AP Inter Exams: ఏపీలో ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు

ఏపీలో ఇంటర్‌ పరీక్షలు (AP Inter Exams) ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,559 కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నారు.

Updated : 01 Mar 2024 11:09 IST

అమరావతి: ఏపీలో ఇంటర్‌ పరీక్షలు (AP Inter Exams) ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,559 కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. రోజూ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఈ ఏడాది 10 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 5,29,457 మంది ప్రథమ, 4,76,198 మంది ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్‌కి హాజరు కానున్నారు. రాష్ట్రంలో 57 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని