Hyderabad: బోయిన్‌పల్లిలో మద్యం తరలిస్తున్న లారీ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో బుధవారం సాయంత్రం మద్యం లోడుతో వెళ్తోన్న వాహనం బోల్తా పడింది.

Updated : 22 May 2024 19:16 IST

హైదరాబాద్: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డైరీ ఫార్మ్‌ ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం లిక్కర్‌ లోడుతో వెళ్తోన్న వాహనం బోల్తా పడింది. టైర్‌ పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో దాదాపు రూ.3లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంస మయ్యాయి. మద్యం బాటిళ్లు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. ఇదే అదునుగా కొందరు వాహనదారులు మద్యం సీసాలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు