Chandrababu: దుర్గమ్మ సేవలో చంద్రబాబు దంపతులు

విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మను తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) దర్శించుకున్నారు.

Updated : 02 Dec 2023 23:27 IST

విజయవాడ: తెలుగు ప్రజానీకానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు  (Chandrababu) తెలిపారు. తెలుగు ప్రజలు సిరి సంపదలతో, ఆనందంగా జీవించేందుకు వారికి సేవ చేసే అవకాశం అమ్మవారు ప్రసాదిస్తారని నమ్ముతున్నానన్నారు. విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మను సతీసమేతంగా చంద్రబాబు ఇవాళ దర్శించుకున్నారు. తొలుత వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేసి.. అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కనకదుర్గమ్మ శక్తి స్వరూపిణి అని అన్నారు. సమాజాన్ని రక్షించి దుష్టుల్ని శిక్షించమని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మానవ సంకల్పానికి దైవ సహాయం ఎంతో అవసరమనే తొలుత దైవదర్శనాలు చేస్తున్నానన్నారు. విజయవాడకు వచ్చిన చంద్రబాబుకు ఎంపీ కేశినేని నాని, తెదేపా నేతలు కేశినేని చిన్ని, జనసేన నేత పోతిన మహేష్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, అశోక్‌బాబు, నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, మాగంటి బాబు, బుద్దా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు