Kilaru Rajesh : సీఐడీ అధికారులకు కిలారు రాజేష్‌ లేఖ

తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్‌ సీఐడీ అధికారులకు లేఖ రాశారు.

Published : 17 Oct 2023 10:58 IST

అమరావతి: తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్‌ సీఐడీ అధికారులకు లేఖ రాశారు. ఇవాళ ఉ.10గం.లకు డాక్యుమెంట్లు తీసుకురావాలని నిన్న రాజేష్‌ను సీఐడీ ఆదేశించింది. అయితే.. దసరా పండగ తర్వాత డాక్యుమెంట్లు తీసుకొస్తానంటూ కిలారు రాజేష్‌ లేఖ రాశారు. ఇప్పటికిప్పుడు డాక్యుమెంట్లు సాధ్యం కాదని సమయం కోరుతూ లేఖలో పేర్కొన్నారు.

నైపుణ్యాభివృద్ధి కేసుకు సంబంధించి సోమవారం కిలారు రాజేష్‌ సీఐడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. తాడేపల్లిలోని సీఐడీ ఆర్థిక నేరాల విభాగం-2 (సిట్‌) కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు అధికారులు ఆయనను ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని