రాత్రి 8గంటల వరకు మద్యం దుకాణాలు

తెలంగాణలో నేటి నుంచి మద్యం దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని అబ్కారీ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లకు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లకు, డిప్యూటీ కమిషనర్లకు, జాయింట్‌ కమిషనర్లకు, అదనపు కమిషనర్లకు ఆ శాఖ కమిషనర్ స్వయంగా సమాచారం ఇచ్చి ఇవాళ్టి నుంచి అమలయ్యేట్లు చూడాలని ఆదేశించారు.

Published : 01 Jun 2020 20:14 IST

హైదరాబాద్‌: తెలంగాణలో నేటి నుంచి మద్యం దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని అబ్కారీ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లకు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లకు, డిప్యూటీ కమిషనర్లకు, జాయింట్‌ కమిషనర్లకు, అదనపు కమిషనర్లకు ఆ శాఖ కమిషనర్ స్వయంగా సమాచారం ఇచ్చి ఇవాళ్టి నుంచి అమలయ్యేట్లు చూడాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ నిబంధనల్లో మరిన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో అబ్కారీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 
మే 31వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉంచేట్లు నిబంధనలు అమలయ్యేవి. ఇప్పుడు రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచే ఉంటాయి. తాజాగా మరో రెండు గంటల పాటు సమయాన్ని పొడిగించడం వల్ల.. మద్యం అమ్మకాలు మరింత పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుందని దుకాణదారులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని