logo

Kavitha: కుట్ర చేసి బయటకు పంపారు.. నా దారి నేను వెతుక్కుంటున్నా: కవిత

Eenadu icon
By Telangana Dist. Team Updated : 25 Oct 2025 19:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నిజామాబాద్‌: గత 20 ఏళ్లుగా కేసీఆర్‌, భారత రాష్ట్రసమితి పార్టీ కోసం పని చేశానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం ‘ జాగృతి జనం బాట’ ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నిజామాబాద్‌లో తాను ఓటమి పాలవ్వడం వెనుక కుట్ర ఉందో లేదో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు ఆలోచించాలన్నారు. ‘‘ఇంటి గుట్టు బయటపెట్టి.. కుట్ర చేసి నన్ను బయటకి పంపించారు. ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నా. ఈ జిల్లా బిడ్డగా, కోడలిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చా. 27 ఏళ్ల వయస్సులో ఉద్యమంలోకి వచ్చా. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సహనంతో ఎదురు చూశా. 

నేను భారత రాష్ట్రసమితి పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. కానీ, కుట్ర చేసి నన్ను బయటకు పంపించారు. ఏం కుట్ర జరిగిందో పిల్లల్ని అడిగినా చెబుతారు. ఎన్ని అవమానాలు జరిగినా భరించాను. ఈ సమయంలో ఆశీర్వాదం కావాలని మీ ముందుకొచ్చా. తొలి అడుగు మన గడ్డ మీద నుంచే వేయాలని వచ్చాను. గత 10 ఏళ్లలో మనం కొంత సాధించుకున్నాం. కానీ, అమర వీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం, న్యాయం దక్కలేదు. వాటికోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. జనం బాటలో మేధావులు, విద్యార్థులు సహా అన్ని వర్గాలతో మాట్లాడతాను. అందర్నీ భాగస్వాములను చేస్తాను. ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలని నేను కోరుతున్నా’’ అని కవిత అన్నారు.


Tags :
Published : 25 Oct 2025 18:47 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని