Chandrababu: అంబేడ్కర్‌ ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడమే అసలైన నివాళి: చంద్రబాబు

దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమ న్యాయం చేకూర్చేందుకు కృషిచేసిన మహనీయుడు అంబేడ్కర్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Published : 14 Apr 2024 14:40 IST

అమరావతి: దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమ న్యాయం చేకూర్చేందుకు కృషిచేసిన మహనీయుడు అంబేడ్కర్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అంబేడ్కర్‌ ఆదర్శాలు, ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడమే ఆయనకు అందించే అసలైన నివాళి అని పేర్కొన్నారు.

అంబేడ్కర్‌ సేవలు మరువలేనివి: లోకేశ్‌

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయుని సేవ‌లు స్మరిస్తూ నివాళులర్పించినట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టు చేశారు. భారత్‌ను ప్రపంచంలోని అతి పెద్ద లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి మరువలేనిదని కొనియాడారు. అంబేడ్కర్‌ ఆశ‌య‌ సాధ‌న‌కు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని