వంగిపోయారా? లొంగిపోయారా?
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు.
కడపలో రాళ్లదాడిపై పోలీసుశాఖ అంతర్మథనం
ఘటనపై ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తీవ్ర ఆగ్రహం
ఆరుగురు అధికారులపై చర్యలకు కసరత్తు
జమ్మలమడుగు పోలీస్స్టేషన్ వద్ద ఎస్పీ సిద్ధార్ధ కౌశల్, ఇతర పోలీసు అధికారులు
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 13న పోలింగ్ రోజు రాత్రి వైకాపా కీలక నేతలే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కడప నగరంలోని గౌస్ నగర్లో రాళ్లు రువ్వడంతో తెదేపా శ్రేణులు ప్రతిగా స్పందించాయి. ఈ వ్యవహారం తీవ్ర సంచలనం కలిగించింది. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. వాస్తవాలు తెలుసుకున్న ఎస్పీ నష్ట నివారణకు ఉపక్రమించారు.
ఈనాడు, కడప, న్యూస్టుడే, కడప నేర విభాగం: కడప నగరంలోని గౌస్ నగర్లో పోలింగ్ రోజు రాత్రి వైకాపా, తెదేపా వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. వైకాపా నేతలు దగ్గరుండి దొంగ ఓట్లు వేయిస్తున్నారనే సమాచారంతో అడ్డుకునేందుకు తెదేపా నేతలు, కార్యకర్తలు అక్కడకు వెళ్లగా వైకాపా రాళ్ల దాడికి పాల్పడింది. ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా సమక్షంలోనే వైకాపా శ్రేణులు రాళ్ల వర్షం కురిపించారు. అంజాద్ బాషా వాహనం ఎక్కి కేకలు వేయడం, ప్రత్యర్థులను రెచ్చగొట్టేలా ప్రయత్నించడంతో వారి పార్టీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయారు. ప్రతిగా తెదేపా కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఈ గొడవ దాదాపు రెండు గంటల పాటు రాత్రి సమయంలో ప్రధాన రహదారి మధ్యలో జరిగినా పోలీసులు చేష్టలుడికి చూస్తున్నారు. కనీసం నిలువరించే ప్రయత్నం సైత చేయలేదు. అదే రోజు సాయంత్రమే మేకలదొడ్డి పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు రెండు పార్టీల మధ్య కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా ముందస్తుగా పోలీసులను మోహరించకపోవడం, కేంద్ర బలగాలను వినియోగించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడప సున్నితమైన ప్రాంతం కావడం, రెండు పార్టీల మధ్య రెండు/ మూడు నెలల నుంచి గొడవలు జరుగుతున్న తరుణంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారనే అపవాదు ఉంది. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు ఘర్షణలను నిలువరించలేకపోగా వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. దీంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేకపోయారని గుర్తించి ఒకటో పట్టణ సీఐ భాస్కర్రెడ్డి, ఎస్.ఐ.రంగస్వామి, తాలుకా, చిన్నచౌక్, రిమ్స్, టూటౌన్ ఎస్.ఐ.లు తిరుపాల్ నాయక్, మహమ్మద్ రఫీ, ఎర్రన్న, మహ్మద్ అలీఖాన్లకు ఛార్జిమెమోలు జారీ చేశారు. వీరందరిపై సమగ్ర విచారణ చేపట్టి వైఫల్యాల స్థాయిని బట్టి చర్యలకు సిఫార్సు చేయాలని విచారణ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఒకట్రెండు రోజుల్లో చర్యలకు కసరత్తు జరుగుతోంది. కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న డీఎస్పీ షరీఫ్ను ఉపేక్షిస్తూ వదిలిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్పీ శనివారం రాత్రి జమ్మలమడుగు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసు అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్
కడప నగరంలోని కౌంటింగ్ కేంద్రం వద్ద వచ్చే నెల 4 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్ధకౌశల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కడప శివారులోని మౌలానా అబ్దుల్ కలాం అజాద్ ఉర్దూ విశ్వ విద్యాలయంలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందితో సమీక్షించారు. మరోవైపు నిఘా వర్గాల హెచ్చరికలను ప్రస్తావించారు. గెలుపొందిన అభ్యర్థులు నగరంలో ఎలాంటి ర్యాలీలు, విజయోత్సవాలు నిర్వహించరాదనే ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!