ఆ సంతకం వెనుక మతలబేమిటో!
మైనింగ్ సీనరేజీ నగదు పంపిణీలో ఇన్ఛార్జి డీపీవోగా వ్యవహరించిన ఓ అధికారి తన పరిధి దాటి వ్యవహరించారు.
ఒక ఊరి ఆదాయం మూడు గ్రామాలకు
సీనరేజీ పంపిణీలో పరిధి దాటి వ్యవహరించిన అధికారి
జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం
మైనింగ్ సీనరేజీ నగదు పంపిణీలో ఇన్ఛార్జి డీపీవోగా వ్యవహరించిన ఓ అధికారి తన పరిధి దాటి వ్యవహరించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి ఓ పంచాయతీకి చెందిన రూ.కోట్ల సీనరేజీ ఆదాయాన్ని మరో మూడు గ్రామాలకు పంచాలంటూ ఏకంగా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఉన్నతాధికారి అనుమతి లేకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక సదరు అధికారికి రూ.లక్షల్లో ముడుపులు ముట్టాయని పంచాయతీరాజ్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తమ పంచాయతీ ఆదాయాన్ని మరో మూడింటికి పంచాలని ఉత్తర్వులు జారీ చేయటం అన్యాయమంటూ సర్పంచి న్యాయపోరాటానికి దిగారు.
న్యూస్టుడే, బాపట్ల
జిల్లాలో గత జులై నుంచి సెప్టెంబరు వరకు రెండో త్రైమాసికంలో మైనింగ్ సీనరేజీ కింద రూ.15.01 కోట్ల ఆదాయం వచ్చింది. నిబంధనల ప్రకారంలో ఆదాయంలో 25 శాతం పంచాయతీలకు, 50 శాతం మండల పరిషత్తులకు, 25 శాతం జిల్లా పరిషత్తులకు కేటాయించాలి. గ్రానైట్ క్వారీలు అధికంగా ఉన్న బల్లికురవ మండలంలో జిల్లాలో అత్యధికంగా రూ.5.66 కోట్ల సీనరేజీ ఆదాయం వచ్చింది. కొణిదెన పంచాయతీ పరిధిలో జరిగిన గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి 2023-24 ఏడాదికి సంబంధించి రూ.3.89 కోట్ల సీనరేజీ ఆదాయం నిధులను గనుల శాఖ విడుదల చేసింది. పంచాయతీ ఖాతాలో మొదటి త్రైమాసికం కింద గత అక్టోబరు 3న రూ.47.27 లక్షలు, రెండో త్రైమాసికం కింద రూ.46.53 లక్షలు, మూడో త్రైమాసికం కింద రూ.46.81 లక్షలను జనవరి 11న అధికారులు జమ చేశారు. మూడు విడతల్లో కొణిదెన పంచాయతీకి సీనరేజీ ఆదాయం కింద రూ.1.40 కోట్లు విడుదలైంది. సీనరేజీని పంచాయతీల వారీగా వసూలు చేసినట్లు డీపీవోకు గనుల శాఖ అధికారులు గత జనవరిలో స్పష్టం చేశారు.
- డీపీవోగా ఉన్న రాంబాబు గత నెల చివరి వారంలో బదిలీ అయ్యారు. మరో శాఖకు చెందిన ఓ జిల్లా అధికారి రెండు వారాలకు పైగా ఇన్ఛార్జి డీపీవోగా వ్యవహరించారు. అధికార పార్టీ నేతల కన్ను సీనరేజీ ఆదాయంపై పడింది. ఇన్ఛార్జి డీపీవోగా వ్యవహరిస్తున్న అధికారి తమ ప్రాంతంలో పని చేసి రావటంతో వెంటనే జిల్లా కేంద్రానికి వచ్చి ఆయనతో మాటలు కలిపారు. పంచాయతీ వారీగా వచ్చిన సీనరేజీ ఆదాయాన్ని రెవెన్యూ గ్రామం కింద వచ్చినట్లు చూపి మరో మూడు పంచాయతీలకు పంచాలని కోరారు. దీనికి అంగీకారం తెలిపినందుకు సదరు అధికారికి రూ.లక్షల్లో ముట్టజెప్పారు. ఓ పంచాయతీకి విడుదల చేసిన సీనరేజీ ఆదాయాన్ని మిగతా పంచాయతీలకు పంచాలంటే కలెక్టర్ అనుమతి కావాలి. ఆ తర్వాతే ఆదేశాలు జారీ చేయాలి.
- కొణిదెన పంచాయతీ సీనరేజీ ఆదాయాన్ని మరో మూడు గ్రామాలకు పంచే విషయంపై దస్త్రాన్ని మాత్రమే కలెక్టర్కు పంపించారు. జిల్లా పాలనాధికారి నుంచి ఎలాంటి ఆదేశాలు, అనుమతి లేకుండానే ఆయన ఆదేశాల మేరకంటూ ఇన్ఛార్జి డీపీవోగా ఉన్న సదరు అధికారి గతంలో మూడు విడతల్లో కొణిదెన పంచాయతీ ఖాతాలో జమ చేసిన రూ.1.40 కోట్ల సీనరేజీ ఆదాయం నుంచి కె.మల్లాయపాలేనికి రూ.44.99 లక్షలు, నక్కబొక్కలపాడుకు రూ.37.95 లక్షలు, కె.రాజుపాలేనికి రూ.23.89 లక్షలు చొప్పున పంచాలంటూ పంచాయతీ కార్యదర్శికి ఫిబ్రవరి 17న ఉత్తర్వులు జారీ చేశారు. మూడు పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో పంచిన నిధులు జమ చేసి సమాచారాన్ని డీపీవో కార్యాలయానికి పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై కొణిదెన పంచాయతీ సర్పంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పంచాయతీ పరిధిలో జరిగిన గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి విడుదల చేసిన సీనరేజీ ఆదాయం వాటా నిధులను మరో మూడు గ్రామాలకు ఎలా పంచుతారంటూ ప్రశ్నించారు. ఇన్ఛార్జి డీపీవో జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవంటూ న్యాయపోరాటానికి దిగారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం అధికారులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై ప్రస్తుత బాపట్ల డీపీవో రవికుమార్ మాట్లాడుతూ ఆ ఉత్తర్వుల విషయం నాకు తెలియదు. నేను ఇటీవలే డీపీవోగా బాధ్యతలు స్వీకరించా. సీనరేజీ నిధుల విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81