Summer Special trains: విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!
బెంగళూరు- విశాఖల మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
సికింద్రాబాద్: వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్ల సర్వీసులు నడుపుతోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం - బెంగళూరు నగరాల మధ్య 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 30 వరకు శని, ఆదివారాల్లో మాత్రమే ఈ రైళ్ల సర్వీసులు అందించనున్నాయి.
విశాఖపట్నం - బెంగళూరు (08549) రైలు శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు బెంగళూరు చేరుకోనుంది. అలాగే, బెంగళూరు -విశాఖ (08550) రైలు బెంగళూరులో ఆదివారం ఉదయం 8.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, కృష్ణరాజపురం స్టేషన్ల మీదుగా సర్వీసులందించే ఈ ప్రత్యేక రైళ్లలో సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్