Chandrababu: సామాజిక దురాచారాలపై వీరేశలింగం పోరాటం చిరస్మరణీయం: చంద్రబాబు

ఆధునికాంధ్ర సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు.

Updated : 16 Apr 2024 14:57 IST

అమరావతి: ఆధునికాంధ్ర సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. సామాజిక దురాచారాలపై ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో చంద్రబాబు పోస్ట్ చేశారు. వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని వీరేశలింగం పంతులు ఆనాడే ఎత్తిచూపారని గుర్తుచేశారు. మహిళల అభ్యున్నతికి బాటలు వేయడంలో తెదేపాకు ఆయనే స్ఫూర్తి అని.. దాన్ని కొనసాగించేందుకు పునరంకితమవుదామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని