ఊడిన బేతవోలు కాల్వ షట్టర్.. వందల ఎకరాల్లో నీట మునిగిన పంటలు
సూర్యాపేట జిల్లా మునగాల మండల హెడ్క్వార్టర్ శివారులో అనుకోని ఘటన జరిగింది. దీని కారణంగా రైతులకు అపార నష్టం వాటిల్లింది.
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల హెడ్క్వార్టర్ శివారులో అనుకోని ఘటన జరిగింది. దీని కారణంగా రైతులకు అపార నష్టం వాటిల్లింది. సాగర్ ఎడమ కాల్వపై నిర్మించిన బేతవోలు వరద కాల్వకు ఉన్న ఎస్కేప్ షట్టర్ ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఊడిపోయింది. ఈ ఘటనతో దిగువ ప్రాంతాలకు సాగర్ ఎడమ కాల్వ నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో చిలుకూరు మండలంలోని వివిధ ప్రాంతాల్లో వందల ఎకరాలు నీట మునిగాయి. కోత కోసి పొలాల్లోనే ఉంచడంతో పంటలు తడిసి ముద్దయ్యాయి.
తెల్లవారుజామున సాగర్ సీఈ రమేష్బాబు, ఎస్ఈ నరసింహరాజు కాల్వను పరిశీలించి నీటిని నిలిపివేశారు. అయితే ఈలోపేలే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చేపట్టారు. బేతవోలు చెరువు నింపేందుకు జేసీబీతో షట్టర్ తెరిచినట్లు పోలేనిగూడెం రైతులు ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రాణాలు కన్నా.. ఆదాయమే మిన్నా?
గాలివాన దుమారంతో సోమవారం ముంబయిలోని అనేక హోర్డింగులు, బోర్డులు, ఫ్లెక్సీలు, రేకుల నిర్మాణాలు గాలికి కొట్టుకుపోయాయి. పాత ముంబయిలోని గొటక్పర్ ప్రాంతంలో 100 అడుగుల అక్రమ హోర్డింగు అక్కడున్న పెట్రోలు బంకుపై కుప్పకూలింది. -
దొంగ ఆలోచనలకు రెక్కలు
ఒకే ఒక్కడు.. 110 రోజులు.. దేశవ్యాప్తంగా దాదాపు 200 విమానాల్లో ప్రయాణం.. ఇంత బిజీగా దేశంలోని నగరాలు చుట్టేసే ఇతను ఓ దొంగ అంటే ఎవరైనా నమ్ముతారా..? కేవలం విమాన ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ఘరానా దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. -
స్మార్ట్గా చదివెయ్
వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్, సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకూడదనే ఉద్దేశంతో.. విద్యాశాఖ వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టింది. లిటరసీ క్లౌడ్ మాధ్యమం ద్వారా ఇంటి వద్దనే ఆకర్షణీయమైన తెలుగు, ఆంగ్ల పుస్తకాలను రూమ్ టూ రీడ్ ఇండియా ట్రస్ట్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,250 ఎగువన నిఫ్టీ
-
నార్కోటిక్ అంటాడు.. నమ్మితే ముంచేస్తాడు
-
కోర్టులో ఎన్నికల ఫలితాలు తేల్చుకునేవారు..మాకు హితబోధలా: వెస్టర్న్ మీడియాపై జైశంకర్ ఫైర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కృష్ణాలో వైకాపా ఆనవాళ్లు మిగలవు: ఎంపీ బాలశౌరి
-
ఎవరి లెక్కలు వారివే.. భారీ ఆధిక్యంపై కాంగ్రెస్ ధీమా