Kavitha: కవిత బెయిల్ పిటిషన్.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశం
దిల్లీ మద్యం కేసు వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏప్రిల్ 22న విచారణ జరగనుంది.
దిల్లీ: దిల్లీ మద్యం కేసు వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏడేళ్ల కంటే తక్కువ శిక్షపడే కేసుల్లో అరెస్టు చేయొద్దన్న నిబంధనలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. గతంలోనూ సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా తనను అరెస్టు చేశారని, వెంటనే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఈ నెల 20లోపు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 22కి వాయిదా వేసింది.
సోమవారం ఉదయం కవితను సీబీఐ అధికారులు రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో అధికారులు మరోసారి కవితను తిహాడ్ జైలుకు తరలించనున్నారు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా.. కోర్టు 9 రోజులకు అనుమతించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్ అనిల్ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 27 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/04/24)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?