Chandrababu: చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది.

Updated : 30 Oct 2023 21:41 IST

అమరావతి: తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై సీఐడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతిలిచ్చారన్న ఆరోపణలపై తాజా కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కంపెనీలకు అనుమతులు ఇచ్చారని ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఏసీబీ న్యాయస్థానం జడ్జికి అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని