Drugs: దేశంలో డ్రగ్స్ ప్రధాన సమస్యగా మారింది: సందీప్ శాండిల్య
దేశంలో డ్రగ్స్ ప్రధాన సమస్యగా మారిందని టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మాదకద్రవ్యాల నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: దేశంలో డ్రగ్స్ ప్రధాన సమస్యగా మారిందని టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మాదకద్రవ్యాల నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఒంటరితనం అనుభవించేవారు వీటి బారిన పడుతున్నారని తెలిపారు. పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు.
మాదకద్రవ్యాలు స్కూళ్ల వరకు చేరడం ఆందోళనకరం: హైదరాబాద్ సీపీ
స్కూళ్ల వరకు డ్రగ్స్ చేరుతున్నట్లు చాలా వార్తలు చూశానని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఇది ఆందోళనకరమైన విషయమని చెప్పారు. ‘‘కొన్ని పాన్ షాపుల్లోనూ డ్రగ్స్ దొరుకుతున్నాయి. దేశం మొత్తం మీద ఇవి ప్రభావం చూపిస్తాయి. వీటి వల్ల వచ్చే డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుతున్నారు. స్కూళ్లలో డ్రగ్స్ నిర్మూలన కమిటీలు ఏర్పాటు చేయాలి’’ అని ఆయన సూచించారు.
యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని రాచకొండ సీపీ తరుణ్ జోషి ఆందోళన వ్యక్తం చేశారు. వీటి నివారణకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని తెలిపారు. మాదక ద్రవ్యాలు మానవ మనుగడకే ప్రమాదకరమని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి హెచ్చరించారు. డ్రగ్స్ వాడకాన్ని నిరోధించాలంటే దాని వల్ల కలిగే నష్టం ఎంతలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని కోరారు. ఈ విషయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
స్కూళ్లలో డ్రగ్స్ నిర్మూలన కమిటీలు: బుర్రా వెంకటేశం
విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలంటే చిన్నతనం నుంచే అవగాహన ముఖ్యమని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చాలన్నారు. ‘‘బాల్యంలోనే పిల్లల భవిష్యత్తు సక్రమంగా ఉంచాలి. సమాజంలో ప్రతి ఒక్కరికీ విద్య, ఆరోగ్యం చాలా ముఖ్యం. అన్ని స్కూళ్లలో డ్రగ్స్ నిర్మూలన కమిటీలు ఏర్పాటు చేయాలి. పేరును త్వరలోనే నిర్ణయిస్తాం. పాటించాల్సిన అంశాలను నిర్లక్ష్యం చేస్తే ఆయా స్కూళ్లపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. -
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ