కేయూ వీసీ పదవి ఎవరిని వరించునో..!
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉప కులపతి, సామాజిక శాస్త్రం సీనియర్ ఆచార్యులు తాటికొండ రమేశ్ మూడేళ్ల పదవీకాలం ఈ నెల 21తో ముగియనుంది.
పోటీలో 55 మంది.. పెరిగిన రాజకీయ జోక్యం
న్యూస్టుడే, కేయూ క్యాంపస్: కాకతీయ విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉప కులపతి, సామాజిక శాస్త్రం సీనియర్ ఆచార్యులు తాటికొండ రమేశ్ మూడేళ్ల పదవీకాలం ఈ నెల 21తో ముగియనుంది. 2021 మే 21న కేయూ 14వ ఉప కులపతిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని మరో పది విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులు సైతం అప్పుడే నియమితులయ్యారు. వీరి పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియామకాల కోసం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గత జనవరిలో ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 20 వరకు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.
భారీగా దరఖాస్తులు..
కేయూ వీసీ కోసం అర్హులైన ఆచార్యులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఇతర విశ్వవిద్యాలయాలతో పాటు కేయూ విశ్రాంత, ప్రస్తుత ఆచార్యులు 55 మంది ఉన్నారు. గతంలో 10 నుంచి 15 మంది మాత్రమే పొటీపడేవారు. వీసీ రేసులో అత్యధికంగా విశ్రాంత ఆచార్యులు ఉన్నారు. ఆచార్యుడిగా పదేళ్ల అనుభవం కలిగివారు అర్హులని.. ఎలాంటి వయో పరిమితి లేదని నిబంధనల్లో పేర్కొనడంతో పోటీ భారీగా పెరిగింది. ప్రసుత్తం సర్వీసులో ఉండి పదేళ్ల అనుభవం ఉన్నవారు కేయూలో నలుగురు మాత్రమే ఉన్నారు. వీరందరూ దరఖాస్తు చేసుకున్నారు. కేయూలోని పలు విభాగాల నుంచి ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంత ఆచార్యులు 35 మంది ఉన్నారు. ఇతర విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల నుంచి మరో ఆరుగురు పోటీపడుతున్నారు.
ముగ్గురు మాజీ ఉప కులపతులు కూడా..
ప్రస్తుత కేయూ ఉప కులపతి ఆచార్య టి.రమేశ్తో పాటు రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులుగా పనిచేసిన మరో ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి, ఆచార్య బి.వెంకటరత్నం, కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పనిచేసిన ఆచార్య ఎండీ.ఇక్బాల్అలీ, నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పనిచేసిన ఆచార్య ఖాజాఅల్తాఫ్ హుస్సేన్లు పోటీలో ఉన్నారు.
వివరాల సేకరణ..
లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఈసీ అనుమతితో ఉప కులపతులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు దరఖాస్తు చేసుకున్న పేర్లను నిఘా వర్గాలకు పంపించినట్లు తెలిసింది. త్వరలోనే సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారని తెలిసింది.
పైరవీలు షురూ..
ఉప కులపతి పదవి అకడమిక్కు సంబంధించినప్పటికీ నియామకంలో రాజకీయ ప్రమేయం కీలకంగా మారింది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారికే పదవి లభించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఆశావహులు అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమరుల స్ఫూర్తిగా.. అభివృద్ధి దిశగా..
[ 03-06-2024]
జిల్లాలోని అన్ని సామాజిక వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సమప్రాధాన్యమిస్తూ.. జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నట్లు జిల్లా పాలనాధికారి ప్రావీణ్య స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించారు. -
సర్వం సిద్ధం!
[ 03-06-2024]
వరంగల్ లోక్సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 రోజుల ఉత్కంఠకు మరో రోజుతో తెర పడనుంది. వరంగల్లోని ఎనుమాముల మార్కెట్లో ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. -
గాలివాన బీభత్సం.. ఓరుగల్లు అతలాకుతలం
[ 03-06-2024]
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం వరంగల్ నగరంలో దంచి కొట్టింది. ప్రధాన రహదారులు, లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. చెట్లు విరిగి పడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. -
కాలువ పూర్తి కాదు.. ముంపు భయం వీడదు
[ 03-06-2024]
వర్షాకాలం దగ్గర పడినా గ్రేటర్ వరంగల్ ఇంజినీర్లు, గుత్తేదారులు ముఖ్యమైన అభివృద్ధి పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ పోతన నగర్ రోడ్డులో వరదనీటి కాలువ నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. -
వడదెబ్బతో ముగ్గురి మృతి
[ 03-06-2024]
వడదెబ్బతో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతిచెందారు. పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో ఎర్రబోయిన సాయిలు(48) గొర్ల కాపపరిగా పనిచేస్తున్నారు. -
గాలివాన బీభత్సం
[ 03-06-2024]
జిల్లాలో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. పలు చోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్తు తీగలు తెగిపడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. -
చెట్టును ఢీకొన్న వాహనం.. ఒకరి మృతి
[ 03-06-2024]
ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి-తాడ్వాయికి మధ్యలోని 163 జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మేడారం నుంచి వస్తున్న వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. -
భర్తను కొట్టి చంపిన భార్య, అత్త
[ 03-06-2024]
నిత్యం తాగొచ్చి వేధిస్తున్న భర్త తనను, పిల్లలను చంపుతానని భయభ్రాంతులకు గురిచేయడంతో అతడినే భార్య, అత్త కలిసి కొట్టిన చంపిన ఘటన ధర్మసాగర్ మండలంలో చోటుచేసుకొంది. -
రద్దీ ఎక్కువ.. బస్సులు తక్కువ
[ 03-06-2024]
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. వేసవి సెలవుల్లో ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటోంది. మరికొద్ది రోజుల్లో విద్యా సంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బస్సుల కోసం ప్రయాణికులతో పాటు విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. -
ఖనిజ ఉత్పత్తుల రంగంలోకి సింగరేణి
[ 03-06-2024]
బొగ్గు, థర్మల్, సౌర విద్యుదుత్పత్తితో పాటు ఇనుము, రాగి తదితర ఖనిజ ఉత్పత్తులను సింగరేణి వెలికితీయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం వెల్లడించారు. బలమైన ఆర్థిక పునాదులే కొత్త ప్రాజెక్టుల లక్ష్యమని చెప్పారు. -
ఆగని నకిలీ వైద్యం దందా..!
[ 03-06-2024]
జిల్లాలో నకిలీ వైద్యులు ఇటీవల పెరిగిపోతున్నారు. ఆర్ఎంపీలే క్లినిక్లు నిర్వహించడం, ఎలాంటి అర్హతలు లేకుండా ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహిస్తుండటం, మరికొందరు ఎలాంటి ఫాథలాజిస్ట్ వైద్యులు లేకుండానే డయాగ్నస్టిక్ కేంద్రాలను నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. -
సైకిల్ తొక్కితే ఎంత బాగుంటుందో..!
[ 03-06-2024]
ఆరోగ్యానికి వ్యాయామం అత్యంత ప్రధానం. వాటిలో సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెరిగాక సైకిల్ తొక్కడం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. జూన్ 3న ‘ప్రపంచ సైకిల్ దినోత్సవం’ సందర్భంగా దీని వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం. -
వినూత్నంగా పుట్టగొడుగుల పెంపకం
[ 03-06-2024]
ఈ రోజుల్లో వినూత్న వ్యాపకాలపై యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రానికి చెందిన కొమ్మనబోయిన యామిని యాదవ్ పీజీ బయో కెమిస్ట్రీ పూర్తి చేశారు. ఆమెకు ఉన్న పరిజ్ఞానంతో పుట్టగొడుగులను పెంచుతూ లాభాలు ఆర్జిస్తున్నారు. -
ఎంజీఎంలో క్యాన్సర్కు అధునాతన వైద్యం
[ 03-06-2024]
ఉమ్మడి వరంగల్, చుట్టుపక్కల జిల్లాల్లోని ప్రజలు ఎంజీఎంకు వచ్చి సేవలు పొందుతున్నారు. రోజూ 25 నుంచి 30 మంది వరకు ఓపీ, 12 నుంచి 16 మందికి ఐపీ చికిత్సలు అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆయుష్మాన్ భారత్ ద్వారా విలువైన మందులను ఉచితంగా ఇస్తున్నారు. -
చిన్నారికి పెద్ద కష్టం
[ 03-06-2024]
రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబం. సొంత వ్యవసాయ భూమి సైతం లేకపోవడంతో నిత్యం కూలి పనులకు వెళ్తూ ఉన్నదాంట్లో ఆనందంగా జీవిస్తున్నారు. అలాంటిది వారిని విధి చిన్నచూపు చూసింది.
తాజా వార్తలు (Latest News)
-
అమూల్ పాల ధరల పెంపు.. లీటర్పై ఎంతంటే..
-
స్వతంత్రుల ముసుగులో వైకాపా ఏజెంట్లు.. సజ్జల వ్యాఖ్యల నేపథ్యంలో విస్తృత చర్చ
-
అందరి దృష్టీ పోస్టల్ బ్యాలెట్పైనే.. వైకాపాలో ఇదే గుబులు
-
అందుకే హరీశ్రావును అమెరికాకు పంపించారు: మంత్రి కోమటిరెడ్డి
-
‘నన్ను జైలుకు పంపితే..’ ట్రంప్ పరోక్ష హెచ్చరిక!
-
లబ్డబ్.. లబ్డబ్.. ఏపీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ