YS Jagan: సీఎం జగన్‌ కాన్వాయ్‌లో కారు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

కృష్ణాజిల్లా గుడివాడలో సీఎం జగన్ కాన్వాయ్‌లోని వాహనం నర్సమ్మ అనే వృద్ధురాలిని ఢీ కొట్టింది.

Updated : 15 Apr 2024 21:34 IST

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం జగన్ కాన్వాయ్‌లోని వాహనం నర్సమ్మ అనే వృద్ధురాలిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె కాలు నుజ్జునుజ్జయింది. సీఎం సభా వేదిక వద్ద రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఆమెను అటువైపుగా వెళ్తున్న కాన్వాయ్‌లోని కారు ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి కాలికి కట్టుకట్టారు. సీఎం సభ కోసం బాధితురాలు గంపలగూడెం మండలం నెమలి గ్రామం నుండి వచ్చినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని