బడిబాట పట్టాల్సిందే!
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు బడి మానేయకుండా చూడటానికి విద్యాశాఖ కొత్త ప్రయత్నం ప్రారంభిస్తోంది. 70వేల మంది వరకు బడి మానేశారని, ఇంకా 3 లక్షల మేరకు అదే జాబితాలో చేరే అవకాశాలున్నట్లు విద్యాశాఖ చేపట్టిన సర్వేలో తేలింది.
డ్రాప్ ఔట్లు పూర్తిగా తగ్గించేందుకు విద్యాశాఖ చర్యలు
వడపళని, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు బడి మానేయకుండా చూడటానికి విద్యాశాఖ కొత్త ప్రయత్నం ప్రారంభిస్తోంది. 70వేల మంది వరకు బడి మానేశారని, ఇంకా 3 లక్షల మేరకు అదే జాబితాలో చేరే అవకాశాలున్నట్లు విద్యాశాఖ చేపట్టిన సర్వేలో తేలింది. దారిద్య్రరేఖకు దిగువన ఉండటం, వలస, పరీక్షలంటే భయం, చిన్న వయసులో ఉద్యోగం, బాల్య వివాహాలు వంటివి అందుకు కారణాలుగా కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అందరూ తప్పనిసరిగా బడికెళ్లేలా చూసేందుకు రెండు వారాలపాటు అలాంటి విద్యార్థులను గుర్తించాలనుకుంటున్నారు. ఈ సమాచారాన్ని ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఈఎంఐఎస్)లో ఎప్పటికప్పుడు ఉంచుతామని కడలూరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని సి.హేమలత అన్నారు.
విద్యార్థులతో సమావేశం..
ఈ ఏడాది పూర్వ విద్యార్థులు, పాఠశాల నిర్వాహక కమిటీ తరచూ విద్యార్థులతో సమావేశం కానుంది. నైపుణ్యం పెంచుకుంటూ భయపడకుండా ఎలా చదవాలో విద్యార్థులకు నేర్పుతారని విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకం ‘ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం’ లాంఛనంగా ప్రారంభించాలనుకుంటున్నకట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వార్షిక పరీక్షలు ముగిసి పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చారు. టీచర్లు ఇంటింటికీ వెళ్లడమో లేదా వారిని పిలిపించి ఎందుకు మానేస్తున్నారో అడిగి తెలుసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బడి మానేసినవారు ఎక్కువగా ఉన్నారని, కృష్ణగిరిలాంటి జిల్లాల్లో ఈ సమస్య మరీ అధికమని, అక్కడ ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. డ్రాప్ ఔట్లు బాగా తగ్గించేందుకు శిబిరాలు కూడా నిర్వహించనున్నట్టు అధికారి ఒకరన్నారు.
అనుత్తీర్ణులు 62 వేల మంది..
2023లో పది, ప్లస్టూ బోర్డు పరీక్షల్లో 62వేల మంది ఫెయిలయ్యారు. టీచర్లు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మళ్లీ పరీక్ష రాయించేందుకు ధైర్యాన్ని కల్పించారు. ఈ ఏడాది కూడా అదే మాదిరిగా చేయాలనుకుంటున్నారు. నైపుణ్యాభివృద్ధి మెరుగు పరచుకునేందుకు ‘ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్్స(ఐటీఐ), పాలిటెక్నిక్ కళాశాలల్లో వారి పేర్లు నమోదు చేసేందుకు ప్రోత్సహించనున్నామని విద్యాశాఖ కార్యదర్శి జె.కుమారగురుబారన్ అన్నారు. పాఠశాలల్లో ఉన్న మాదిరిగా ఉన్నత విద్యాసంస్థల్లోనూ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఐడీ(యూఎంఐఎస్ ఐడీ)ని విద్యాశాఖ ఏర్పాటు చేయాలనుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జయలలిత సిద్ధాంతాలపై జగడం
[ 02-06-2024]
జయలలిత హిందుత్వవాది అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. అన్నామలై ఇటీవల విలేకర్లతో మాట్లాడుతూ.. -
కాషాయ వస్త్రాలతో సూర్యారాధన
[ 02-06-2024]
కన్నియాకుమరిలోని వివేకానంద స్మారక మండపంలో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. శనివారం ఉదయం 5.50కు కాషాయ వస్త్రాలతో బయటకొచ్చిన ప్రధాని సూర్యారాధన చేశారు. -
త్వరలో పిత్తల మాత్తి విడుదల
[ 02-06-2024]
మాణిక్క విద్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిత్తల మాత్తి’. ఇందులో ఉమాపతి రామయ్య, సంస్కృతి, బాల శరవణన్, తంబి రామయ్య, దేవదర్శిని, విద్యుల్లేఖ రామన్, ‘ఆడుకళం’ నరేన్, ‘కాదల్’ సుకుమార్ తదితరులు నటించారు. -
‘కలైజ్ఞర్ 100’ ప్రదర్శన ప్రారంభం
[ 02-06-2024]
దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి ముగింపు వేడుకలు సందర్భంగా ప్యారిస్ కార్నర్లోని రాజా అన్నామలై హాలులో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను నటుడు ప్రకాశ్రాజ్ శనివారం ప్రారంభించారు. -
షరతులతో పర్యాటకులకు అనుమతి
[ 02-06-2024]
ప్రధాని మోదీ ధ్యానం సందర్భంగా గురువారం కన్నియాకుమరి వివేకానంద స్మారక మండపానికి పర్యాటకులను అనుమతించలేదు. శుక్రవారం అనుమతించారు. లగేజీ, సెల్ఫోన్లు తదితరాలను తీసుకెళ్లనివ్వలేదు. -
భాజపా రికార్డు సృష్టిస్తుంది
[ 02-06-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా రికార్డు సృష్టించి ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని అవుతారని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ ధీమా వ్యక్తం చేశారు. -
చెన్నైలో తల్లిపాల విక్రయంపై నిఘా
[ 02-06-2024]
చెన్నైలో తల్లిపాల విక్రయాలపై నిఘా పెట్టేందుకు 18 బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆహారభద్రతాశాఖ అధికారులు తెలిపారు. చెన్నై మాధవరం ప్రాంతంలో చట్టవిరుద్ధంగా తల్లిపాలు సీసాల్లో పెట్టి విక్రయిస్తున్న ప్రైవేట్ మందుల దుకాణానికి