్ధం
[ 02-06-2024]
రాజధాని పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు ఈనెల 4న ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నారు. -
బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ కబ్జా
[ 02-06-2024]
నగరానికి చెందిన వరద నీటిని మోసుకెళ్లే ప్రధాన కాలువల్లో బుల్కాపూర్ నాలా కీలకమైంది. శతాబ్దాల క్రితమే నగర ప్రజలను వరద ముంపు నుంచి కాపాడేందుకు ప్రణాళికాబద్ధంగా నాటి నిజాం పాలకులు తవ్వించగా.. -
డబ్బులిచ్చుకో.. నిరభ్యంతరంగా పత్రాలు పుచ్చుకో
[ 02-06-2024]
రాజధాని నగరం శివారు ప్రాంతాల్లోని చెరువులు..వాగుల్లో రియల్ వెంచర్లు వేసుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సహకరించారు. -
దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలవాలి
[ 02-06-2024]
సవాళ్లను అధిగమించేందుకు కృషి, పట్టుదల, ఐక్యత, చిత్తశుద్ధి దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలుస్తాయని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ఎయిర్ పోర్టు సెక్టార్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ తెలిపారు. -
రౌడీషీటర్ హత్యకు పథక రచన
[ 02-06-2024]
ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన గొడవతో ఒకరిపై మరొకరు పగ పెంచుకున్నారు. వారిలో ఒకరి హత్యకు పథకం వేసి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. -
ఉచిత న్యాయం.. మరింత చేరువ
[ 02-06-2024]
కాలంతోపాటు నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. వీటివల్ల బాధితులకు సత్వర న్యాయం జరగాలి. ఈ నేపథ్యంలో జిల్లాలో న్యాయసేవలు విస్తృతమవుతున్నాయి. -
యాప్లతో డ్రగ్స్ సరఫరా
[ 02-06-2024]
రెండు వేర్వేరు కేసుల్లో నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వి.లక్ష్మిపతి(28), ఒకారో కాస్మోస్ రమ్సీ(38)లను టీఎస్ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
పనిచేసే సంస్థకు ఉద్యోగుల కన్నం
[ 02-06-2024]
డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన క్యూఆర్ కోడ్ మార్చేసి ప్రైవేటు సంస్థలో రూ.4.15 కోట్లు కొట్టేసిన మోసంలో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. -
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో ముగ్గురి అరెస్టు
[ 02-06-2024]
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ మరో ముగ్గుర్ని అరెస్టు చేసింది. ఇందులో ఇద్దరు శ్రీలంక దేశస్థులు ఉండడం గమనార్హం.