పిచ్చుకల పాలిట దైవం ఈ గణేశన్!
పట్టణీకరణ జరుగుతున్న కొద్దీ.. ఒక మార్పును గమనించారా? నిత్యం ఇంటి వద్ద కిచకిచ అని శబ్దాలు చేస్తూ ఆకట్టుకునే పిచ్చుకలు రాను రాను కనుమరుగవుతున్నాయి. అభివృద్ధి పేరుతో పట్టణాల్లో చెట్లను నరికేస్తుండటంతో వాటికి ఉండటానికి చోటు లేక నగరాల్ని వదిలి
ఇంటర్నెట్ డెస్క్: నగరీకరణ జరుగుతున్న కొద్దీ.. ఒక మార్పును గమనించారా? నిత్యం ఇంటి వద్ద కిచకిచ అని శబ్దాలు చేస్తూ ఆకట్టుకునే పిచ్చుకలు రాను రాను కనుమరుగవుతున్నాయి. అభివృద్ధి పేరుతో పట్టణాల్లో చెట్లను నరికేస్తుండటంతో వాటికి ఉండటానికి చోటు లేక నగరాల్ని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయి. కొన్ని నగరాల్లో తిరుగుతున్నా.. ఎండకు, వానకు తలదాచుకునే చోటు దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. దీంతో ఈ కాలం పిల్లలకు పిచ్చుకలు పుస్తకాల్లో.. టీవీల్లో కనిపించడమే తప్ప.. నిజంగా కనిపించడం గగనమైపోయింది. అందుకే, వలస వెళ్లిపోకుండా పిచ్చుకలు నగరాల్లో ఉండిపోయేలా వాటికంటూ ఒక గూడు ఏర్పాటు చేస్తున్నాడు చెన్నైకి చెందిన గణేశన్. ప్రొఫెసర్గా విద్యార్థులకు పాఠాలు చెబుతూనే.. మరోవైపు పిచ్చుకల కోసం స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నాడు.
చెన్నైలోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫ్రొఫెసర్గా పనిచేస్తున్న గణేశన్.. ఉండటానికి నీడలేక పిచ్చుకలు నగరాన్ని వదిలి వెళ్తుండటాన్ని గమనించాడు. ఎలాగైనా వాటిని నగరంలో ఉండేలా చేయాలనుకున్నాడు. పిచ్చుకలకు గూళ్లు ఏర్పాటు చేస్తే.. వలసవెళ్లడం ఆపేస్తాయని భావించాడు. దీంతో 2017లో పిచ్చుకలకు గూడు ఏర్పాటు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు. ఇళ్లలో పక్షుల కోసం గూడు, ఆహారం ఏర్పాటు చేయాలని కోరాడు. అప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న పక్షుల గూడును కొనుగోలు చేసి ఇంటి పెరట్లో.. లేదా ఇంటిపైన ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు.. తాను కూడా వందల సంఖ్యలో గూళ్లు కొనుగోలు చేసి తనుండే రాయపురం ప్రాంతంలో స్థానికులకు పంపిణీ చేశాడు.
సొంతగా గూళ్లు తయారు చేస్తూ..
గూళ్లను కొని పంపిణీ చేసినా.. గణేశన్కు ఆశించిన ఫలితం రాలేదు. దీంతో తనే ముడి సరుకులు కొనుగోలు చేసి.. స్వయంగా గూళ్లు నిర్మించాలని నిర్ణయించాడు. ఈ నేపథ్యంలో కూడుగల్ నెక్ట్స్ ట్రస్ట్ పేరుతో స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాడు. కూడుగల్ అంటే గూళ్లు అని అర్థం. తొలి నెలలోనే 500 గూళ్లు నిర్మించాడు. అలాగే, తన విద్యార్థులతో కలిసి గూడు ఎలా తయారు చేయాలో వర్క్షాపులు నిర్వహించడం ప్రారంభించాడు. దీంతో ప్రతి ఒక్కరు పిచ్చుకలకు ఎదురవుతోన్న కష్టాలేంటో తెలుసుకోగలుతున్నారు. వాటికి రక్షణ కల్పించేలా గూడు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనపబరుస్తున్నారు. నగరంలో ఉన్న పిచ్చుకలకు నీడ కల్పించడంతోపాటు వలస వెళ్లిపోయిన పిచ్చుకలను తిరిగి నగరంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని గణేశన్ వెల్లడించాడు. ఇప్పటి వరకు అతడు 1,200పైగా గూళ్లను చెన్నై వ్యాప్తంగా ఏర్పాటు చేయగా.. 950 గూళ్లలో పిచ్చుకలు నివాసం ఉంటున్నాయట. రానున్న రోజుల్లో మరిన్ని గూళ్లు తయారు చేసి.. చెన్నై నగరమంతా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. పక్కనుండే మనిషి కష్టాన్ని గుర్తించలేకపోతున్న ఈ సమాజంలో పిచ్చుకుల ఉనికి కోసం గణేశ్ చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్