అంతా గందరగోళం
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని.. అర్హులందరూ నిర్భయంగా, ఇబ్బంది లేకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనువైన పరిస్థితులు కల్పించామని అధికారులు ఊదరగొడుతున్నారు.
తపాలా ఓటింగ్పై కొరవడిన స్పష్టత
ఉద్యోగుల ఆందోళన
ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు సర్దిచెబుతున్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వో ముక్కంటి
ఏలూరు అర్బన్, న్యూస్టుడే: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని.. అర్హులందరూ నిర్భయంగా, ఇబ్బంది లేకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనువైన పరిస్థితులు కల్పించామని అధికారులు ఊదరగొడుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది ఈ నెల 4, 5 తేదీల్లో తపాలా బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉండగా.. అధికారుల తీరుతో గందరగోళం నెలకొని వారు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
నిబంధనలకు తూట్లు: ఏలూరులోని ఫెసిలిటేషన్ కేంద్రం బయట ఎన్నికల ప్రచారం చేస్తున్న వైకాపా వర్గీయులు
- ఉద్యోగులు తపాలా ఓటుకు ఎక్కడ దరఖాస్తు చేశారో అక్కడికే వెళ్లి ఓటు వేయాలని, పనిచేసే చోటే ఓటు వేయాలని చెప్పడంతో సమస్య మొదలైంది. ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రానికి శనివారం పెద్ద సంఖ్యలో సిబ్బంది వచ్చారు. బ్యాలెట్ వినియోగించుకోవాలని చూస్తే వివరాలు ఇక్కడ లేవంటూ అధికారులు చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఎన్నికల సిబ్బందికి ఈ నెల 4, 5 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వీటికి హాజరు కావాలా? లేక ఓటు వేయడానికి తాము పనిచేసే ప్రాంతాలకు వెళ్లాలా? అనే సందిగ్ధంలో పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే భావనతో ఉద్దేశపూర్వకంగా తపాలా బ్యాలెట్ విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు.
వేచి ఉన్న ఉద్యోగులు
- ఏలూరుతో పాటు జిల్లాలోని ఇతర ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అన్నిచోట్లా ఉద్యోగులు ఆందోళనలు చేశారు. తమకు కేటాయించిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే ఓటు వేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమకు ఓటున్న ప్రాంతంలో కాకుండా పనిచేసే చోటుకు వెళ్లి ఓటు వేయాలని చెప్పడం సరికాదని అంటున్నారు. ఏలూరులోని ఫెసిలిటేషన్ కేంద్రానికి కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ వచ్చి మౌలిక వసతుల తీరును పరిశీలించారు. ఉద్యోగులు పని చేసే చోట తపాలా బ్యాలెట్ వేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తపాలా బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులందరికీ తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామన్నారు.
ఏలూరు గ్రామీణ, కలెక్టరేట్, న్యూస్టుడే: ఏలూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5690 మంది ఉద్యోగులు తపాలా బ్యాలెట్ వినియోగించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీకింత.. మాకింత!
[ 02-06-2024]
ఏలూరు నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం అక్రమాల ఊబిలో కూరుకుపోయింది. ఆస్తి పన్నుల విషయంలో అధికారుల చేతివాటంతో నగర పాలిక ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతోంది. వాణిజ్య భవనాలను నివాసాలుగా చూపించడం, కొత్తగా కట్టిన నిర్మాణాలకు పన్నులు విధించకపోవడంతో భారీ నష్టం వాటిల్లుతోంది. -
బంధంచర్ల అడవిలో చిరుతపులి సంచారం!
[ 02-06-2024]
టి.నరసాపురం మండలం బంధంచర్ల అటవీ ప్రాంతంలో వారం రోజులుగా చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఫాస్ట్ పాసింజర్ విజయవాడ వరకే
[ 02-06-2024]
నరసాపురం - గుంటూరు మధ్య నడిచే ఫాస్ట్ పాసింజర్ రైలు జూన్ 30 వరకు విజయవాడ వరకే నడవనుందని రైల్వేశాఖాధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ట్రాక్ మరమ్మతులు చేపట్టినందున ఈ రైలు సేవలను గత నెలలో రద్దుచేశారు. -
ఎండన పడ్డ పండుటాకులు
[ 02-06-2024]
మండుటెండలో పండుటాకులు విలవిల్లాడారు. ఒకటో తేదీ నుంచి ఇంటికే పింఛను అందించే వ్యవస్థలు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేసింది. వేసవి కావడంతో లబ్ధిదారులందరూ పింఛను నగదు కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు పడ్డారు. -
ప్రతిపాదనలతో నీళ్లొదిలేశారు!
[ 02-06-2024]
వేసవిలో చేపట్టాల్సిన పంట కాలువల నిర్వహణ పనులకు ఆమోదం లభించకుండానే ఈ ఏడాది సాగునీటిని విడుదల చేశారు. దీంతో ఈ సారి కీలకమైన పూడిక తీత పనులకు అవకాశం లేకుండాపోయింది. -
అంజనీసుతా.. అతులిత బలధామా!
[ 02-06-2024]
హనుమజ్జయంతిని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో శనివారం వైభవంగా నిర్వహించారు. భీమవరంలోని పంచారామక్షేత్రం సోమేశ్వర జనార్దనస్వామి దేవస్థానం ప్రాంగణంలో భక్తాంజనేయ స్వామి ఉపాలయంలో ఉదయం స్వామికి అభిషేకాలు, లక్ష తమలపాకుల పూజలు, మూలమంత్ర హోమం చేశారు. -
4న భీమవరంలో ట్రాఫిక్ మళ్లింపు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో భీమవరం పట్టణంలో ఈ నెల 4న ట్రాఫిక్ను మళ్లించనున్నట్లు ఎస్పీ వి.అజిత తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి వాహనాలను వేర్వేరు మార్గాల్లో మళ్లిస్తామన్నారు. లెక్కింపు కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు, ఏజెంట్లు వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే నిలుపుదల చేయాలని సూచించారు. -
దిక్కు లేని ర.భ.శాఖ
[ 02-06-2024]
ప్రభుత్వానికి సంబంధించి ఏ శాఖకు భవనం నిర్మించాలన్నా రహదారులు భవనాలశాఖ డిజైన్ చేసి అనుమతి ఇవ్వాల్సిందే. రహదారులు అభివృద్ధి నిర్వహణ అంతా ఆ శాఖపైనే ఆధారపడి ఉంటుంది. -
ఎప్పటిలాగే ఏకరవు!
[ 02-06-2024]
జడ్పీటీసీ సభ్యులు పలువురు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై ఏకరవు పెట్టారు. ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు తమ మండలాల్లోని సమస్యలను ప్రస్తావించారు. -
కళాశాలల్లో సమస్యల స్వాగతం
[ 02-06-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతులు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. కళాశాలల పునఃప్రారంభం నేపథ్యంలో వాటి ఆవరణలను పరిశీలిస్తే నాడు-నేడు పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ.. మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
-
జయలలిత సిద్ధాంతాలపై జగడం.. తమిళనాట రాజకీయాల్లో తీవ్ర చర్చ
-
అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
-
చంద్రబాబు రాకపోయినా వచ్చినట్లు తప్పుడు కథనం.. తెదేపా ఫిర్యాదు
-
రూపాయి గొడవ.. ప్రాణం తీసింది