ఆటపాటలే ఆనందం..
ఈ రోజుల్లో వివిధ రకాల స్క్రీన్లు చూస్తూ గంటలకొద్దీ సమయం గడుపుతున్నారు పిల్లలు. తద్వారా అనేక దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. దీనికన్నా రాత్రిపూట ఆరుబయట పడుకుని ఆకాశం వైపు చూడాలంటున్నారు నిపుణులు.
అశ్వాపురం, పాల్వంచ, న్యూస్టుడే
ఈ రోజుల్లో వివిధ రకాల స్క్రీన్లు చూస్తూ గంటలకొద్దీ సమయం గడుపుతున్నారు పిల్లలు. తద్వారా అనేక దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. దీనికన్నా రాత్రిపూట ఆరుబయట పడుకుని ఆకాశం వైపు చూడాలంటున్నారు నిపుణులు. నక్షత్రాలు, చంద్రుడు, మేఘాల కదలికలను గమనించటం వల్ల ఎంతో హాయిగా ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని అభిప్రాయపడుతున్నారు.
పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు బుధవారం మొదలుకానున్నాయి. మరోవైపు ఎండలు మండుతున్నాయి. ఎండలో తిరిగితే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని, ఇంటి పట్టునే నీడలో స్నేహితులతో కలిసి ఆడుకుంటే మానసికోల్లాసం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
పుస్తక పఠనంతో సృజనాత్మకత
పిల్లల కోసం ప్రత్యేకంగా బొమ్మల కథల పుస్తకాలు సేకరించగలిగితే వారు ఇంటి పట్టునే ఉండి వాటితో కాలం గడుపుతారు. తద్వారా ఊహలు, భావనలు పెంపొందుతాయి. పఠనంపై ఆసక్తి కలుగుతుంది. చిక్కు ప్రశ్నలు, పొడుపు కథలు అయితే వారిలో ఉత్సుకతను కలిగిస్తాయి. మెదడుకు మేతతో పాటు సృజనాత్మకతను పెంపొందిస్తాయి.
ఆసక్తి ఉండాలే కానీ..
బోలెడన్ని ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. షాపుల్లో వాటి కిట్లు లభిస్తాయి. క్యారమ్స్, చెస్, లూడో, బౌలింగ్, స్నేక్ అండ్ ల్యాడర్, కార్డ్ గేమ్స్, బ్రెయిన్ విటా వంటి ఆధునిక గేమ్స్ మెదడుకు మేత, మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అందుబాటులో క్రీడా మైదానాలు ఉంటే సాయంత్రం పూట స్నేహితులలో కలిసి బాల్ బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్బాల్ వంటి ఆటలు ఆడవచ్చు. శారీరక వ్యాయామం చేసినట్టవుతుంది. దాగుడుమూతలు, దొంగ పోలీస్, డాగ్ అండ్ బోన్, టగ్ ఆఫ్ వార్, ఉయ్యాల జంపాల, తొక్కుడు బిళ్ల, బిళ్లం గోనె, గోళీలు, త్రో బాల్ వంటి సంప్రదాయ ఆటలను చిన్నపిల్లలు ఆడుకోవచ్చు. కలివిడితనాన్ని ఈ ఆటలు నేర్పుతాయి. కుట్టు, అల్లికలు, గానం, నృత్యం, కరాటే, పెయింటింగ్, చేతిరాత వంటి అంశాలపై శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంటారని, కాసింత నైపుణ్యం సాధించడానికి వేసవి సెలవులు సరిపోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
1 నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు
ఖమ్మం: 82,732
భద్రాద్రి: 76,415
ఇటు వినోదాత్మకం.. అటు వ్యాయామం
సాయంత్రం పూట పిల్లలకు తోటపని అలవాటు చేయాలి. వివిధ రకాల మొక్కలు, వాటి ప్రత్యేకతలను తెలుసుకుంటారు. పిల్లలకు ఇది వినోదాత్మక విద్యతో పాటు వ్యాయామంగా ఉపయోగపడుతుంది. పక్షుల కోసం ప్రత్యేకంగా పాత్రలు ఏర్పాటుచేయటం, వాటిని నిత్యం నీటితో నింపటం, గింజలను పెట్టడం వంటివి నేర్పించవచ్చు. పక్షుల అలవాట్లు, పద్ధతులను గమనించగలిగితే వారి మనసుకు ఎంతో హాయి, ఉల్లాసం కలుగుతాయి.
ఇంకేమైనా చేయాలనుకుంటే..
కామిక్ పుస్తకాలు రాయవచ్చు. వివరించవచ్చు. ఆటపాటలతో కొన్ని తేలికైన సైన్స్ ప్రాజెక్టులు చేపట్టవచ్చు. శాస్త్రీయ, కళాత్మక స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రాఫ్ట్ కార్యక్రమాలు దోహదపడతాయి. మార్బుల్స్కు పెయింట్ వేయవచ్చు. వాల్ కలర్ చాక్స్తో గోడచిత్రాలు గీయవచ్చు. రాక్ పెయింటింగ్ చేయవచ్చు. వివిధ ఆకారాలు, పరిమాణాల ఆకులు, పువ్వులు సేకరించి చిత్తు పుస్తకాల్లో నొక్కి ఉంచి తరవాత వాటితో హెర్చేరియం తయారుచేయవచ్చు.
పిల్లలు మానసికంగా ఎదగటానికి చదువుతో పాటు ఆటలు ముఖ్యం. ఈరోజుల్లో ఆడుకోవటం తగ్గుతోంది. చిన్నతనంలో ఆడే ఆటలతో పిల్లల్లో మానసిక పరిపక్వత ఏర్పడుతుంది.
డాక్టర్ టి.ఆనంద్, సైకాలజిస్ట్, భద్రాచలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి