రాత్రి 8గంటల వరకు మద్యం దుకాణాలు
తెలంగాణలో నేటి నుంచి మద్యం దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని అబ్కారీ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు, డిప్యూటీ కమిషనర్లకు, జాయింట్ కమిషనర్లకు, అదనపు కమిషనర్లకు ఆ శాఖ కమిషనర్ స్వయంగా సమాచారం ఇచ్చి ఇవాళ్టి నుంచి అమలయ్యేట్లు చూడాలని ఆదేశించారు.
హైదరాబాద్: తెలంగాణలో నేటి నుంచి మద్యం దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని అబ్కారీ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు, డిప్యూటీ కమిషనర్లకు, జాయింట్ కమిషనర్లకు, అదనపు కమిషనర్లకు ఆ శాఖ కమిషనర్ స్వయంగా సమాచారం ఇచ్చి ఇవాళ్టి నుంచి అమలయ్యేట్లు చూడాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల్లో మరిన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో అబ్కారీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
మే 31వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉంచేట్లు నిబంధనలు అమలయ్యేవి. ఇప్పుడు రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచే ఉంటాయి. తాజాగా మరో రెండు గంటల పాటు సమయాన్ని పొడిగించడం వల్ల.. మద్యం అమ్మకాలు మరింత పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుందని దుకాణదారులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?