Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌.. బుధవారం విచారణకు వచ్చే అవకాశం

ఉచిత ఇసుక పథకంపై సీఐడీ నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 07 Nov 2023 15:41 IST

అమరావతి: ఉచిత ఇసుక పథకంపై సీఐడీ నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ బుధవారం విచారణకు వచ్చే అవకాశముంది. ఉచిత ఇసుక పథకం పేరుతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చారనే ఆరోపణలతో ఏపీఎండీసీ డైరెక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై సీఐడీ కేసు నమోదు చేయటం సరికాదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని