సామాజిక వాణి పాలమూరు బాణి
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు ఎంతో హైరానా పడేవారు.. అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ జనాలకూ తెలిసేది కాదు. కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది.
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు ఎంతో హైరానా పడేవారు.. అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ జనాలకూ తెలిసేది కాదు. కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. అరచేతిలో చరవాణి ఉన్న ప్రతి ఒక్కరూ అన్నీ తెలుసుకునే అవకాశం కలిగింది. ఈ నేపథ్యంలో మన పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో ఏ మేరకు చురుగ్గా ఉన్నారు? వారిని ఎంతమంది అనుసరిస్తున్నారో తెలుసుకుందాం.
న్యూస్టుడే, నారాయణపేట పట్టణం
‘‘ప్రస్తుత రాజకీయాల్లో సామాజిక మాధ్యమాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి..నాయకులు, వారి అనుచరులు ట్విట్టర్(ఎక్స్) ఖాతాను తెరవడంతోపాటు అభిమాన నేతలను అనుసరిస్తుంటారు. చాలామంది నాయకులు, ప్రజాప్రతినిధులకు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ఉన్నప్పటికీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్కు వ్యక్తిగతంగా ఎక్స్లో ఖాతా లేకపోవడంతో గత నెల చివరి వారంలో తెరిచారు..నిమిషాల్లోనే వేలాది మంది ఆయనను అనురించారు..’’
ఒకవైపు ఎండలు మండుతున్నాయి. మరోవైపు లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఈ రెండు,మూడు రోజులుగా జోరందుకుంది. మధ్యాహ్నం కాసేపు విరామం తీసుకుని సాయంత్రం నుంచి మళ్లీ ప్రచారం చేస్తున్నారు..రహదారులు, గల్లీల్లో మైకుల మోత ఒక వైపు మోగుతుంటే, మరోవైపు సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఎక్స్(ట్విట్టర్), ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర వాటిలో ప్రచారం మోత మోగిస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో అండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి. అంతా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తుంటారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తొందరగా ఓటరును చేరుకోడానికి ఇవి ఆలంబనగా నిలిచాయి. ప్రచారంలో సమయం ఆదాతోపాటు ఖర్చు సైతం తగ్గుతుంది. మ్యానిఫెస్టో వివరించడం, ప్రత్యర్థులకు దీటుగా సమాధానం చెప్పడానికి సామాజిక వేదికలను వినియోగించుకుంటున్నారు. కొందరు అభ్యర్థుల యూట్యూబ్ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. అయితే వివాదాస్పద వీడియోలు చిత్రాలు వేరేవారికి పంపితే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. గ్రూప్ అడ్మిన్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
పల్లెల్లో వాట్సాప్ గ్రూపులు: ప్రతి గ్రామంలో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో సమాచారం చేరవేయడానికి కొత్త గ్రూపులు పుట్టుకొస్తున్నాయి. సమావేశం, ప్రచారం ఉందంటే గ్రూపులో పోస్టు చేస్తున్నారు..నిమిషాల వ్యవధిలో అందరూ ఒకే దగ్గరకు చేరుకుంటున్నారు. పార్టీలకు గ్రూపులతోపాటు ్రగ్రామం, మండలం, పట్టణం, జిల్లాల గ్రూపులు ఏర్పాటయ్యాయి. జన సమీకరణతోపాటు అదే సమయానికి కార్నర్ మీటింగ్, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం విజయవంతంగా నిర్వహించడానికి గ్రూపులు దోహదపడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రగతి విరిసేలా.. పాలమూరు మెరిసేలా!
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తయ్యింది. ఈ పదేళ్ల ప్రస్థానంలో ఉమ్మడి మహబూబ్నగర్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పలు రంగాల్లో ప్రగతి దశగా అడుగులు పడ్డాయి. -
సమగ్ర వికాసమే సంకల్పం
[ 02-06-2024]
రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల వేళ తమ నియోజక వర్గ సర్వతో ముఖాభివృద్ధే ధ్యేయమని పాలమూరు శాసనసభ్యులు అంటు న్నారు. ప్రధానంగా సాగునీటి వనరులపై దృష్టి సారిస్తామంటున్నారు. -
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు భారీ భద్రత
[ 02-06-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు పోలీసు శాఖ భారీ బందోబస్తు చేపడుతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు అవాంఛనీయ ఘటనలు -
ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పాలమూరు పట్టణం ముస్తాబైంది. తెలంగాణ, అంబేడ్కర్, క్లాక్టవర్, వన్టౌన్, కూడళ్లను రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. -
డబ్బాలతోనే రండి.. మాంసం తీసుకెళ్లండి
[ 02-06-2024]
చికెన్, మటన్ కొనడానికి వెళ్లేందుకు ఇక నుంచి వట్టి చేతులతో వెళ్లవద్దని, స్టీల్ డబ్బాలు వెంట తీసుకెళ్లాలని మహబూబ్నగర్ పురపాలక సంఘం పట్టణవాసులను కోరుతోంది. -
విద్యుత్తు శాఖలో ప్రతి పనికి ఓ రేటు!
[ 02-06-2024]
విద్యుత్తు కనెక్షన్ లేని ఇల్లు బహుశ ఉండదేమో. అదే, ఆ శాఖ అధికారులు కొందరికి కలిసి వస్తోంది. నిబంధనల పేరుతో జాప్యం చేయడం.. చేయి తడిపితే పనులు చకచకా చేయడం వారికి సాధారణమైంది. -
చినుకు.. పడితే వణుకే!
[ 02-06-2024]
పట్టణాల్లో రహదారి పక్కనున్న కాలువ చిన్నదే అయినప్పటికీ అది సక్రమంగా లేకపోతే ఎదురయ్యే సమస్య తీవ్రంగా ఉంటుంది. ఏళ్ల తరబడి నుంచి పట్టణాల్లో నివసిస్తున్న వారికి వర్షం పడితే దడే. -
లోతట్టు కాలనీలపై దృష్టేది?
[ 02-06-2024]
వర్షాల నేపథ్యంలో పురపాలకల్లోని లోతట్టు కాలనీల్లో ఆందోళన నెలకొంది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పురపాలక పారిశుద్ధ్య సిబ్బంది వార్డుల్లోని మురుగు కాల్వలు శుభ్రం చేస్తున్నారు -
వానాకాలం.. వ్యాధుల ముప్పు
[ 02-06-2024]
రుతువులతోపాటు వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల వచ్చే వ్యాధులే సీజనల్ రుగ్మతలు. అందులోనూ వానాకాలంలో దోమల వృద్ధి అపారంగా ఉంటుంది.