చెంప చెళ్లుమనిపించిన డీకే
హుబ్బళ్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటి తరఫున సవణూరులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం రాత్రి ప్రచారాన్ని చేపట్టారు.
హావేరి, న్యూస్టుడే : హుబ్బళ్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటి తరఫున సవణూరులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం రాత్రి ప్రచారాన్ని చేపట్టారు. ఆయన కారులో నుంచి కిందకు దిగుతున్న డీకేపై స్థానిక పురసభ సభ్యుడు అల్లావుద్దీన్ మనియార్ చేయి వేశారు. కోపగించుకున్న ఉప ముఖ్యమంత్రి ఆయన చెంప చెళ్లుమనిపించి పక్కకు తోశారు. ఈ వీడియోను భాజపా నాయకుడు అమిత్ మాళవీయ తన సామాజిక మాధ్యమం ఖాతాలో వైరల్ చేయడంతో చర్చగా మారింది.
కలబురగి మాదే..
కలబురగి, న్యూస్టుడే : కలబురగి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రాధాకృష్ణ భారీ మెజార్టీతో గెలుస్తారని ఎమ్మెల్యే డాక్టర్ అజయ్సింగ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీ పథకాలే ఓట్లు తీసుకువస్తాయన్న నమ్మకం ఉందన్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలబురగి విభాగంలో పలు అభివృద్ధి పనులు జోరందుకున్నాయని తెలిపారు.
ఒక అంకె.. దాటదు
బీదర్, న్యూస్టుడే : గత ఎన్నికల్లో పాతిక సీట్లు గెల్చుకున్న భాజపా ఇప్పుడు ఒక అంకె దాటదని రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి జోస్యం చెప్పారు. తాము 28 స్థానాలు గెలుస్తామని భాజపా ప్రకటించుకోవడం మేకపోతు గాంభీర్యమేనని అన్నారు. ఆయన బీదర్లో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికలు వచ్చినప్పుడే మోదీ, షాలకు కర్ణాటక గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. కర్ణాటకకు అన్యాయం జరిగిన ప్రతిసారీ ఇక్కడి నుంచి గెల్చిన ఎంపీలు పార్లమెంటులో గళం విప్పడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. దేశంలో ప్రధానులు అందరూ కలిసి రూ.54 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోదీ ఒక్కరే పదేళ్లలో రూ.130 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు.
నాదే విజయం: ఈశ్వరప్ప
శివమొగ్గ, న్యూస్టుడే : శివమొగ్గలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ప్రచారం చేసి వెళ్లినప్పటికీ నా విజయావకాశాలు క్షీణించవని భాజపా తిరుగుబాటు అభ్యర్థి కేఎస్ ఈశ్వరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కాంగ్రెస్, భాజపా మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ తన కుమారునికి టికెట్ రాకుండా మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుటుంబమే అడ్డుకుందన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన ప్రచారంలో ఓటర్ల నుంచి చక్కని స్పందన లభించిందన్నారు.
అచ్ఛేదిన్ అంటే..
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : అచ్ఛేదిన్ అంటే దుబారీ, మోదీ అంటే మఖ్మల్ టోపీ అని కర్ణాటక కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. గత పదేళ్లలో పెరిగిన ధరల గ్రాఫుతో తన ఎక్స్కార్ప్ ఖాతాలో ఆయా వస్తువుల ధరలను పేర్కొంటూ భాజపా తీరును తూర్పారబట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంచనాల్లో.. కూటమిదే కోట!
[ 02-06-2024]
కర్ణాటకలో లోక్సభ ఎన్నికల ఎగ్జిట్పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. వివిధ సంస్థల శ్యాంపుల్ సమీక్షల ఫలితాలు ఎన్డీఏ కూటమి ఆధిపత్యాన్ని చాటుతుందని తేల్చాయి. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి భాజపా సాధించిన స్థానాల కంటే తక్కువ స్థానాలకు పరిమితమవుతుందని ఈ సమీక్షలు వెల్లడించాయి. -
సీఈటీ ర్యాంకుల్లో అబ్బాయిల జోరు!
[ 02-06-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయం, పశువైద్యం, నర్సింగ్, ఫార్మసీ, యోగా, నేచురోపతి విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కర్ణాటక ఉమ్మడి ప్రవేశ (కే-సీఈటీ)పరీక్షల్లో అబ్బాయిలు ర్యాంకుల్లో సత్తా చాటారు. -
విచారణకు హాజరైన సిద్ధు, డీకే
[ 02-06-2024]
విధానసభ ఎన్నికల సమయంలో ‘భాజపా నేతలు 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు’ అంటూ ప్రకటనలు విడుదల చేసిన కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై నమోదైన కేసు విచారణ శనివారం ప్రారంభమైంది. -
పాలకుల మాటలు.. నీటి మూటలు
[ 02-06-2024]
రాజధాని నగరం ఈసారి వాననీటి ముంపునకు గురిచేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఎన్నికలకు ముందే అధికారులు, ఏలికలు భీకర ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికలయ్యాక.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు ముంపు ముప్పు ఎదురయ్యే ప్రాంతాలను చుట్టేసి ఈసారి సమస్య ఎదురుకాకుండా చూడడానికి అనేక ఆదేశాలిచ్చారు. -
జగమొండి.. ప్రజ్వల్
[ 02-06-2024]
వందలాది మందిపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదని ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అధికారులు తెలిపారు. -
నకిలీ ఖాతాలకు నగదు బదిలీ
[ 02-06-2024]
రాష్ట్ర వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో అక్రమాలకు పాల్పడి, నకిలీ ఖాతాలకు బదిలీ చేసిన నగదులో కొంత భాగం హస్తినలోని కాంగ్రెస్ నేతలకు చేరిందని విపక్ష నాయకుడు ఆర్.అశోక్ ఆరోపించారు. -
భవ్య సేవలే ఓ సైన్యం!
[ 02-06-2024]
కాంగ్రెస్ పార్టీ మహిళా అధికార ప్రతినిధిగా వ్యవహరించిన భవ్య నరసింహమూర్తి భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్గా బాధ్యతలు చేపట్టారు. డైరెక్టరేట్ జనరల్ టెరిటోరియల్ ఆర్మీ 2022లో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మొదటి మహిళగా ఆమె నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ.. మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
-
జయలలిత సిద్ధాంతాలపై జగడం.. తమిళనాట రాజకీయాల్లో తీవ్ర చర్చ
-
అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
-
చంద్రబాబు రాకపోయినా వచ్చినట్లు తప్పుడు కథనం.. తెదేపా ఫిర్యాదు
-
రూపాయి గొడవ.. ప్రాణం తీసింది