గ్రానైట్పై విద్యుత్తు పిడుగు
‘బాపట్ల జిల్లా మార్టూరులో 400, బల్లికురవలో 200, సంతమాగులూరులో 90, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 120, ప్రకాశం జిల్లాలో 800 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.’
ఆందోళనలో యజమానులు
మార్టూరు ప్రాంతంలో ఏర్పాటైన ఓ గ్రానైట్ పరిశ్రమ
న్యూస్టుడే, మార్టూరు, యద్దనపూడి: ‘బాపట్ల జిల్లా మార్టూరులో 400, బల్లికురవలో 200, సంతమాగులూరులో 90, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 120, ప్రకాశం జిల్లాలో 800 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.’
ఇప్పటికే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గ్రానైట్ పరిశ్రమపై పెరిగిన విద్యుత్తు ధరలు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారాయని యజమానులు ఆందోళన చెందుతున్నారు. ముడి రాయి కొరత, పతనమైన పలకల ధరలతో సతమతమవుతుండగా విద్యుత్తు ఛార్జీలతో బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానంపై అవగాహన కల్పించకపోవడం.. ప్రతి యంత్రానికి ఏర్పాటు చేసిన కెపాసిటర్ వంటి ఆధునిక పరిజ్ఞాన వినియోగం తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన చెందుతున్నారు. గతనెల రూ.లక్ష వచ్చిన గ్రానైట్ యూనిట్కు ప్రస్తుతం రూ.1.74 లక్షల బిల్లు వస్తోందని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి.
గ్రానైట్ పరిశ్రమలో అన్ని యంత్రాలు నడిపేందుకు ప్రధాన భూమిక పోషించేది ప్యానెల్ బోర్డు. ఇప్పటి వరకు ప్యానెల్ బోర్డుకు మాత్రమే కెపాసిటర్లను ఏర్పాటుచేసి కిలోవాట్స్ రీడింగ్ను విద్యుత్తు శాఖ అధికారులు గుర్తించేవారు. మారిన విధివిధానాలకు అనుగుణంగా పరిశ్రమలోని ప్రతి యంత్రానికి ఒక కెపాసిటరు ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పరిశ్రమ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాక విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులు.. యజమానులు, పరిశ్రమ సిబ్బందిలో అవగాహన పెంపొందించలేదని, ఎవరో వచ్చి కెపాసిటర్లను బిగించడంతో అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. వీటి ఫలితంగా యంత్రాలు పనిచేయని సమయంలోనూ విద్యుత్తు రీడింగ్ నమోదవుతోందని అంటున్నారు.
ప్రస్తుతం పెరిగిన ఛార్జీలకు అనుగుణంగా ఈ నెల వచ్చిన రూ.1,74,743 బిల్లు
హామీలు నీటి మూటలుగా..
వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా 2019కి ముందు చేపట్టిన పాదయాత్రలో అప్పటి ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ యజమానులు చీమకుర్తిలో జగన్ను కలిసి, సంక్షోభంలో ఉన్న గ్రానైట్ పరిశ్రమ సమస్యలు వివరించారు. అధికారం చేపట్టగానే సమస్యలు పరిష్కరించి, న్యాయం చేస్తానని వారికి నాడు హామీ ఇచ్చారు. అంతేకాక విద్యుత్తు యూనిట్కి రూ.3.50 ధర తగ్గించి, రాయితీ కల్పిస్తానని ఇచ్చిన హామీ నీటి మూటచందంగా మారిందని పరిశ్రమ వర్గం మిన్నకుండిపోయింది. విద్యుత్తు ఛార్జీలు తగ్గించకపోగా, జగన్ సర్కార్ యూనిట్కి రూ.2 తగ్గిస్తూ ఇచ్చిన జీవో ఇప్పటికీ అమలుకాలేదని, ప్రస్తుతం రూ.9 చెల్లించడం పరిశ్రమ మనుగడుకే కష్టంగా మారిందని ఆవేదన చెందుతున్నారు.
యూజర్ ఛార్జీ ఒక రూపాయి వసూలు
గ్రానైట్ పరిశ్రమలో ఒక యూనిట్ ఖర్చు చేస్తే ఇందుకు ఆరు పైసలను యజమానులు విద్యుత్తు శాఖకు చెల్లించాల్సి ఉంది. కానీ ఎక్కువ సంఖ్యలో పరిశ్రమల నుంచి ఆ శాఖ రూపాయి వరకు వసూలు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అదనపు భారాన్ని మోయలేని కొందరు యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారికి మాత్రం ఆరు పైసలు వెసులుబాటు కలుగుతోంది. మిగిలినవారు అదనపు భారాన్ని భరిస్తున్నారు.
ఛార్జీలు తగ్గించాలి
ప్రస్తుతం గ్రానైట్ పరిశ్రమలపై ప్రభుత్వం మోపిన విద్యుత్తు ఛార్జీలు పెనుభారమయ్యాయి. పరిశ్రమలు మూతపడే దిశగా మారాయి. ప్రభుత్వం పునరాలోచించి పారిశ్రామిక వర్గాలకు తోడ్పాటుగా నిలవాలి. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కెపాసిటర్ల స్థానంలో ఆటో ప్యానెల్ ఏర్పాటుచేసి యజమానులను ఆదుకోవాలి. ఈ నూతన విధానంపై యజమానుల్లో అవగాహన పెంపొందించి, రాయితీలు కల్పించాలి.
ఇంటూరు ఆంజనేయులు, గౌరవాధ్యక్షుడు, గ్రానైట్ యజమానులు సంక్షేమ సంఘం
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
గ్రానైట్ యజమానులు అదనపు కరెంటు ఛార్జీలపై తమ సమస్యలను వివరిస్తే పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. కరెంటు వినియోగానికి మించి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదు. సాంకేతికపరంగా ఇబ్బందులు తలెత్తితే సరిచేస్తాం. ఎవరికైన అదనంగా బిల్లులు వస్తే తమ దృష్టికి తీసుకురావాలి.
నల్లూరి మస్తాన్రావు, విద్యుత్తు డీఈఈ, అద్దంకి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది. -
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. -
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి