వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది.
న్యూస్టుడే, నంద్యాల పట్టణం
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. ఈసారి ఛార్జీల రూపంలో కాకుండా విద్యుత్తు నియంత్రికలు, స్తంభాలు, పరికరాల ధరలను భారీగా పెంచేసింది. మూడు నెలల కిందట ఉన్న ధరలు ప్రస్తుతం రెట్టింపయ్యాయి. వ్యవసాయ, వాణిజ్య వినియోగదారులతో పాటు సామాన్యులపైనా భారం పడనుంది.
పరికరాలూ కొనలేం
విద్యుత్తు నియంత్రికల ధరలే కాకుండా స్తంభాలు, అనుబంధ పరికరాల ధరలు కూడా ఇష్టానుసారం పెంచారు. విద్యుత్తు స్తంభం ధర రూ.2,500 నుంచి రూ.4 వేలకు పెరిగింది. గతంలో ఎనిమిది మీటర్ల స్తంభం ధర రూ.1,900 ఉంటే ప్రస్తుతం రూ.3,200కు పెరిగింది. సాధారణంగా స్తంభాల ధరలు వేసవిలో కొంత వరకు పెరుగుతాయి. సిమెంటు ధరలు పెరగడం, క్యూరింగ్కు ఎక్కువగా విద్యుత్తు అవసరం కావడం వల్ల ధరలు పెంచుతారు. కాని 80 శాతం వరకు ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్యుత్తు నియంత్రిక అమర్చాలంటే 120 రకాల అనుబంధ పరికరాలు అవసరం అవుతాయి. వీటి ధరలు కూడా వందశాతం వరకు పెరిగాయి.
90 రోజుల్లో రూ.95 వేల పెంపు
ఉమ్మడి జిల్లా పరిధిలోని కర్నూలు సర్కిల్లో అన్ని విభాగాల్లో కలిపి విద్యుత్తు సర్వీసులు 15,02,667 ఉన్నాయి. 82 విద్యుత్తు ఫీడర్ల కింద సబ్స్టేషన్లు ఉన్నాయి. సింగిల్ ఫేజ్, త్రీఫేజ్ నియంత్రికలు సుమారు 1.82 లక్షలు ఉన్నాయి. మూడు నెలల కిందట త్రీఫేజ్ 25 కేవీ నియంత్రిక ధర రూ.80 వేల వరకు ఉండేది. ప్రస్తుతం దీని ధర రూ.1.75 లక్షలకు చేరింది. 90 రోజుల్లోనే రూ.95 వేలు పెరగడం గమనార్హం. ఇదే సమయంలో అనుబంధ పరికరాలు, విద్యుత్తు స్తంభాల ధరలు కూడా రెట్టింపయ్యాయి. పెరిగిన ధరలతో గృహ, వ్యవసాయ, వాణిజ్య విద్యుత్తు వినియోగదారులు లబోదిబోమంటున్నారు.
బాదుడే... బాదుడు
వ్యవసాయ సర్వీసుకు దరఖాస్తు చేసుకుంటే 10 హెచ్పీ సామర్థ్యానికి సంబంధించి రూ.12,400 చెల్లించాలి. ఈ మొత్తానికి 25 కేవీ నియంత్రిక, మూడు స్తంభాలు, 180 మీటర్ల పొడవైన మూడు లైన్ల తీగలు ఇస్తున్నారు. దూరం ఎక్కువ ఉంటే అందుకయ్యే ఖర్చు మొత్తం సంబంధిత రైతే చెల్లించాలి. గృహ, వాణిజ్య సర్వీసులకు సంబంధించిన మొత్తం భారం వినియోగదారులే భరించాలి. ముందుగా వినియోగదారు దరఖాస్తు చేసుకుంటే విద్యుత్తు సిబ్బంది వచ్చి దూరం చూసి అవసరమయ్యే స్తంభాలు, తీగలకు ఎంతవుతుందో అంచనా వేసి మొత్తం చెబితే ఆ మేరకు డబ్బు చెల్లించాలి. దగ్గర్లో నియంత్రిక ఉంటే ఖర్చు తగ్గుతుంది. నియంత్రిక లేకపోయినా, స్తంభాలు లేకపోయినా రూ.వేలల్లో భారం వినియోగదారులే భరించాలి. దీంతో ప్రస్తుతం వాణిజ్య, గృహ సర్వీసుల ఖర్చులు చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
అదనపు భారం రూ.8 కోట్లు
జిల్లా పునర్విభజన జరిగినా కూడా విద్యుత్తు శాఖ ఉమ్మడిగానే ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లా సర్కిల్ మొత్తానికి కర్నూలు స్టోర్ నుంచే నియంత్రికలు, పరికరాలన్నీ సరఫరా అవుతాయి. ఏటా ఈ గోదాము నుంచే రూ.40 కోట్ల విలువ చేసే సుమారు 2,500 25 కేవీ నియంత్రికలు సరఫరా అవుతున్నాయి. 63 కేవీ 300 వరకు, 100 కేవీ సామర్థ్యం ఉన్నవి 200 వరకు పంపిణీ చేస్తున్నారు. 160 కేవీ నియంత్రికలు మరో 250 వరకు అందజేస్తున్నారు. పెరిగిన ధరలతో ఏడాదికి రూ.8 కోట్ల వరకు అదనపు భారం ప్రజలపై పడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
తెలంగాణ అసెంబ్లీ ఒక్క రోజు విరామం తర్వాత శనివారం తిరిగి సమావేశం కానుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది. -
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. -
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM