Chandrababu : సీఐడీ అధికారుల కాల్‌డేటా ఇవ్వాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు ముందు, ఆ సమయంలో, ఆ తర్వాత సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డులు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

Published : 13 Oct 2023 11:55 IST

విజయవాడ: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు ముందు, ఆ సమయంలో, ఆ తర్వాత సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డులు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 18కి విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. కాల్‌డేటా భద్రపరచాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్‌ వేశారు. ఇప్పటికే ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని