logo

పోలవరం వద్ద పెరిగిన వరద

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 22 Sep 2025 20:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పోలవరం: గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద సోమవారం ఉదయం 29.64 మీటర్లు ఉన్న నీటిమట్టం.. సాయంత్రానికి 29.88 మీటర్లకు పెరిగింది. 48 గేట్ల ద్వారా 4.60 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వెళ్తోంది. మరోవైపు భద్రాచలం వద్ద ఉదయం 30.30 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం.. సాయంత్రానికి 32.30 అడుగులకు పెరిగినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. గత 40 రోజులుగా గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతుందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సముద్రంలోకి 3,045 టీఎంసీలు విడుద చేసినట్లు వారు పేర్కొన్నారు. మరో రెండు మూడు రోజులు పాటు వరద ఇదేవిధంగా కొనసాగుతుందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు