మేక @ జూమ్ మీటింగ్స్!
కరోనా.. లాక్డౌన్ నేపథ్యంలో అనేక ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం చేయమంటున్నాయి. ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్లు పెరిగిపోయాయి. ముఖ్యంగా జూమ్ యాప్ ద్వారా వీడియో కాల్ సమావేశం నిత్యకృత్యం అయిపోయింది. సాధారణంగా ఈ జూమ్ వీడియో
ఇంటర్నెట్ డెస్క్: కరోనా.. లాక్డౌన్ నేపథ్యంలో అనేక కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం చేయమంటున్నాయి. ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్లు పెరిగిపోయాయి. ముఖ్యంగా జూమ్ యాప్ ద్వారా వీడియో కాల్ సమావేశం నిత్యకృత్యం అయిపోయింది. సాధారణంగా ఈ జూమ్ వీడియో సమావేశాల్లో ఉద్యోగులు, అధికారులు, క్లయింట్స్ పాల్గొంటుంటారు. కానీ, ఆకస్మాత్తుగా ఈ సమావేశంలో ఒక మేక వచ్చి చేరితే?ఇలాంటి ఆలోచన ఎవరికీ రాదు.. కానీ, ఓ మహిళా రైతుకు వచ్చింది. వెంటనే ఆమె పెంచుతున్న మేకలను జూమ్ కాల్స్లో పాల్గొనేలా చేసి ఆదాయం పొందుతోంది. ఆశ్చర్యంగా ఉంది.. కదా! అయితే, ఈ పూర్తి వార్త చదివేయండి..
యూకేలోని రాసెండేల్కు చెందిన డాట్ మెక్కార్టీకి వ్యవసాయక్షేత్రం ఉంది. అందులోనే మేకలను పెంచుతోంది. పంట సాగు చేయడంతోపాటు వ్యవసాయం, మేకల పెంపకంపై అవగాహన కోసం విద్యార్థులను సందర్శనకు అనుమతిస్తూ బాగా సంపాదించేది. కరోనా సంక్షోభంలో విద్యాసంస్థలు మూతపడటంతో ఆదాయం కాస్త తగ్గింది. లాక్డౌన్లో ఖాళీగా ఉన్న మెక్కార్టీకి ఒక ఆలోచన వచ్చింది. ‘ప్రస్తుతం ఉద్యోగులంతా జూమ్ వీడియో సమావేశాల్లో మాట్లాడుకుంటున్నారు.. వీరి మధ్యలోకి మేక వస్తే ఎలా ఉంటుందా?’ అని. సరదాగా వచ్చిన తన ఆలోచననే ఆమె వ్యవసాయక్షేత్రానికి సంబంధించిన వెబ్సైట్లో ఓ ప్రకటనగా ఇచ్చింది.
‘జూమ్ వీడియో సమావేశాల నిర్వాహకులు.. సమావేశంలో పాల్గొనేవారిని ఆశ్చర్యపర్చడం కోసం మా మేకలను అద్దెకు తీసుకోవచ్చు. మీరు చెప్పిన సమయానికి మా మేకలు జూమ్ కాల్స్లో దర్శనమిస్తాయ’ని మెక్కార్టీ తన ప్రకటనలో పేర్కొంది. దీంతో ఆమె ప్రకటనకు అనూహ్యమైన రీతిలో స్పందన వస్తోంది. అనేక సంస్థలు తమ ఉద్యోగులను, ఇతరులు తమ కుటుంబసభ్యులు, స్నేహితులను ఆశ్చర్యపర్చడం కోసం మేకను అద్దెకు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక జూమ్ సమావేశానికి మెక్కార్టీ 5 పౌండ్లు వసూలు చేస్తోంది. మేక సమావేశంలో పాల్గొనాలంటే ముందుగానే డబ్బులు చెల్లించి.. సమయం, వీడియోకాల్ లింక్ వివరాలు ఇవ్వాలి. ఆ సమయానికి మెక్కార్టీ వద్ద పనిచేసే ఉద్యోగులు మేకను వీడియో సమావేశంలో కనిపించేలా చేస్తారు. ఇలా ఇప్పటి వరకు మెక్కార్టీ 50వేల పౌండ్లు (దాదాపు రూ.50లక్షలు)సంపాదించింది. భలే ఉంది కదా.. ఆలోచన!
ఇవీ చదవండి..
బెజోస్ ప్రకటన: పిచాయ్, నాదెళ్ల ఏమన్నారంటే..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్