Andhra news: కృష్ణా జిల్లాలో విద్యుత్‌ ఉద్యోగుల బదిలీలపై నివేదిక కోరిన ఈసీ

కృష్ణా జిల్లాలో విద్యుత్‌ ఉద్యోగుల బదిలీలపై ఎన్నికల సంఘం వివరణ కోరింది.

Published : 21 Apr 2024 22:33 IST

అమరావతి: కృష్ణా జిల్లాలో విద్యుత్‌ ఉద్యోగులను బదిలీ చేసి కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడిన వ్యవహారంలో ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీపై సీఈవో కార్యాలయానికి ఫిర్యాదు అందింది. కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఉద్యోగులను బదిలీ చేస్తూ సీఎండీ సంతోష్‌రావు తీసుకున్న నిర్ణయంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఈవో కార్యాలయం ఆదేశించింది. 24 గంటల్లోగా బదిలీల వ్యవహారంపై నివేదిక ఇవ్వాల్సిందిగా కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల అదనపు ప్రధానాధికారి హరేంధిర ప్రసాద్‌ ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని