BRS: ‘మేడిగడ్డ’కు వెళ్తుండగా పగిలిన భారాస నేతల బస్సు టైరు

‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి వెళ్తున్న భారాస నేతల బస్సు టైరు పగిలింది.

Published : 01 Mar 2024 15:19 IST

లింగాల గణపురం: ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి వెళ్తున్న భారాస నేతల బస్సు టైరు పగిలింది. ఈ ఘటన జనగామ జిల్లా లింగాల గణపురం మండలం ఆర్టీసీ కాలనీ సమీపంలో హైదరాబాద్‌-భూపాలపల్లి బైపాస్‌పై చోటుచేసుకుంది. ఈ ఘటనతో బస్సులోని నేతలు, మీడియా ప్రతినిధులు ఆందోళనకు గురయ్యారు. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత బస్సు సిబ్బంది మరో టైరు బిగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని